విలన్ ఎవరు?
తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా దిలీప్, ఈషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రల్లో హారర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘మాయామాల్’. గోవింద్ లాలం దర్శకత్వంలో కె.వి.హరికృష్ణ, చందు ముప్పాళ్ల, నల్లం శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన హరికృష్ణ మాట్లాడుతూ– ‘‘హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. సినిమాలో ఉన్న పాత్రల్లో విలన్ ఎవరనేది చివరి వరకూ ఆసక్తి కలిగించే విషయం. ఇంకా థ్రిల్కి గురి చేసే సన్నివేశాలెన్నో ఉన్నాయి. సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరధి శివేంద్ర, సంగీతం: సాయికార్తీక్.