breaking news
Mangapeta puskaraghat
-
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
సాక్షి, వరంగల్ : గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గత అయిదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల వరద నీరు కలుస్తుండటంతో మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం ఉదయం నుంచే క్రమేపీ పెరుగుతూ బుధవారానికి 5.300 మీటర్ల వేగంతో ఉరకలు వేస్తోంది. మంగపేట మండలంలోని కమలాపురం బిల్ట్ ఇన్టేక్వెల్ వద్ద భుదవారం ఉదయం నుంచి గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. ఆరున్నర మీటర్ల మేర నీటి వరద సాయంత్రం వరకు పెరిగింది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం, తుపాకులగూడెం బ్యారేజీల వరద నీరు బొగత జలపాతం, వాగులు, ఒర్రెల నుంచి కలవడంతో క్రమేపీ గోదావరి పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇదేవిధంగా మంగపేట గోదావరి పుష్కరఘాట్ వద్ద కూడా వరద నీరు పెరిగింది. (నీటి నిర్వహణ కత్తిమీద సామే!) రైతుల ఆనందం గోదవారి తీర ప్రాంతం ప్రజలు, రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తిమ్మంపేట- అబ్బాయిగూడెం గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువు మంగళవారం తెల్లవారుజాము నుంచి మత్తడి పడి పోస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు నిండడంతో తిమ్మంపేట, చెరుపల్లి, మల్లూరు, కొత్తమల్లూరు గ్రామాలు సుమారు 500 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతుంది. మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు చేరి గోదావరి క్రమేణా పెరుగుతోంది. పేరూరు దగ్గర 9.05 మీటర్ల నీటిమట్టానికి చేరుకుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. (మేం గిట్లా జేస్తే కేసీఆర్ సీఎం అయ్యేటోడా..!) మత్తడికి సిద్ధంగా లక్నవరం గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు మత్తడిపోసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం 33 ఫీట్లకు నీటిమట్టం చేరగా మరో అర ఫీటు నిండితే జలాలు మత్తడి దునకనున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతోంది. రెండు రోజుపాటు కురిసిన వర్షాలకు సరస్సులోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. ఇప్పటికే ఆయకట్టులో వరినాట్లు పూర్తయ్యాయి. సరస్సు పూర్తిస్థాయిలో నిండటంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తున్నారు. -
గోదావరి నమోస్తుతే
ఆరో రోజు ప్రదోశకాల హారతి మంగపేట ఘాట్వద్ద భక్తుల పుష్కరస్నానాలు మంగపేట : గోదావరి అంత్యపుష్కరాలను పురస్కరించుకుని శుక్రవారం ఆరో రోజు సాయంత్రం పూజారులు గోదారమ్మకు ప్రదోశకాల హారతినిచ్చారు. ఉదయం వేళలో భక్తులు కార్లు, ప్రైవేట్ వాహనాల్లో మంగపేట పుష్కరఘాట్కు తరలివచ్చి పుష్కరస్నానాలు ఆచరిం చారు. ఈ సందర్భంగా మహిళలు గోదావరి వద్ద కొబ్బరికాయలు కొట్టి, నదిలో పసుపు, కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలు, పండ్లు, జాకెట్, గాజులు నీటిలో వదిలారు. కొందరు భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. -
బస్సులు తక్కువ.. భక్తులు ఎక్కువ
ములుగు : మంగపేట పుష్కరఘాట్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పుణ్యస్నానాల ప్రాంతానికి భక్తులను చేరవేసేందుకు ఉచిత షటిల్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఆచరణలో సాధ్యంకాలేదు. శుక్రవారం అమావాస్య అరుునా సాయంత్రం వరకు సుమారు 60వేల మంది భక్తులు తరలివచ్చారు. వీరిని గంపోనిగూడెం తరలించే క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తగా ప్రైవేటు వాహనాలు నిలిచిపోయూరుు. సీఐ శ్రీధర్రావు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భారీగా తరలివచ్చే వాహనాలు నిలిపేందుకు మంగపేట పార్కింగ్ ప్రాంతంలో మరో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. కాగా, గంపోనిగూడెం నుంచి ఉచిత షటిల్ సర్వీసులు వేస్తామని చెప్పిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో తన భార్యాపిల్లలతో ఎండలో రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని వరంగల్కు చెందిన భక్తులు వి.వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.