-
అడవి బిడ్డలకు పురిటి కష్టాలు
సాక్షి,మంగపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి పంచాయతీ పరిధి కమలాపురం అటవీ ప్రాంతంలో ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. కనీస రవాణా సదుపాయం కూడా లేకపోవడంతో గొత్తికోయ మహిళలు పురుటి నొప్పులతో అల్లాడిపోతున్నారు. తాజాగా కోమటిపల్లి పంచాయతీ పరిధి రేగులగూడెం గొత్తికోయ గిరిజన గ్రామానికి చెందిన మహిళ రోడ్డుపై ప్రసవించిన సంఘట దీపావళి పండుగ రోజు చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేగులగూడేనికి చెందిన మడకం మల్లమ్మకు తొలికాన్పు. బుధవారం పురిటినొప్పులు రావడంతో మధ్యాహ్నం మూడు సమయంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గంట సమయం గడిచిన తరువాత మల్లమ్మకు మళ్లీ నొప్పులు రావడంతో ఆందోళన చెందిన గూడెం వాసులు పుట్టిన బిడ్డలోపాటు ఆమెను ఎడ్లబండిలో కమలాపురం తీసుకువచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు బండి నుంచి మల్లమ్మను దింపుతున్న క్రమంలో మరో బిడ్డకు రోడ్డుపైనే జన్మనిచ్చింది. వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో స్థానికుల సహకారంతో ప్రైవేట్ వాహనంలో ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలు, తల్లి క్షేమంగా ఉన్నారు. -
సీఎం కార్మికుల పనివేళలు మార్చాలి
గోదావరిఖని(కరీంనగర్) : ఆర్జీ-1 ఏరియా పరిధి జీడీకే-11 గనిలో కంటిన్యూయస్ మైనర్(సీఎం) యంత్రంపై పనిచేస్తున్న కార్మికులను రెండో షిఫ్టు సమయం మార్పు చేయాలని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు గనిమేనేజర్ రవీందర్కు గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూయస్ మైనర్ సెక్షన్లో రెండో షిఫ్టు రాత్రి 12 గంటల వరకు విధులను నిర్వహించాల్సి వస్తోందని, దీంతో కార్మికులు అజీర్తి, అల్సర్, నిద్రపట్టకపోవడం లాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. కంపెనీలో పనిచేసే ప్రతీ కార్మికుడు ఆరోగ్యంగా ఉండాలని ఓవైపు యాజమాన్యం కోరుకుంటూనే మరోవైపు అందుకు విరుద్ధంగా పని చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అమలుచేస్తున్న సాయంత్రం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు రెండో షిఫ్టును రద్దు చేసి పాతపద్ధతిలో సాయంత్రం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు పనివేళలు మార్చాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు జంగ కనుకయ్య, గని ఫిట్ సెక్రటరీ మోదుల సంపత్, టీబీజీకేఎస్ ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ ఆరెళ్లి పోషం, ఫిట్ సెక్రటరీ గుమ్మడి లింగయ్య, నాయకులు ఎం.పద్మారావు, ఆరె శ్రీనివాస్, రేండ్ల రవీందర్, ఆరెపల్లి రాజమౌళి, పి.శ్రీనివాస్, జి.పెంటయ్య, యు.బుచ్చయ్య, రాజేశ్వర్రావు, ఒ.చంద్రయ్య, పి.రమేశ్, ఎం.వెంకటస్వామి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
పెరుగుతున్న క్యాష్ విత్డ్రాలు!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
Advertisement