breaking news
Ministry of Tribal Affairs
-
ప్రీ–మెట్రిక్ ఉపకార వేతనం 9, 10 తరగతులకే: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రీ మెట్రిక్ ఉపకార వేతన పథకాన్ని ఇకపై 9, 10వ తరగతి విద్యార్థులకే వర్తింపజేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. గతంలో ఒకటి నుంచి పదో తరగతి దాకా మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం కింద స్కాలర్షిప్ వచ్చేది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిర్బంధ ఉచిత విద్య అమలవుతున్నందున వారికి ఉపకార వేతన ప్రయోజనాల అవసరం ఉండదని చెప్పుకొచ్చింది. ఇకపై స్కాలర్షిప్ల కోసం 9, 10 తరగతి విద్యార్థుల దరఖాస్తులనే పరిశీలించాలని రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారులకు సూచించింది. దీనిపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘దశాబ్దాలుగా లబ్ధి పొందుతున్న పేద విద్యార్థులను ఆర్థికంగా మరింత కుంగదీసేలా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తంచేశారు. -
‘త్వరలో గిరిజన సంక్షేమశాఖ ఖాళీలు భర్తీ’
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ ప్రకటించారు. గిరిజన సంక్షేమశాఖ పనితీరును అధికారులతో తన ఛాంబరులో గురువారం సమీక్షించారు. గిరిజన పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తామని, గిరిజన విద్యావంతులు అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా శిక్షణ ఇప్పిస్తామన్నారు. బాలికల వసతి గృహాల లోపాలు సవరించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, అన్ని హాస్టళ్లకు ప్రహరిగోడలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.