-
మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం
హైదరాబాద్: మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జి.రాజేశ్వరి, రవికుమార్ దంపతులు తమ కుమారుడు లోకేషకుమార్తో కలిసి మధురానగర్లో నివాసం ఉంటున్నారు. ఈనెల 30న రాజేశ్వరి మార్నింగ్వాక్కు వెళుతున్నట్లు చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. మధ్యాహ్నం లోకేష్ అత్తగారికి ఫోన్ చేసి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తాను చనిపోనని, ఇంటికి మాత్రం రానని చెప్పింది. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో లోకేష్ ఆదివారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మధురానగర్లో దారుణం.. లిఫ్ట్ ఇచ్చి కారులో ...
హైదరాబాద్: మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చి అనంతరం శృంగారం కోసం ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్గూడకు చెందిన మహిళకు సంగీత్కుమార్ అనే వ్యక్తితో 2011లో వివాహం జరిగింది. వారికి పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భర్తతో మనస్పర్దలు రావడంతో మూడు నెలల కిందట ఆమె షేక్పేటలోని తన తల్లితో ఉంటుంది. ఈనెల 19న మధ్యాహ్నం యూసుఫ్గూడలోని కల్లు కంపౌండ్కు వచ్చి మద్యం సేవించి తిరిగి వెళ్లడానికి ఆటో కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కారులో వచ్చి మీ ఫ్యామిలీ నాకు తెలుసు, కారు ఎక్కు మీ ఇంటి వద్ద దింపుతానని చెప్పి కారు ఎక్కించుకున్నాడు. అయితే మార్గ మధ్యలో కారు ఆపి తనతో శృంగారం చేయాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన ఆమె కారు దిగి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు.. 24 గంటల్లోనే పోలీసులకు చిక్కాడు
హైదరాబాద్: జీవనోపాదిలేక ఎంబీఏ చదివిన ఓ డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు. తను నివసించే ప్రాంతంలోనే చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ జీవనం సాగించేవాడు. అయితే కొంత కాలంగా కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో అతను తప్పుడు దారిలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ పని అతనికి అలవాటు లేకపోవడంతో తప్పు చేసిన 24 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సార్ నగర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లికి చెందిన డి. సుచరిత అనే యువతి మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె మధురా నగర్ కాలనీలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. అయితే గురువారం కూడా ఆమె రోజు మాదిరిగానే ఆఫీస్కు బయలుదేరింది. ఈ క్రమంలోనే సుచరిత మధురానగర్ మెట్రో స్టేషన్ వద్ద లిఫ్ట్ కోసం ఎదురు చూడసాగింది. ఇక అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ యువకుడు సుచరిత మెడలోని రూ. 45 వేలు విలువ చేసే బంగారు గొలుసును దొంగిలించాడు. దీనితో బాధితురాలు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. నిందితుడిని నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన చింత వినోద్(27)గా గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడు వినోద్ను పోలీసులు దొంగతనం జరిగిన 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేకనే గొలుసు చోరీకి పాల్పడ్డారని, చోరికి పాల్పడటం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. -
బుజ్జాయిని బలిగొన్న బకెట్
విజయవాడ (మధురానగర్) : తన బుజ్జిబుజ్జి మాటలతో ఆ ఇంట వెలుగులు పండించిన బుజ్జాయిని రక్కసి బకెట్ బలితీసుకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ తిరిగిన తన మూడేళ్ల చిన్నారికి అంతలోనే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. స్థానిక మధురానగర్ వీవీ నరసరాజు రోడ్డుకు చెందిన మజ్జి గణేష్ దంపతులకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె కీర్తనకు మూడేళ్లు. ఇటీవలే జన్మదిన వేడుకలు జరుపుకొంది. బుధవారం ఉదయం అందరూ పన్నుల్లో ఉండగా, కీర్తన ఇంటి బయట నీటితో నిండిన బకెట్ వద్దకు వెళ్లింది. అక్కడే ఆడుకుంటూ కొద్దిసేపటికి బకెట్లోకి వంగి పడిపోయింది. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక కీర్తన చనిపోయింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు చెప్పడంతో తల్లిదండ్రులు గమనించారు. అయితే, కీర్తన అప్పటికే చనిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు పీవీఆర్, ఉపాధ్యక్షుడు మహాలక్ష్మయ్య తదితరులు కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు
– మహిళపై దాడి – ఒంటిపైనున్న నగల దోపిడీ తిరుపతి క్రైం: నగరంలోని మధురానగర్లో శుక్రవారం దొంగలు పట్టపగలే ఓ మహిళపై దాడికి పాల్పడి బంగారు దోచుకున్నారు. బాధితురాలు సురేఖ అలియాస్ జ్యోతి కథనం మేరకు... మధురానగర్కు చెందిన సురేఖ (48) తన ఇద్దరు కూతుళ్లు, తల్లితో పాటు ఉంటుంటున్నారు. శుక్రవారం చిన్నకూతురు సొంతపని నిమిత్తం బయటికి వెళ్లింది. పెద్ద కూతురు, తల్లి మిద్దెమీద ఉన్న గదిని శుభ్రం చేసేందుకు వెళ్లారు. సురేఖ దేవుడి పటాలను శుభ్రం చేయాలని బయటికి వెళ్లింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ముసుగు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు సురేఖ మొఖంపై కారం చల్లారు. నోటికి, మెడకు టేప్ చుట్టేశారు. అంతేగాక తలపై, మొఖంపై బలంగా కొట్టారు. ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమె మెడలో ఉన్న చైన్, చేతికున్న బంగారు గాజులు, కమ్మలు లాక్కున్నారు. అనంతరం ఆమెను ఇంట్లోకి నెట్టి పక్కనే ఉన్న కాంపౌండ్ వాల్ దూకి పరారయ్యారు. ఆమె కూడా వారి వెనుకనే పరిగెత్తేందుకు ప్రయత్నించింది. కేకలు వేయడంతో పక్కింటి వారు కూతురు, తల్లి కిందకు వచ్చారు. బాధితురాలని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 4.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మల్లికార్జున, క్రైం సీఐ భాస్కర్, ఎస్ఐ ప్రభాకర్రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్తో తనిఖీలు చేయించారు. ఈ దోపిడీలో 8 సవర్ల గాజులు, 3 సవర్ల చైన్, 6 గ్రాముల కమ్మలు పోయినట్లు బాధితురాలు తెలిపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ‘గంట’కు రూ.100.!
- రియల్ ఎస్టేట్ వ్యాపారిని చితకబాదిన నటి రాధ
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
Advertisement