latif
-
భారత మాజీ ఫుట్బాలర్ అబ్దుల్ లతీఫ్ కన్నుమూత
గువాహటి: భారత దిగ్గజ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు అబ్దుల్ లతీఫ్ కన్నుమూశారు. ఆయనకు 73 ఏళ్లు. దిగ్గజ ఆటగాడి మృతి పట్ల అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సంతాపం తెలిపింది. ‘అబ్దుల్ లతీఫ్ ఇక లేరు అనేది చాలా విచారకరం. భారత ఫుట్బాల్కు ఆయన చేసిన సేవలు మరువలేనివి’ అని ఏఐఎఫ్ఎఫ్ అ«ధ్యక్షులు ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. 1968లో బర్మాపై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లతీఫ్... 1970 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడు. కర్ణాటకలోని మైసూర్లో జన్మించిన ఆయన జాతీయ స్థాయి టోర్నీ సంతోష్ ట్రోఫీ (1966, 1968, 1970)లో బెంగాల్కు ప్రాతిని«ధ్యం వహించారు. వీటితో పాటు కోల్కతా విఖ్యాత క్లబ్లు మోహన్ బగాన్, మొహమ్మదాన్ స్పోర్టింగ్ జట్లకూ తన సేవలు అందించారు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక మొహమ్మదాన్, అస్సాం జట్లకు కోచ్గానూ వ్యవహరించారు. ఆయన శిక్షణలో అస్సాం జట్టు ఆటలో ఎంతో పురోగతి సాధించింది. -
వణికిస్తున్నడెంగీ
నవీపేట్/ మాక్లూర్/ భిక్కనూరు: జిల్లాను డెంగీ వణికిస్తోంది. రోజూ ఎక్కడో ఓ చోట డెంగీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామం లో లావణ్య (19) అనే యువతి తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు రెండ్రోజుల క్రితం నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు డెం గీ సోకినట్లు నిర్ధారించారు. మాక్లూర్ గ్రామానికి చెందిన లతీఫ్ (42)కు డెంగీ సోకిందని మోడల్ ఆస్పత్రి వైద్యాధికారి సంజీవ్రెడ్డి తెలిపా రు. ఈనెల ఒకటో తేదీ నుంచి తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న లతీఫ్ను కుటుంబ సభ్యులు నాల్గవ తేదీన జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం మాక్లూర్ వైద్యాధికారి రవీందర్రెడ్డి, ఎస్యూఓ కృష్ణమూర్తి, సూపర్వైజర్ ప్రవీణ్రెడ్డి, సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. భిక్కనూరు మండల కేంద్రంలో ఓ యువతికి కూడా డెంగీ లక్షణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. పసుల సౌంద ర్య వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. రామాయంపేట ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆమెకు రెండు రోజుల పాటు చికిత్స చేసి ఇంటికి పంపించారు. మ రుసటి రోజు సౌందర్య తిరిగి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కామారెడ్డిలోని ప్రైవే ట్ అసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు డెంగీ సోకినట్టు నిర్ధారించారు. -
ఆదర్శ పౌరులు
-
200 డ్రా చేస్తే 24 లక్షలు వచ్చాయి
హైదరాబాద్: లక్షల రూపాయిలు చేతి దాకా వచ్చినా ఆ డబ్బు తమది కాదంటూ పోలీసులకు అప్పగించారు ముగ్గురు యువకులు. ఉద్యోగ వేటలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా నిజాయితీతో పలువురికి ఆదర్శంగా నిలిచారు. నగరంలోని ఎస్ఆర్నగర్లో ఓ హాస్టల్లో ఉంటున్న లతీఫ్, హరిప్రసాద్, శివ దుర్గాప్రసాద్లు శుక్రవారం రాత్రి డబ్బులు డ్రా చేసేందుకు సమీపంలోని ఎస్బీహెచ్ ఏటీఎంకు వెళ్లారు. లతీఫ్ తన కార్డు నుంచి రూ. 200 డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా డబ్బుల ప్రవాహం పోటెత్తింది. క్యాష్డోర్ ఆటోమెటిక్గా తెరుచుకొని రూ. 24 లక్షలు బయటకొచ్చాయి. ఇది చూసి అవాక్కైన ఆ ముగ్గురూ వెంటనే 100 నంబర్కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేంత వరకు ఏటీఎం వద్దే డబ్బులకు కాపలా ఉన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఏటీఎంలో డబ్బులు పెట్టిన అధికారులు క్యాష్ డోర్కు లాక్ వేయడం మరిచిపోయినట్లు గుర్తించారు. యువకులు సమాచారం ఇవ్వడం వల్లే లక్షల రూపాయలు కాపాడగలిగామని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని నగర కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులకు అవార్డులు ఇప్పిస్తామన్నారు. నిరుద్యోగంలోనూ నిజాయితీగా .. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడే నికి చెందిన లతీఫ్ (22), మహబూబ్నగర్కు చెందిన హరిప్రసాద్ బీటెక్ గ్రాడ్యుయేట్లు. ఇక శివ దుర్గాప్రసాద్ సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ముగ్గురూ ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. అక్కడే స్నేహితులయ్యారు. లతీఫ్, హరిప్రసాద్ల తండ్రులిద్దరూ టీచర్లు. శివ దుర్గాప్రసాద్ కుటుంబం మహబూబ్నగర్లో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. తల్లిదండ్రులకు అండగా ఉండాలనే తపనతో ఈ ముగ్గురు చదువుకుంటూనే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏటీఎం సెంటర్లో లక్షల రూపాయలు కనిపించి, తీసుకునేందుకు అవకాశాలున్నా నిజాయతీతో మెలిగారు. తాము చేసిన పనికి పోలీసులు, స్థానికులు అభినందిస్తుంటే అదే కోట్ల రూపాయలు సంపాదించినంత ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.