-
అనకాపల్లి మార్కెట్లో నిలిచిన బెల్లం అమ్మకాలు
అనకాపల్లి: సీజన్లో రోజుకు సుమారు రూ.4 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే అనకాపల్లి బెల్లం మార్కెట్లో మరోసారి ప్రతిçష్టంభన ఏర్పడింది. బుధవారం బెల్లం క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సీజన్, అన్సీజన్గా లావాదేవీలు జరిగే అనకాపల్లి మార్కెట్లో ఏటా రెండు, మూడుసార్లు సమస్యల కారణంగా లావాదేవీలు నిలిచిపోవడం, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుని లావాదేవీలను పునరుద్ధరించడం సాధారణమే. ఈసారి బెల్లం ఎగుమతిదారులకు, కార్మికులకు మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలతో మార్కెట్లో లావాదేవీలు నిలిచిపోయాయి. సంక్రాంతికి ముందురోజు 20 వేలకు పైగా బెల్లం దిమ్మెల వ్యాపారం జరగ్గా.. పండుగ తర్వాత సోమవారం 11,866 దిమ్మెలు, మంగళవారం 8,644 బెల్లం దిమ్మెలు మార్కెట్కు వచ్చాయి. పండుగ మూడ్ నుంచి బయటపడిన రైతులు బెల్లాన్ని మార్కెట్కు తరలించాలనుకుంటున్న సమయంలో లావాదేవీలు నిలిచిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ప్రతిష్టంభనకు కారణమిదీ మార్కెట్కు బెల్లాన్ని రైతులు వాహనాల్లో తీసుకొచ్చి మార్కెట్ యార్డులలో దించుతారు. తర్వాత కొన్ని ప్రక్రియలు జరిపి ఎగుమతిదారుడి అధీనంలోకి వెళ్లిన తర్వాత సుమారు 170 మంది కార్మికులు బెల్లం దిమ్మెలను గోనె సంచిలో కుట్టే ముందు ఆయా వర్తకునికి సంబంధించిన గుర్తులు వేస్తారు. దీనికి గాను ఒక్కో కార్మికునికి దిమ్మెకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. కాగా, గోనె సంచులను కుట్టే ప్రక్రియకు స్వస్తి పలికిన వర్తకులు నేరుగా కవర్లను చుట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల కార్మికలకు వచ్చే వేతనం తగ్గిపోతోంది. తమకు గిట్టుబాటు కాదని భావించిన కార్మికులు అనధికారికంగా నిర్వహించే వేలం ప్రక్రియలో పాల్గొనబోమని మొండికేశారు. ఇది ఎగుమతి, దిగుమతి వర్తకుల మధ్య ప్రతిష్టంభనకు దారితీసి బుధవారం లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం అటు వర్తకులు, ఇటు కొలగార్లు, కార్మికులతోపాటు బెల్లం రైతులు, బెల్లాన్ని తరలించే వాహనదారులపైనా పడింది. ఈ సమస్య వెంటనే పరిష్కారం కాకుంటే పక్వానికి వచ్చిన చెరకు తోటలు పాడైపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
'నల్లబెల్లం విక్రయిస్తే గ్రామ బహిష్కరణే'
కూసుమంచి (ఖమ్మం) : సారా తయారీకి వాడే నల్లబెల్లాన్ని విక్రయించిన వారికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించటానికి కూడా వెనుకాడబోమని ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేష్, డీఎస్పీ దక్షిణామూర్తి హెచ్చరించారు. మంగళవారం వారు కూసుమంచి మండల కేంద్రంలో 'సారా నిర్మూలన- బెల్లం విక్రయాలు' అంశంపై నల్లబెల్లం విక్రేతలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. నల్లబెల్లం విక్రయిస్తే ముందుగా సాధారణ కేసులు పెడతామని, దారిలోకి రాకుంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని తెలిపారు. అయినా విక్రయాలు మానకుంటే కలెక్టర్ ప్రత్యేక అనుమతితో గ్రామ బహిష్కరణ దండన విధిస్తామని తెలిపారు. సారా తయారీ నిర్మూలనకు అధికారులతో సహకరించాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement