breaking news
Kolijiam system
-
కొలీజియంపై కేంద్రం పెత్తనమా..!
సాక్షి, న్యూఢిల్లీ : ఐదుగురు సీనియర్ జడ్జీల సుప్రీం కోర్టు కొలీజియం మే 2వ తేదీ సాయంత్రం సమావేశమైంది. ఎజెండా ఏమిటంటే ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ కేఎం జోసఫ్ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించాలనే కొలీజియం సిఫారసును తిరిగి యధాతథంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపించడం. అలా చేసి ఉన్నట్లయితే దాన్ని ఆమోదించడం మినహా కేంద్రానికి మరో గత్యంతరం ఉండేది కాదు. సుప్రీం కోర్టు తన స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకునేది. తద్వారా తన ఆధిక్యతను చాటుకునేది. అంతకన్నా ఏ కారణం లేకుండా కొలీజియం సిఫార్సును తిప్పి పంపిన కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పినట్లు ఉండేది. ఆ రోజు కొలీజియం సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం తిప్పి పంపిన సిఫారసును యధాతథంగా మళ్లీ పంపించడం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు లేదనేది స్పష్టమైంది. అలాంటప్పుడు కేంద్రం కాదన్న జోసఫ్ పేరును పక్కన పెట్టి ప్రత్యామ్నాయంగా మరొకరి పేరును కొలీజియం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలా జరుగకుండా సమావేశం వాయిదా పడిదంటే కొలీజియం సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వెల్లడయ్యాయన్నమాట. అలాంటి సందర్భాల్లో మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అలా కూడా నిర్ణయం తీసుకోలేదంటే చీఫ్ జస్టిస్ మిశ్రా మినహా మిగతా ఎవరు కూడా ప్రభుత్వ నిర్ణయానికి అంగీకరించలేదని అర్థం అవుతుంది. చీఫ్ జస్టిస్ది మైనారిటీ నిర్ణయంగా ఉండ కూడదు. అందుకనే సమావేశాన్ని వాయిదా వేసినట్లు చీఫ్ జస్టిస్ ప్రకటించినట్లు ఉంది. ఇదివరకే కేంద్ర ప్రభుత్వం కొలీజియం నిర్ణయాలతో రెండు సార్లు విభేదించింది. ఎప్పుడు కూడా ప్రభుత్వం అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటూ పోతే అదే సంప్రదాయంగా మారుతుంది. అప్పుడు సుప్రీం కోర్టు నియామకాల్లో సీనియారిటీకున్న ప్రాధాన్యత కోల్పోతుంది. నియామకాల్లోని నిబంధనలనుగానీ, అందుకు పరిగణించే సీనియారిటీని గానీ రక్షించుకోవాల్సింది సుప్రీం కోర్టు కొలీజియమేగానీ, కేంద్రానిది కాదుకదా! మొత్తంగా న్యాయవ్యవస్థ, ముఖ్యంగా సుప్రీం కోర్టు నిబద్ధతపై నీలినీడలు కమ్ముకుంటున్నవేళ, న్యాయం అన్యాయం అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీం కోర్టు తన నిర్ణయానికి కట్టుబడి వ్యవహరించక పోవడం అన్యాయమే. జనవరి 12 తేదీన నలుగురు సుప్రీం కోర్టు జడ్జీలు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ సుప్రీం కోర్టు అడ్మినిస్ట్రేషన్ బాగోలేదని ఆరోపించారు. వారు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి కలిగించేందుకైనా జస్టిస్ మిశ్రా స్వతంత్రంగా వ్యవహరించి ఉండాల్సింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రపై ప్రజల్లో కూడా నమ్మకం పోతోందని, దాన్ని పునరుద్ధరించేందుకైనా సుప్రీం కోర్టు జడ్జీలందరితోని ఓ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ న్యాయమూర్తులు చేసిన డిమాండ్కు కూడా మిశ్రా స్పందించలేదు. -
కొలీజియంతో మళ్లీ అన్యాయం?
ఇటీవల కొలీజియం వ్యవస్థ స్థానంలో భారత అత్యున్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ సంస్థ ఎన్జేఏసీను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసి మునుపటి కొలీజియం వ్యవస్థకే ఆమోదముద్ర వేయడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో బడుగు బలహీన వర్గాలకు మరోసారి అన్యాయం జరిగే ప్రమాదం ఏర్ప డింది. కొలీజియం వ్యవస్థ సూచించిన న్యాయమూర్తులనే నియమించాలి, వారు అనుకున్న వారిని మాత్రమే బదిలీ చేయాలి అనే విధాన ప్రజాస్వామ్య వ్యవస్థకే వ్యతిరేకం. దీన్ని రూపమాపడానికే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలీజియం వ్యవస్థను రద్దుచేసి దాని స్థానంలో భారత న్యాయ నియామకాల కమిషన్ని తీసుకువచ్చింది. కేంద్రం ఈ నూతన సంస్థను ప్రతిపాదించాక దేశంలో బలహీనవర్గాల ప్రజలు, న్యాయనిపుణులు సంబరపడిపోయారు. ఎందుకంటే మన న్యాయస్థానాల్లో నిమ్న జాతులవారు కొసమెరుపుకు కూడా కనిపించరు. వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానాల్లో, సుప్రీంకోర్టుల న్యాయమూర్తులు సంపన్నవర్గాలకు చెందిన వారే. ప్రభుత్వం నుంచే జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి న్యాయమూర్తులను కూడా శిక్షల పరిధిలోకి తీసుకువచ్చే నూతన న్యాయ నియామకాల వ్యవస్థను తీసుకు రావాలి. దళిత, బలహీన వర్గాలకు న్యాయవ్యవస్థలో నేటికీ తగు స్థానం లేకపో వడం గమనార్హం. ‘సుప్రీం’ తీర్పుతో సంబంధం లేకుండా కేంద్రం వీరికీ స్థానం దక్కేలా మరో కొత్త వ్యవస్థను తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. - కోదాటి శ్యామసుందర్ హైదరాబాద్. మొైబైల్: 9949505780