-
ఏఐసీసీ కార్యాలయంలో పొంగులేటి, జూపల్లి..!
-
ఆశలు చిగురించేనా..
సాక్షి, మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆశలు చిగురించాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు మంత్రి వర్గాన్ని విస్తరించిన సీఎం కేసీఆర్ నేడు మళ్లీ మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి అనుమతి తీసుకున్నారు. ఇదీలా ఉంటే ఎంత మందితో మంత్రి వర్గాన్ని విస్తరిస్తారు? కొత్తగా ఎవరెవరికీ అవకాశం కల్పించనున్నారు?అనేదానిపై అధినేత స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆదివారం జరగనున్న మంత్రి విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తొలుత అతి స్వల్ప కాలం వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ ఆ పదవి నుంచి తప్పించి వైద్యారోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. స్వతహాగా వైద్యుడిగా ఉన్న లక్ష్మారెడ్డి సుమారు నాలుగున్నరేళ్ల పాటు వైద్యారోగ్యశాఖకు మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత లక్ష్మారెడ్డికి మళ్లీ పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ సామాజిక కూర్పులో భాగంగా ఆయనకు మంత్రి పదవి చేజారింది. నెలరోజుల క్రితం మళ్లీ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరిగింది. అందులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేరు బలంగా వినిపించింది. తర్వాత మంత్రివర్గ విస్తరణకు కాస్త ఆలస్యమైంది. చివరకు శనివారం ప్రభుత్వ చీఫ్ విప్, విప్లను ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హరీశ్రావు, కేటీఆర్, ఓ మహిళ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యేకు బెర్త్ ఖరారైందనే స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. అయితే శనివారం రాత్రి వరకు మంత్రుల జాబితా ప్రకటించకపోవడంతో లక్ష్మారెడ్డికి మంత్రిపదవి దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. ఇదీలా ఉంటే సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రకటించనున్న పది రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకూ అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. తనతో ఉన్న సాన్నిహిత్యంతో పాటు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కొల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జూపల్లికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. రెండు విప్ పదవులు మరోవైపు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డిని శాసనమండలి విప్గా శనివారం ప్రకటించారు. అలాగే అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ప్రభుత్వ విప్గా నియమించారు. దీంతో ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో కొనసాగుతున్నారు. -
‘నేను పార్టీ మారడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పూటకో పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. కావాలనే కొందరు తనపై కుట్రపన్ని పార్టీ మారతారంటూ దష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారే ప్రసక్తే లేదని, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. కొల్లాపూర్ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన జూపల్లి.. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్థన్రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. -
ఐకియాలో మహిళలకు 350 ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, సంస్థల స్థాపనకు దేశంలోనే అత్యంత అనువైన ప్రదేశం తెలంగాణ అని, ఇక్కడ సమర్థవంతమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రముఖ బహుళజాతి కంపెనీ ఐకియా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో తమ రిటైల్ స్టోర్ను ఫిబ్రవరిలో ప్రారంభించనుంది. ఇందులో పనిచేసేందుకు తెలంగాణలోని 350 మంది మహిళలకు అవకాశం కల్పిస్తుంది. వీరికి న్యాక్లో 45 రోజులపాటు ఇవ్వనున్న శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. మంత్రి సమక్షంలో దీనికి సంబంధించిన ఒప్పందం(ఎంవోయూ)పై నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్(న్యాక్), ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్(ఈజీఎంఎం), ట్రస్ట్ ఫర్ రిటైలర్స్ అండ్ రిటైల్ అసోసియేట్స్ ఆఫ్ ఇండియా(ట్రైన్), యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(యూఎన్డీపీ) ప్రతినిధులు సంతకాలు చేశారు. -
దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: జూపల్లి
కొల్లాపూర్: పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చే సేందుకు కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జూపల్లికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను సీఎం కేటాయించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన సోమవారం రాత్రి కొల్లాపూర్లో విలేకరులతో మాట్లాడారు. తనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి కే సీఆర్కు కృత జ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తరహాలో పంచాయతీరాజ్ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement