breaking news
Michelle-Obama
-
అష్ట కాంతులు
న్యూయార్క్లో 1969 నుంచీ ‘నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్’ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఉన్న ప్రదేశంలో 173 ఏళ్ల క్రితం తొలిసారి మహిళా హక్కుల సదస్సు జరిగింది. ఆ సదస్సు జరిగిన స్థలం కావడం, రెండేళ్లకోసారి ఆ సంస్థ అమెరికాలోని ప్రసిద్ధ మహిళల్ని విశిష్ట వ్యక్తులుగా ఎంపిక చేసుకోవడం.. ఈ రెండు కారణాల వల్ల ‘హాల్ ఆఫ్ ఫేమ్’కి చారిత్రక ప్రాధాన్యం ఏర్పడి, ఆ హాల్కి (సంస్థకి) ఎంపికవడం ఒక ప్రతిష్ట అయింది. ప్రతి బేసి (సంఖ్య) సంవత్సరంలో ఈ ప్రతిష్టాత్మక ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది మిషెల్ బబామా, మరో ఏడుగురు మహిళలు హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం పొందారు. వచ్చే అక్టోబర్ 2 న ఈ ఎనిమిది మందిని నేషనల్ ఉమెన్స్ ఆఫ్ ఫేమ్ అధికారికంగా తన రికార్డులలో చేర్చుకుంటుంది. మొన్నటి మహిళా దినోత్సవం రోజు హాల్ ఆఫ్ ఫేమ్ వీళ్ల పేర్లను ప్రకటించింది. మిషెల్ ఒబామా (57) నలభై నాల్గవ అమెరికా ప్రథమ మహిళ. ఆ స్థానంలోకి వచ్చిన తొలి నల్లజాతి మహిళ కూడా. ‘21వ శతాబ్దపు అత్యంత ప్రభావశీలి అయిన ఆదర్శమూర్తి’ అని హాల్ ఆఫ్ ఫేమ్ మిషెల్ను అభివర్ణించింది. మిషెల్ మహిళలు, బాలికల హక్కుల ఉద్యమకారిణి, న్యాయవాది, రచయిత్రి. ప్రథమ మహిళగా ఉన్న ఎనిమిదేళ్ల కాలంలోనూ మిషెల్ శ్వేత సౌధానికి వన్నెతెచ్చారు. వైట్ హౌస్ను పీపుల్స్ హౌస్గా మార్చారు! ఆ తర్వాత కూడా మిషెల్ ప్రజా సంక్షేమం కోసమే పనిచూస్తూ ఉన్నారు. బాలల్లో స్థూలకాయం తగ్గించేందుకు ‘లెటజ్ మూవ్’, నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ‘రీచ్ హయ్యర్’, వృద్ధుల కోసం ‘జాయినింగ్ ఫోర్సెస్’, కౌమారదశలోని బాలిక ల విద్యకు ‘లెట్ గర్ల్స్ లెర్న్’.. ఇలా అనేక కార్యక్రమాలను రూపొందించారు మిషెల్. 2018లో ‘బికమింగ్’ అనే పేరుతో తన జ్ఞాపకాలను పుస్తకంగా తీసుకువచ్చారు. తన బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్కు 2020లో గ్రామీ అవార్డు పొందారు! హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం సంపాదించిన మిగతా ఏడుగురిలో రెబెక్కా హాల్స్టెడ్ (62) మిలటరీ అధికారి. జోయ్ హర్జో (69) కవయిత్రి, రచయిత్రి. ఇంద్రానూయీ (65) పెప్సీ కంపెనీ తొలి మహిళా సీఈవో. మియా హమ్ (48) సాకర్ లెజెండ్. జూడీ చికాకో (81) చిత్రకారిణి. తక్కిన ఇద్దరిలో ఆక్టేవియా ఇ బట్లర్ (1947–2006) సైన్స్ రైటర్. ఆమె గౌరవార్థం ఆమె పేరుతో నాసా ఇటీవలే అంగారకుడిపై పెర్సీ రోవర్ దిగిన చోటుకు నామకరణం చేసింది. ఆక్టేవియా ల్యాండింగ్ అంటారు ఇకపై ఆ ప్రదేశాన్ని! ఇక నాసా గణితశాస్త్ర వేత్త అయిన క్యాథరీన్ జాన్సన్ (1918–2020) ముప్పై ఐదేళ్ల పాటు నాసాలో పని చేశారు. మిషెల్ బబామా, మరో ఏడుగురు మహిళలు ఈ ఏడాది ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందారు. వారిలో ఇద్దరు.. బెస్ట్ సెల్లింగ్ సైన్స్–ఫిక్షన్ రచయిత్రి ఆక్టేవియా, నాసా గణిత శాస్త్రవేత్త క్యాథరీన్ జాన్సన్లకు.. మరణానంతరం ఈ గౌరవం దక్కింది. -
అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!
బరాక్ ఒబామా... అమెరికా మాజీ అధ్యక్షుడిగా, మాజీ సైనికుడిగా మనందరికీ చిరపరిచితమైన పేరిది. రచయితగా ఆయన గురించి తెలిసింది కొంతే. కానీ...‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పేరుతో ఒబామా ఈ కొరతను తీర్చేశారు. 17న విడుదల కానున్న ఈ పుస్తకంలో అగ్రరాజ్యానికి తొలి నల్లజాతి అధ్యక్షుడిగా తన అనుభవాలను దేశాధినేతలు, రాజకీయ పార్టీల నాయకులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. లోతైన అధ్యయనం.. క్లుప్తత... కాసింత హాస్యం కలబోసి ఆయన ఎవరి గురించి ఏమన్నారంటే..? ధైర్యం లేని, అపరిపక్వమైన నాణ్యత! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గాంధీ వంశ వారసుడు రాహుల్ గాంధీని బరాక్ ఒబామా అధైర్యంతో కూడిన, అపరిపక్వమైన నాణ్యత కలిగిన నాయకుడిగా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో వర్ణించారు. ఇదే అంశాన్ని ఇంకాస్త వివరిస్తూ.. ‘‘రాహుల్గాంధీ ఓ విద్యార్థి అనుకుంటే... చదవాల్సిందంతా చదివి టీచర్ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న వాడిలా కనిపిస్తాడు. కానీ.. చదివిన విషయంపై పట్టు సాధించాలన్న అభిరుచి, మోహం రెండింటిలో ఏదో ఒకటి లోపించినట్లు అనిపిస్తుంది’’అని వ్యాఖ్యానించారు. అందం ఆమె సొంతం ‘‘చార్లీ క్రైస్ట్, రామ్ ఎమ్మాన్యుల్ వంటి మగవాళ్ల అందం గురించి అందరూ చెబుతూంటారు. మహిళల సౌందర్యం గురించి మాత్రం వాళ్లూ వీళ్లు చెప్పేది తక్కువే. ఒకట్రెండు సందర్భాలను మినహాయిస్తే సోనియాగాంధీ విషయంలోనూ ఇదే జరిగింది.’’అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా..కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురించి చేసిన వ్యాఖ్య ఇది. నిష్పాక్షికత..చిత్తశుద్ధి దేశంలో ఆర్థిక సరళీకరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా.. పదేళ్లపాటు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ను బరాక్ ఒబామా అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రాబర్ట్ గేట్స్తో పోల్చారు. ఇద్దరూ దయతో కూడిన నిష్పాక్షికత కలిగిన వారని, వారి చిత్తశుద్ధి, సమగ్రతలూ ఎన్నదగ్గ లక్షణాలని కొనియాడారు. కండల వీరుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు కండల వీరుడిని గుర్తుకు తెస్తాడని ఆయన శరీరాకృతి అద్భుతమని ఒబామా వ్యాఖ్యానించారు. షికాగో రాజకీయాల్లోని తెలివైన రాజకీయ నేతల మాదిరిగా పుతిన్ వ్యవహారం ఉంటుందని ఒబామా వర్ణించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. కొన్నిసార్లు కష్టమే అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురించి మాజీ అధ్యక్షుడు, సహచర డెమోక్రాట్ అయిన బరాక్ ఒబామా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ మంచి మనిషి, నిజాయితీ కలవాడు అంటూనే.. కొన్నిసార్లు తనకు కావాల్సింది దక్కలేదు అనుకుంటే ఇబ్బందికరంగా మారగలగడని అన్నారు. తనకంటే తక్కువ వయసున్న బాస్తో (ఒబామా) వ్యవహరించేటప్పుడు ఈ నైజం మరింత ఎక్కువవుతుందని అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వైట్హౌస్లో నల్లవాడిని చూసి భయపడ్డారు అమెరికా అధ్యక్షుడిగా ఓ నల్లజాతీయుడు వైట్హౌ స్లో అడుగుపెట్టడం లక్షల మంది శ్వేతజాతీయుల కు భీతి కలిగించిందని, వీళ్లంతా రిపబ్లికన్ పార్టీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న దుష్టశక్తులని ఒబామా తన పుస్తకంలో తెలిపారు. నల్లజాతీయుడి గా తనను వ్యతిరేకించిన వారు జినోఫోబియా (ఇతర జాతీయులపై తీవ్రమైన భయం)తో బాధపడే వారేనని, మేధావితనం అన్నా వీరికి అంతగా నచ్చదని, నిత్యం కుట్ర సిద్ధాంతాలను పట్టుకు వేళ్లాడేవారు, నల్లజాతి వారు ఇతరులపై ద్వేషం ఉన్న వారు తనను వైట్హౌస్లో ఓర్వలేక పోయారని ఒబామా వివరించారు. ఇలాంటి వారందరికీ డొనాల్డ్ ట్రంప్ అమృతాన్ని అందిస్తాన ని హామీ ఇచ్చి గద్దెనెక్కారని విమర్శించా రు. డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి వైదొలగినా అమెరికా రాజకీయాల్లోని విభేదాల అగాధాన్ని పూడ్చలేవని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికా అంటే ఏమిటి? అది ఎలా ఉండాలన్న భావనల విషయం లో మౌలికంగా ఉన్న అభిప్రాయ భేదాలు ఈ సంక్లిష్టపరిస్థితికి కారణమని.. దీనివల్ల ప్రజాస్వా మ్య వ్యవస్థ కూడా సంక్షోభంలో పడినట్లు కనిపిస్తోందని ఒబామా ప్రస్తుత రాజకీయ పరిస్థితి ని విశ్లేషించారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇద్దరూ ఒకప్పుడు నమ్మకముంచిన వ్యవస్థలు, విలువలు, ప్రక్రియలపై నమ్మకం కోల్పోయేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమిలీ ముఖంలో ఏమీ కనిపించేది కాదు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయోవాలోని తన సిబ్బందిలో ఒకరైన ఎమిలీ గురించి ఒబామా వ్యాఖ్యానిస్తూ... ‘‘ఎమిలీ ముందు నా వాక్చాతుర్యం, విమర్శలు మొత్తం కుప్పకూలిపోయేవి. కనురెప్ప వేయకుండా.. ఏ రకమైన భావం కనిపించకుండా ఎమిలీ చూపులు ఉండేవి. ఇక లాభం లేదనుకుని ఆమె ఏం చెబితే అది చేసేందుకు ప్రయత్నించేవాడిని’’అన్నారు. అంతేకాదు.. అలాస్కా గవర్నర్, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన సారా పాలిన్ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏం మాట్లాడేదో తనకు అస్సలు అర్థమయ్యేది కాదని ఒబామా వ్యాఖ్యానించారు. వైవాహిక జీవితంపై.. అధ్యక్షుడిగా తనపై అందరి దృష్టి ఉండటం..పదవి తాలూకూ ఒత్తిడి, విపరీతమైన భద్రత భార్య మిషెల్ ఒబామాకు నిస్పృహ కలిగించేదని బరాక్ ఒబామా తన పుస్తకంలో రాసుకున్నారు. తాము వైట్హౌస్ నాలుగు గోడల మధ్య బందీ అయిపోయామన్న భావన మిషెల్లో కనిపించేదని తెలిపారు. ‘‘జీవితంలో మిషెల్ ఎన్ని విజయాలు సాధించినా, ప్రాచుర్యం పొందినప్పటికీ ఆమెలో ఏదో తెలియని ఒక టెన్షన్ కనిపించేది. కంటికి కనిపించని యంత్రపు రొదలా ఉండేది ఆ టెన్షన్. రోజంతా పనిలో నిమగ్నమైన నా గురించో... కుటుంబం మొత్తమ్మీద వస్తున్న రాజకీయ విమర్శలో, కుటుంబ సభ్యులు కూడా తనకు రెండో ప్రాధాన్యత ఇస్తున్నారన్న భావనో ఉండేది’’ అని వివరించారు. ఎ ప్రామిస్డ్ ల్యాండ్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ నవంబర్ 17న విడుదల కానుంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్హౌస్లో తన అనుభవాలన్నింటినీ మిషెల్ ఇప్పటికే ‘బికమింగ్’పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు. మైక్రోఫోన్, జాక్స్ లేని ఫోన్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడిగా తనకు ఒకసారి బ్లాక్బెర్రీ ఫోన్ ఇచ్చారని, కానీ అందులో మైక్రోఫోన్, హెడ్ఫోన్ జాక్స్ రెండింటిని తొలగించిన తరువాతే తనకు ఇచ్చారని ఒబామా ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తెలిపారు. ఆ ఫోన్ ద్వారా తాను భద్రతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించిన 20 మందితో మాట్లాడే సౌకర్యం ఉండేదని వివరించారు. మైక్రోఫోన్, హెడ్ఫోన్ జాక్స్ రెండూ లేకపోవడంతో పసిపిల్లలకు ఇచ్చే డమ్మీఫోన్ మాదిరిగా ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు. – సాక్షి, హైదరాబాద్ -
మిషెల్ ఒబామాకు మోదీ ఆశ్చర్య కానుక!
న్యూఢిల్లీ: తమ దేశ పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఊహించని కానుక ఇవ్వనున్నారు. అమోరికా ప్రథమ మహిళకు 100 బనారస్ చీరలు, బనారస్ సిల్క్ మెటీరియల్ కు ఆమెకు బహుమతిగా అందించనున్నారు. ఈ చీరల ఎంపిక, అందంగా ప్యాక్ చేసి అందించే బాధ్యతను వారణాసి వస్త్ర ఉద్యోగ సంఘంకు అప్పగించారు. ఈమేరకు జౌళీ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. మోదీ తన సొంత నియోజకవర్గం నుంచి చీరలు తెప్పించి మిషెల్ కు కానుకగా ఇవ్వనున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు వెల్లడించారు. భారత పట్టు అంటే మిషెల్ ఎంతో ఇష్టమన్న సంగతి బహిరంగ రహస్యం. పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఆమె జాక్వర్డ్ పట్టు దుస్తుల్లో మెరిసిన సంగతి విదితమే.