breaking news
LORD VENKANNA
-
వడ్డికాసుల వాడి ఆదాయం రూ.1.60 కోట్లు
దేవరపల్లి (ద్వారకా తిరుమల) : ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. 20 రోజులకు నగదు రూపంలో రూ.1,59,80,346 ఆదాయం సమకూరింది. విదేశీ కరెన్సీ సైతం భారీగా రావడం విశేషం. కానుకల రూపంలో 627 గ్రాముల బంగారం, 7.728 కేజీల వెండిని భక్తులు సమర్పించుకున్నారు. నగదు రూపంలో రోజుకు సగటున 7.99 లక్షల ఆదాయం లభించినట్టు ఈవో వి.త్రినాథరావు చెప్పారు. హుండీల ఆదాయాన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ సోమవారం లెక్కించారు. -
శ్రీవారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల/జంగారెడ్డి గూడెం / జంగారెడ్డిగూడెం రూరల్ : ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం రాత్రి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎ.రామ లింగేశ్వరరావు, రమ్య దంపతులు, వారి కుమార్తె రచన సందర్శించారు. వీరికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. న్యాయమూర్తి శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామి వారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆలయ సూపరింటెండెంట్ రమణరాజు ఆయనకు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. ‘మద్ది’లో పూజలు గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారినీ రామలింగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మ¯ŒS జడ్జిని సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఏలూరు ఎక్సైజ్ మేజిసే్ట్రట్ తిరుమలరావు, జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి డి.అజయ్కుమార్ ఆయన వెంట ఉన్నారు. తిరుమల పారిజాతగిరిలో.. : కాగా జంగారెడ్డి గూడెంలోని గోకుల పారి జాతగిరి వేంకటేశ్వరస్వామి వారినీ రామ లింగేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా కార్తీక మాసం సందర్భంగా తొలుత అర్చకులు వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి ప్రారంభించి అనేక కార్యక్రమాలు జరిపారు.