breaking news
Multani
-
నేచురల్ బ్యూటీ లుక్ : సీక్రెట్ షేర్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ మెరిసే చర్మం కోసం అద్భుతంగా పనిచేసే సాంప్రదాయ చిట్కాను షేర్ చేసింది. సెల్ఫ్ కేర్ సండే అంటూ తన రొటీన్ స్కిన్ కేర్ గురించి ఇన్స్టాలో పేర్కొంది. అలాగే తన మెరిసే చర్మం, అందం రహస్యాన్ని అభిమానులకు ఈ పోస్ట్ ద్వారా వివరించింది. దీనికి సంబంధించి కొన్ని అందమైన ఫోటోలను కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. హై-ఫ్యాషన్ అప్పీరియన్స్ కు పేరుగాంచిన భూమి పెడ్నేకర్ ప్రస్తుతం ‘ది రాయల్స్ సిరీస్’ విజయాన్నిఆస్వాదిస్తోంది. తాజాగా ముల్తానీ మిట్టి మాస్క్ తయారు చేసే వీడియెను, "సెల్ఫ్-కేర్ సండే" అనే క్యాప్షన్తో ఆమె చేతిలో గులాబీని పట్టుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar)ముల్తానీ మిట్టి - ప్రయోజనాలు సౌందర్య పోషణలో పురాతకాలంనుంచీ ముల్తానీ మట్టికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జిడ్డు, లేదా మొటిమల బారిన పడే చర్మానికి ఇది మేలు చేస్తుంది.మృత కణాలను తొలగిస్తుంది. లోతుగా శుభ్రపర్చి, అదనపు నూనెను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. చర్మాన్ని టైట్గా చేసి, వృద్ధాప్యల లక్షణాలను తొందరగా దరిచేరనీయదు. దీంట్లోని సున్నితమైన ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు నల్ల మచ్చలను పోగొట్టడానికి, పిగ్మెంటేషన్ను తగ్గించి, ఆరోగ్యకరమైన, ప్రకాశ వంతమైన మెరుపును అందించడానికి సాయపడతాయి. అలాగే ముల్తాని మట్టిలోని సహజ శీతలీకరణ ప్రభావం ఎండ ప్రభావంతో వచ్చిన మచ్చలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, ఆయిల్ను నియంతరించే లక్షణాలు కారణంగా ఇది మొటిమలు ఎక్కువగా వచ్చేవారికి ఇది బాగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: భారతీయ సంతతి ర్యాపర్ ఓవర్ యాక్షన్ : నెటిజన్ల తీవ్ర అగ్రహంముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి:ముల్తానీ మిట్టి పొడిని రోజ్ వాటర్ లేదా సాదా నీటితో కలిపి మృదువైన పేస్ట్ లా చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి, 15-20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. స్కిన్ తత్వాన్ని బట్టి పెరుగు, తేనె లేదా బాదం పాలను కూడా జోడించవచ్చు. (‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు)నోట్ : ఆధునిక కాలంలో బ్యూటీ ప్రొడక్ట్స్లో ముల్తాని మట్టిని విరివిగా వాడతారు. అయితే ముందుగా వేసుకునే వారు ప్యాచ్ టెస్ట్ వేసుకోవడం మర్చిపోవద్దు. ఒక వేళ ఏదైనా అలర్జీలాంటిది వస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. -
అడవి దొంగలు
ఇచ్చోడ, న్యూస్లైన్ : ఆదిలాబాద్ అడవుల్లో పాకిస్తాన్ గిరిజన తెగకు చెందిన ముల్తానీలు అడ్డా వేశారు. కలప అక్రమ రవాణాను జీవనాధారంగా చేసుకున్నారు. అక్రమంగా కలపను తరలించడమే వీరి నైజం. అడ్డొస్తే అటవీశాఖ అధికారులపై కూడా దాడులు చేయడానికి వెనుకాడటం లేదు. కరుడుగట్టిన నేర ప్రవృత్తి కలిగిన వీరిని అడ్డుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితా లు ఇవ్వడం లేదు. ఫలితంగా రూ.కోట్ల విలువ చేసే టేకు కలప జిల్లా సరిహద్దులు దాటుతోంది. గిరిజనులు అడవి తల్లిని నమ్ముకుని జీవ నం కొనసాగిస్తుండగా, ముల్తానీలు మాత్రం అడవులను తె గనరకటం జీవనాధారంగా చేసుకుని అడవితల్లిని క్షోభకు గురి చేస్తున్నారు. వలస వచ్చిన ముల్తానీలు పాకిస్తాన్ ముల్తాన్ ప్రావిన్స్ రాష్ట్రంలోని ముస్లిం గిరిజన తెగకు చెందిన ముల్తానీలు దాదాపు 60 ఏళ్ల క్రితం వలస వచ్చారు. మహారాష్ట్రలోని కిన్వట్ తాలుక చికిలి, ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం కేశవపట్నం, గుండాల, ఎల్లమ్మగూడ, జోగిపేట్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరు దాదాపు వమూడు గ్రామాల్లో దాదాపు 3వేలకుపైగా జనాభా ఉంటారు. స్వాతంత్య్రం రాక ముందు ముల్తాన్ రాష్ట్రం అవిభక్త భారతదేశంలో భాగంగా ఉండేది. దీంతో ముల్తానీలు అక్కడి నుంచి కూలీనాలీ చేసుకుంటూ సంచార జీవనం ప్రారంభించారు. పొట్ట చేతబట్టుకుని అడవుల గుండా గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు. పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా అవిర్భవించినా అక్కడికి వెళ్లలేదు. ఇక్కడమే ఐదు ఊళ్లు ఏర్పాటు చేసుకుని కలప అక్రమ రవాణాను ఉపాధిగా మార్చుకున్నారు. అనాగరికత, నిరక్షరాస్యత, అడవులపైనే ఆధారపడి జీవనం సాగించడంతో మొరటుతనానికి అలవాటు పడ్డారు. దీంతో తమ పనులకు అడ్డువచ్చిన వారిపై దాడులకు పాల్పడడం వీరికి నిత్యకృత్యమైంది. పనులన్ని రాత్రివేళల్లోనే.. ముల్తానీలు రాత్రి సమయంలో అటవీ ప్రాంతానికి వెళ్లి టేకు చెట్లను నరికి కలపను ఇంటికి తెచ్చుకుంటారు. తాము తెచ్చిన దుంగలను ఎండ్ల బండ్లలో రాత్రివేళల్లోనే గ్రామాలకు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి సమీపానికి తీసుకొస్తారు. కనీసం బండినేక బండి 20 నుంచి 30 బండ్లతోపాటుగా 40 మంది ముల్తానీలు బండ్లను అనుసరిస్తు వస్తుంటారు. మరో 10 మంది జాతీయ ర హదారులపై ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ పోలీసులు, అటవీ అధికారుల కదలికలను గమనిస్తారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన కలప వ్యాపారులు పం పించిన లారీలు, ఇతర వాహనాల ద్వారా జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే ఎడ్లబండ్ల ద్వారా తెచ్చిన కలప దుంగలను లారీల్లోకి ఎక్కిస్తారు. ఇదంతా కూడా అరగంటలోపే జరుగుతుంది. లోడ్ చేసిన లారీల ప్రాంతంలో పోలీసులు కాని అటవీ అధికారులు వెళ్తే రాళ్లు, కర్రలు, దుంగలు, ఆయుధాలతో దాడి చేస్తారు. దీంతో అటవీ సిబ్బంది అటువైపుగా వెళ్లడానికి సాహసించరు. దీంతో కలప సరిహద్దులు దాటిస్తారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు సాహసించి సంఘటన స్థలానికి వెళ్తే కలప లారీలను వదిలి వెళ్లి పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసులు, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం ఇచ్చోడ మండలంలోని మూడు గ్రామల్లో నివాసం ఉంటున్న ముల్తానీల ఆగడాలను అరికట్టడం కష్టమే మి కాదు. పోలీస్ ఉన్నతాధికారులు, అటవీశాఖ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ముల్తానీ లు రెచ్చిపోతున్నారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు సమష్టి నిర్ణయాన్ని తీసుకుంటే కలప స్మగ్లర్ల ఆగడాలను అడ్డుకట్ట వేయచ్చని పలువురు భావిస్తున్నారు. కాగా, గత మూడు నెలల్లోనే ఇచ్చోడ పోలీసులు రూ.30 లక్షల విలువ గల కలపను పట్టుకున్నారు. దీంట్లో 1038 కలప దుంగలను స్వాధీనం చేసుకుని, 18 మంది ముల్తానీలపై కేసులు నమోదు చేశారు. చెక్పోస్టులపైనే అనుమానాలు మితిమిరిపోతున్న కలప స్మగ్లర్లు రోజుకు ఒక్క వాహనంలో కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తునే ఉన్నా రు. ఇటు ఇచ్చోడ, నేరడిగొండ మండలంలో పోలీసు లు, అటవీ అధికారులు దాడులు నిర్వహించి కలప తరిలిస్తున్న వాహనాలను పట్టుకుంటున్నా కలప రవాణా ఆగడంలేదు. అంటే అధికారులు పట్టుకుం టున్న వాహనాలే కాకుండా సగనికి పైగా కలప వాహనాలు జిల్లా సరిహద్దులు దాటుతోంది. స్మగ్లింగ్కు పాల్పడుతున్న మూల్తానీలు చేస్తున్న జల్సాలే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. నేరడిగొండ మం డలంలోని మొండిగూట్ట, ఇస్పూర్ చెక్పోస్టు, సోన్ చెక్పోస్టుల నుంచి అక్రమంగా కలప తరిలిస్తున్న లారీలను కొందరు అటవీ అధికారులు, సిబ్బంది సహకరిస్తుండటంతోనే ఈ వ్యవహారం సాగుతున్నట్లు సమాచారం. స్మగ్లింగ్ను నివారించాం.. ఇచ్చోడ కేంద్రంగా అక్రమ కలప రవాణాను పూర్తిస్థాయిలో నివారించామని ఆదిలాబాద్ డీఎఫ్వో శేఖర్రెడ్డి అన్నారు. ఇచ్చోడ కేంద్రంగా జరుగుతున్న కలప రవాణాపై ఆదిలాబాద్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారి తిమ్మరెడ్డిని సాక్షి అడుగగా.. స్థానికంగా ఉండే అధికారులు వివర ణను కోరాలని, అక్కడి సమాచారం తన వద్ద ఉండదన్నారు. దీంతో డీఎఫ్వో శేఖర్రెడ్డిని అడుగగా.. స్మగ్లింగ్ను నివారించామన్నారు. ప్రస్తుతం అక్రమంగా కలప రవాణా జరగడడం లేదన్నారు.