-
ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయుల బదిలీలు, ఆదర్శ పాఠశాలలపై ఉత్కంఠ నెలకొంది. తొలుత బుధవారం టీచర్ల బదిలీలు, మోడల్ స్కూళ్ల హేతుబద్ధీకరణపై స్పష్టత వస్తుందని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యాశాఖాధికారులు రోజంతా ఎదురు చూశారు. కానీ రాత్రి వరకూ ప్రభుత్వం దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో గురువారం ఏదో ఒక నిర్ణయం వెలువడవచ్చన్న అభిప్రాయానికొచ్చారు. జిల్లాలో 3,321 ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఏజెన్సీ ప్రాంతంతో పాటు వాగులు, వంకలు, గెడ్డలు, రైల్వే ట్రాకులకు దగ్గరగా ఉన్న స్కూళకు, మైనార్టీ, ఎయిడెడ్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు హేతుబద్ధీకరణ నుంచి మినహాయింపునిచ్చింది. ఇవన్నీ పోగా 2,600 స్కూళ్లున్నాయి. వీటిలో విద్యా హక్కు చట్టం ప్రకారం కిలోమీటరు పరిధిలో రెండుకు మించి పాఠశాలలుంటే అందులో 80 మంది పిల్లలున్న స్కూలుని మోడల్గా గుర్తించి, రెండో పాఠశాలలను మూసివేస్తారు. అందులో పిల్లలను మోడల్ స్కూల్కు బదలాయిస్తారు. ఇలా జిల్లాలో 162 ప్రైమరీ స్కూళ్లు మూతపడనున్నాయి. వీటితో పాటు కిలోమీటరు లోపు, 80 మందికిపైగా విద్యార్థులున్న 142 పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చనున్నారు. అలాగే 80 కంటే తక్కువ హాజరున్న బడులను పాజిటివ్ కన్సాలిడేషన్ స్కూళ్లుగా నడపనున్నారు. వీటిలో 30 మంది పిల్లలకు ఒకరు, 60 మంది ఉంటే ఇద్దరు చొప్పున టీచర్లను కేటాయిస్తారు. ప్రైమరీ మోడల్ స్కూల్లో మాత్రం 20 మందికి ఒకరు చొప్పున 80 మందికి నలుగురు టీచర్లను నియమిస్తారు. 12న విజయవాడలో డీఈఓలతో మంత్రి గంటా భేటీ విజయవాడలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు, డిప్యూటీ డీఈవోలు, సర్వశిక్షా అభియాన్ పీవోలతో టీచర్ల బదిలీలు, సీనియారిటీ, విద్యార్థుల ఆధార్ సీడింగ్, పాఠశాలల్లో మరుగుదొడ్ల ప్రగతి తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 12న సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఒక అభిప్రాయానికొచ్చే దాకా బదిలీలు, మోడల్ స్కూళ్ల హేతుబద్ధీకరణపై స్పష్టత వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా మంగళవారం నాటికి ఉన్న ఆదేశాల మేరకు 2013లో బదిలీ అయి రిలీవ్ కాని 33 మంది స్కూల్ అసిస్టెంట్లు, 124 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆయా స్కూళ్లలో బుధవారం చేరాల్సి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేని కారణంగా ఆ ప్రక్రియ కూడా వాయిదా పడింది. -
బతుకు చూపించే వాడే బడి పంతులు!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఒకప్పుడు బతకడానికి బడిపంతులు అనేవారని.. అయితే ఈరోజు బతుకు చూపించేవాడు బడిపంతులు అని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నగర శివారులోని ఎంజీఎం ఫంక్షన్ హాలులో ప్రాంతీయ విద్యా సదస్సు మంగళవారం జరిగింది. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల విద్యాశాఖ, ఎస్ఎస్ఏ అధికారులు, ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో ప్రధానోపాధ్యాయులు కీలకమన్నారు. కొన్ని చోట్ల ఎక్కువమంది టీచర్లు తక్కువమంది విద్యార్థులు, మరి కొన్నిచోట్ల తక్కువ మంది టీచర్లు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారన్నారు. దీనికి రేషనలైజేషన్ చేపట్టి నిష్పత్తి సమానంగా ఉండేలా చూస్తామని తెలిపారు. అంతేకాని ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తామని జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. ప్రభుత్వ విద్య అమలులో కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని, అలాంటి వృత్తికి వన్నె తేవాలని ఆకాంక్షించారు. ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి పాఠశాలలోనూ మొక్కలు నాటాలన్నారు. పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్విప్ కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ మార్పు టీచర్ల చేతుల్లో ఉందన్నారు. కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల సాధనకు హెచ్ఎంలు ఈసారి బాగా కష్టపడ్డారన్నారు. 93 శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషమే అయినా...తక్కిన ఏడు శాతం విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుదామని ప్రశ్నించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని కోరారు. ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు సొంతబడిగా భావించి బాధ్యతగా పని చేయాలన్నారు. ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు మరుగుదొడ్లు కావాలని అడుగుతున్నా పట్టించుకోని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు, హెచ్ఎంలతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రభుత్వ విప్ యామినిబాల, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, పార్థసారథి, ఉన్నం హనుమంతరాయచౌదరి, ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ రమణకుమార్ పాల్గొన్నారు. -
ఇంకా నాన్చుడే
నెల్లూరు(విద్య) : ఊరించి ఊరించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్పష్టతలేని నోటిఫికేషన్తో అభ్యర్థులు అనేక ఇబ్బందులుపడ్డారు. ఎట్టకేలకు టెట్కమ్ టీఆర్టీను నిర్వహించారు. ఫలితాలను విడుదల చేశారు. ఉద్యోగాల భర్తీకోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. రోజుకో అనుమానం అభ్యర్థుల్లో తలెత్తుతోంది. టెట్ కమ్ టీఆర్టీలో అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను హైదరాబాద్ నుంచి విడుదల చేస్తారని ఊహాగానాలు వాస్తవమయ్యేలా ఉన్నాయి. ఆ జాబితాను అనుసరించి పోస్టులు భర్తీ చేస్తారని చెప్పుకుంటున్నారు. జిల్లా నుంచి రోస్టర్ పాయింట్, మెరిట్ జాబితాను హైదరాబాద్కు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు అందుకోవడం ఈ వాదనకు బలం చేకూర్చింది. అలాగైతే జిల్లాస్థాయిలో డీఎస్సీ నిర్వహించడం ఎందుకని విద్యార్థుల్లో ప్రశ్నలు రేగుతున్నాయి. జిల్లాలో రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా ఎంపిక జాబితాను విడుదల చేసి అభ్యంతరాలను సేకరించి జిల్లా స్థాయిలో కౌన్సెలింగ్ చేపట్టి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ఈసారి జరిగిన డీఎస్సీలో నియామక ప్రక్రియ ఉంటుందని వస్తున్న ఊహాగానాలతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాస్థాయిలోనే ఎంపికలు జరుగుతుంటే పలువురికి అన్యాయాలు జరిగిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి. హైదరాబాద్ స్థాయిలో ఎంపికలు జరిగితే అవకతవకలు జరిగితే తెలిసేదెలా అని అభ్యర్థుల్లో నైరాశ్యం చోటు చేసుకుంటుంది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మాటేమిటి..? : ఈనెల15న కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు విడుదల చేసే సమయంలో గంటాపథంగా చెప్పారు. అయితే ఇప్పటివరకు మెరిట్ లిస్ట్ సైతం విడుదల చేయలేదు. కోర్టు కేసుల నేపథ్యంలో జాప్యం జరుగుతుందని సమాచారం. ఈ క్రమంలో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయం అభ్యర్థులను వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన అందరినీ ఒకేచోటకు చేర్చి నియామకపత్రాలు అందజేస్తారా లేదా జిల్లాస్థాయిలోనే పోస్టింగ్ ప్రక్రియ జరుగుతుందనే అంశంపై సందిగ్ధత నెలకొంది. తర్జనభర్జన...: తాజాగా వెబ్ కౌన్సెలింగ్ను తెరపైకి తెచ్చేందుకు అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో ఈప్రయోగం ఫలిస్తుందా? అనే సందేహం లేకపోలేదు. ఈ విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ర్యాంకుల ఆధారంగా ఆన్లైన్లోనే వారికి కావాల్సిన పాఠశాలలను ఎంపిక చేసుకొనేలా అవకాశం ఇస్తారని కూడా ప్రచారంలో ఉంది. దీంతో డీఈఓ కార్యాలయం, జిల్లా ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండానే హైదరాబాద్ నుంచి నియామకాలు చేపట్టాలంటున్నారు. నోటిఫికేషన్ నుంచి అనేక మలుపులు తిరిగినా డీఎస్సీ నియామకాల్లో సైతం పలు ట్విస్ట్లు చోటు చేసుకోవడం గమనార్హం. -
మరోవారం ఉత్కంఠ
అందుబాటులోకి రాని జిల్లాల వారీ వివరాలు సబ్జెక్టుల వారీగా మార్కుల తెలియక అయోమయం డీఎస్సీ అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం విశాఖ ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షా ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. జిల్లాల వారీ ఫలితాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. మార్కులు మాత్రమే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పూర్తిస్థాయిలో ఫలితాలు తెలియడానికి ఈ నెల 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు, రోస్టర్ విధానం, క్వాలిఫై అయిన వారి వివరాలు 9వ తేదీ నాటికి అందిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని 1,056 పోస్టులకుగాను గత నెల 9,10,11 తేదీల్లో జరిగిన డీఎస్సీ పరీక్షలకు 36,490 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందరి మార్కులు కలిపి ప్రకటించడంతో స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, ఎస్జీటీ, పీఈటీ విభాగాల్లో పరీక్ష రాసిన అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. మార్కులు తెలిసినా పోస్టు వస్తోందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. వెబ్సైట్లో అత్యధికంగా 166 మార్కులు వచ్చినట్టు ప్రకటించినా.. ఆ మార్కులు ఏ సబ్జెక్టుకు సంబంధించినవో ఆ అభ్యర్థికి తప్ప ఎవరికీ తెలియడంలేదు. ఆయా సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు కూడా తెలియడం లేదు. అభ్యర్థుల గందరగోళం: జిల్లాల వారీగా ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తమ మార్కుల వివరాలు చూసుకుంటున్న అభ్యర్థులు, తాము ఏ స్థానంలో ఉన్నామో?, పోస్టు వస్తుందో? రాదో అనే గందరగోళంలో ఉన్నారు. గతంలో వచ్చిన డీఎస్సీ ఫలితాల్లో పూర్తిస్థాయి సమాచారం వెంటనే అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల ఫలితాలు కలిపి ప్రకటించడంతో వెబ్సైట్లో మార్కులు చూసి కూడా అంచనాకు రాలేకపోతున్నారు. రిజర్వేషన్ ఉన్నవారు కటాఫ్ ఎంత ఉంటుందని తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఈ నెల 9వ తేదీ వరకు అభ్యర్థులకు తప్పదు. -
నవ్యాంధ్ర నిర్మాణానికి పునరంకితమవుదాం
నవనిర్మాణ దీక్షలో ఆర్థిక మంత్రి యనమల సాక్షి, విశాఖపట్నం : నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ర్ట విభజన చేయడంతోపాటు విభజన చట్టంలో కూడా ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాకుండా తీరని రెవెన్యూలోటుతో పాటు భారీ అప్పులను అంటగట్టారన్నారు. రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో అందరం సమష్టిగా శ్రమించి నవ్యాంధ్ర నిర్మించుకుందామన్నారు. విభజన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం స్థానిక గవర్నర్ బంగ్లా నుంచి ఏయూ వరకు నవ నిర్మాణ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏయూ కాన్వొకేషన్ హాలులో జరిగిన సమావేశంలో సభికులతో నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏ వర్గానికి లోటు రానీయకుండా చేస్తున్నామన్నారు. అర్హులందరికీ రెండు లక్షల పింఛన్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించి పేదరికాన్ని పారదోలేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని త్వరలో తరలిస్తామన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోయే తమకు పవిత్ర గ్రంథమని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే బెల్టుషాపులు రద్దు చేశామని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచామని, రైతు రుణమాఫీ చేశామని, రేపటి నుంచి డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్రాజు, పోలీస్ కమిషనర్ అమిత్గార్గ్, ఎస్పీ కోయ ప్రవీణ్, డీఐజీ రవిచంద్ర, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్కుమార్, ఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు, వుడా వీసీ బాబూరావు నాయుడు, జేసీలు జె.నివాస్, డీవీ రెడ్డి, డీఆర్వో కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement