breaking news
minor Dalit girl
-
ఢిల్లీ హత్యాచార ఘటన: రాహుల్ చేష్టలపై సీరియస్
Delhi Dalit Minor Case: ఢిల్లీ మైనర్ హత్యాచార ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించడం పరస్పర రాజకీయ విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బాధితురాలి తల్లిదండ్రుల ఫొటోల్ని తన ట్విటర్లో రాహుల్ పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) సీరియస్ అయ్యింది. శ్మశాన వాటికలో మంచి నీళ్ల కోసం వెళ్లిన బాలికపై అక్కడున్న కొందరు హత్యాచారానికి పాల్పడ్డారని, ఆపై తల్లిదండ్రుల సమ్మతి లేకుండా అంత్యక్రియలు నిర్వహించారన్న కేసు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ తరుణంలో తొమ్మిదేళ్ల దళిత మైనర్ బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం రాహుల్ గాంధీ తన ట్విటర్లో ఫొటో పోస్ట్ చేశాడు. అయితే జువెనైల్ జస్టిస్-పోక్సో చట్టాల ప్రకారం.. అలా ఫొటోల్ని, వివరాల్ని బయటపెట్టడానికి వీల్లేదు. తద్వారా బాధితురాలి ఐడెంటిటీ బయటపడే అవకాశం ఉంది. ఇది చట్ట విరుద్ధం కూడా. ఈ నేపథ్యంలోనే బాలల కమిషన్ స్పందించింది. రాహుల్ పోస్ట్పై మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు, ట్విటర్కు ఎన్సీపీసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్విటర్ రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్కు సదరు ట్వీట్ను తొలగించాలంటూ ఓ లేఖ కూడా రాసింది. ఇక రాహుల్ చర్యలపై జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ డీసీపీ(నైరుతి విభాగం)కి మరో ప్రత్యేక లేఖలో కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని 48 గంటల డెడ్టైన్ విధించింది ఎన్సీపీసీఆర్. ఇక ‘ఓటేసే ముందు నిర్భను గుర్తు తెచ్చుకోండి’ అంటూ గతంలో మోదీ చేసిన ప్రచారాన్ని తెర మీదకు తెచ్చిన కాంగ్రెస్.. తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్పై కౌంటర్ దాడులు చేస్తోంది. -
రెండు నెలలుగా బాలికకు పన్నెండుమంది నరకం
తిరువనంతపురం: కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత బాలికపై పన్నెండు మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండు నెలలుగా ఆ బాలికకు నరకం చూపించారు. ఈ దాడికి పాల్పడినవారిలో ఏడుగురును పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కీలక నిందితుల కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం తిరువనంతపురం జిల్లాకు సరిహద్దులో ఉన్న అత్తింగర్ అనే ప్రాంతంలో ఓ పదిహేనేళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. మానసిక వికలాంగురాలైన తన తల్లి, వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో ఉంటోంది. ప్రస్తుతం పదో తరగతి పూర్తి చేసుకున్న ఆ బాలిక పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతోంది. కుటుంబ కష్టాల్లో ఉన్న కారణంగా పోషణ నిమిత్తం సినిమాటిక్ డ్యాన్సర్ గా కూడా పనిచేస్తోంది. అయితే, గత ఫిబ్రవరి 2న ఆమె సోదరుడి ఇద్దరు స్నేహితులు అమిర్, అనుప్ షా తమ ఆటో రిక్షాలో తీసుకెళ్లి ఓ ఏడారి ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వరుసగా రెండు నెలలపాటు ఆ బాలికపై పన్నెండుమంది ప్రతిరోజు లైంగిక దాడి చేస్తూ నరకం చూపించారు. చివరకు పోలీసులకు ఈ విషయం తెలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.