breaking news
MLC bodakunti Venkateswarlu
-
'ఆ ఎంపీ ఎవరిని తిడతాడో ఆయనకే తెలియదు'
హైదరాబాద్ : ‘కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్రెడ్డి ఎప్పుడు ఎవరిని తిడతాడో ఆయనకు సోయి లేకుండా పోయింది. ఆయనకు రోజు రోజుకూ పిచ్చి ముదురుతోంది. సొంత పార్టీ, బయటి పార్టీ అన్న తేడా ఏమీ లేకుండా ఎవరు గుర్తొస్తే వారిని నోటికి వచ్చినట్లు తిట్టడం అలవాటుగా మారింది..’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఢిల్లీలో పాల్వాయి నోటికొచ్చినట్లు విమర్శలు చేశారని, ఆయన చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న పాల్వాయి చేసిన అభివృద్ధి ఏమిటని నిలదీశారు. ఫ్లోరైడ్ పీడిత మునుగోడు నియోజకవర్గానికి ఒక్క ప్రాజెక్టయినా ఎందుకు తీసుకు రాలేక పోయారు? ఆయనకు ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. 46వేల చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్ కాకతీయ, పల్లెపల్లెకు తాగునీరు అందించేందుకు మొదలు పెట్టిన వాటర్ గ్రిడ్ పథకాలకు ప్రశంసలు దక్కుతుంటే ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం ఆ పథకాలపై విషం కక్కుతున్నాయని, ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నాయని విమర్శించారు. ఇకనైనా ప్రతిపక్షాలు తమ వైఖరు మార్చుకోవాలని బోడకుంటి హితవు పలికారు. -
కోర్టుకు హాజరైన కొండా సురేఖ, బోడకుంటి
జనగామ రూరల్: ఓ కేసు విషయమై వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గురువారం జనగామ కోర్టుకు హాజరయ్యూరు. 2008లో వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ, టీడీపీ తరఫున బోడకుంటి వెంకటేశ్వర్లు అభ్యర్థులుగా పోటీ చేశారు. చేర్యాలలో కొండా సురేఖ సమయానికి మించి ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపిస్తూ బోడకుంటి వెంకటేశ్వర్లు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల అధికారి కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఇరువురు జనగామ కోర్టుకు హాజరయ్యూరు. అడిషనల్ ఫస్ట్ క్లాసు మెజిస్ట్రేట్ టి.నర్సిరెడ్డి ఈనెల 16కు వాయిదా వేశారని న్యాయవాది ఆలేటి సిద్ధిరాములు తెలిపారు. కొండా సురేఖ, బొడకుంటి వెంకటేశ్వర్లును కలుసుకున్న వారిలో ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రవి, సర్పంచ్ జయప్రకాష్ నారాయణరెడ్డి, నాయకులు ఈగం శ్రీనివాస్ ఉన్నారు.