ఏపీలో దుష్టపాలన నడుస్తోంది: అంబటి
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ లో దుష్టపాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయనను సమర్థించిన సీఎం చంద్రబాబు అన్నం తింటున్నారా అని ప్రశ్నించారు.
తమ పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించినా అధికార పార్టీకి కక్ష తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఐదుగురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోందన్నారు. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ నేత ఒక్కరున్నా తమ గళం విన్పిస్తున్నామని, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు.