breaking news
moina bad
-
ఆటోక్రాస్ ఛాంపియన్ షిప్
-
పార్టీ మారే ప్రసక్తే లేదు
మొయినాబాద్, న్యూస్లైన్: రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు, నమ్మకానికి ఆనాటి నుంచి స్వర్గీయ ఇంద్రారెడ్డి కుటుంబం కట్టుబడి ఉందని, తాను పార్టీ మారే ప్రసక్తేలేదని మాజీ హోంమంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ సబితారెడ్డి పార్టీ మారుతున్నట్లు టీవీల్లో స్క్రోలింగ్లు చూసి ఆందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. 14 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ తనకు గౌరవం ఇచ్చిందని, తాను ఏ పార్టీలోకీవెళ్లడంలేదని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళనకు గురికావొద్దన్నారు. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ముందుగానే అందరితో చర్చిస్తానని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం రాజకీయమంతా తన చుట్టే తిరుగుతోందని, టీడీపీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే దానిలో నా ప్రమేయం ఉందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. ఎవరో ఏ పార్టీలోకో వెళితే అందులో తన ప్రమేయం ఉందనటం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి ఇచ్చిన మాట ప్రకారం సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని, తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలని సబితారెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించేందుకు కష్టపడి పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీటీడీ మాజీ సభ్యుడు కాలె యాదయ్య, నాయకులు వెంకటస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్.కృష్ణారెడ్డి, కంజర్ల భాస్కర్, మోత్కుపల్లి రాములు, దారెడ్డి కృష్ణారెడ్డి, కండిక రమేష్, పురుషోత్తంరెడ్డి, పురాణం వీరభద్రస్వామి, నర్సింహారెడ్డి, రామకృష్ణగౌడ్, ఈగ రవీందర్రెడ్డి, దర్శన్, రవూఫ్ పాల్గొన్నారు. -
పేదల బతుకుల్లో వైఎస్ వెలుగులు నింపారు
మొయినాబాద్ రూరల్, న్యూస్లైన్: దివంగత ముఖ్యమంత్రి పేదల బతుకుల్లో వెలుగులు నింపి చిరస్మరణీయుడిగా మిగిలిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని అలేఖ్య రిసార్ట్లో నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫించన్లు, ఉచిత విద్యుత్, రేషన్ బియ్యం, 108, 104, ఆరోగ్యశ్రీ, రుణాల మాఫీ తదితర పథకాలతో రాష్ట్రంలో లబ్ధి పొందని కుటుంబమే లేదంటే అతిశయోక్తి కాదన్నారు. ప్రతి కార్యక్రమాన్ని వైఎస్ చేవెళ్ల నుంచే ప్రారంభించి నియోజకవర్గానికి దేశస్థాయిలో గుర్తింపుతెచ్చిన విషయాన్ని ప్రజలెవరూ మరవలేదన్నారు. వైఎస్ఆర్ పథకాలతో లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ తమ పార్టీకి అండగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్ సీపీని గెలిపించి మహానేత రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తపనతోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆలోచించారన్నారు. తెలుగు వారున్న రెండు రాష్ట్రాలనూ సువర్ణ ఆంధ్రప్రదేశ్, సువర్ణ తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు జగన్ తాపత్రయపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి, చైతన్యం కలిగించాల్సిన బాధ్యత పార్టీ నాయకులపైనే ఉందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం.. రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్గౌడ్, చేవెళ్ల నియోజక వర్గ ఇన్చార్జి రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు మహేందర్రెడ్డి, బాల్రాజ్, ఆయా మండలాల అధ్యక్షులు రాజయ్య, ప్రతాప్రెడ్డి, క్రిష్ణ, డి. బల్వంత్రెడ్డి, పిఆర్. క్రిష్ణ, నాయకులు కాంతారావు, శంకర్నాయక్, రెడ్డియా నాయక్, వెంకటేష్, వడ్డె సత్యయ్య, వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, జొన్నాడ రాజు, ఖాజాపాషా, లకా్ష్మరెడ్డి, సుధాకర్రెడ్డి, పాండు తదితరులున్నారు.