breaking news
Investment burden
-
కొత్త సంవత్సరంలో సమీక్షించాల్సినవి..
దేశానికేకాదు, వ్యక్తులకు వారి పెట్టుబడులకు బడ్జెట్ ప్రణాళికలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏటా ఆయా ఇన్వెస్ట్మెంట్ల(investments)ను సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో సాధారణంగా చాలామంది తమ పెట్టుబడులను సమీక్షిస్తారని చెబుతున్నారు.విడిగా ఒక లక్ష్యానికి ఎంత కాలంలో, ఎంత మొత్తం సమకూర్చుకోవాలన్నది బడ్జెట్లో రాసుకుంటారు. అందుకు అనుకూలించే ఫండ్స్ను ఎంపిక చేసుకుంటారు. మరి సదరు మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) పనితీరు మీ రాబడులు ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? లేదా? పనితీరు బాగోలేకపోతే ఆ ఒక్క పథకంలోనే అలా ఉందా లేక ఆ విభాగంలోని మిగిలిన పథకాల పనితీరు కూడా అదే మాదిరిగా ఉందా? అన్నది పరిశీలించుకోవాలి. విభాగం మొత్తం పనితీరు అదే మాదిరిగా ఉంటే ఆందోళన అక్కర్లేదు. మరికొంత వ్యవధి ఇచ్చి చూడొచ్చు. పథకంలో లోపం ఉంటే, అందుకు కారణాలను గుర్తించాలి. అవి సమగ్రంగా లేకపోతే మరో పథకంలోకి మారిపోవడాన్ని పరిశీలించొచ్చు.రిస్క్ను అధిగమించేలా..ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏదో ఒక విభాగంలోని పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందితే, రీబ్యాలన్స్ (Re balance) చేసుకోవాలి. ఒక విభాగం పెట్టుబడుల విలువ అధికంగా వృద్ధి చెందినప్పుడు.. అధిక విలువ ఉన్న చోట నిర్ణీత శాతం మేర పెట్టుబడులు విక్రయించి, తక్కువ విలువ వద్దనున్న విభాగంలోకి మార్చుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్గా చెబుతారు. దీని ద్వారా రిస్క్ను అధిగమించొచ్చు. బీమా కవరేజీపై దృష్టిటర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్(Insurance)లోనూ మార్పులు అవసరం పడొచ్చు. ఉదాహరణకు గృహ రుణం తీసుకున్నారని అనుకోండి.. ఆ మేరకు టర్మ్ కవరేజీని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఇతర ఏ రుణం తీసుకున్నా సరే ఆ మేరకు కవరేజీ పెంచుకోవాలి. వివాహం, పిల్లలతోపాటు బాధ్యతలూ పెరుగుతుంటాయి. ఏటా ఆదాయం కూడా వృద్ది చెందుతుంది. వాటికి అనుగుణంగా తమ బీమా కవరేజీని సమీక్షించుకోవాలి. ఆరోగ్య బీమా కవరేజీ ప్రస్తుత కుటుంబ అవసరకాలకు సరిపడా ఉందా? అని సమీక్షించుకోవాలి. లేదంటే అదనపు కవరేజీతో తక్కువ వ్యయానికే సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: 179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’అత్యవసర నిధి.. వీలునామాలో మార్పులురుణ భారంలో ఉంటే కొత్త ఏడాదిలో దాన్నుంచి బయటపడే మార్గాన్ని గుర్తించాలి. అత్యవసర నిధిలోనూ మార్పులు అవసరమే. జీవన వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. కనుక 2–5 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న అత్యవసర నిధి ఇప్పటి అవసరాలకు సరిపోకపోవచ్చు. ప్రస్తుత ఖర్చులను కనీసం ఏడాది పాటు అయినా అత్యవసర నిధి గట్టెక్కించగలదా? అన్నది సమీక్షించుకోవాలి. లేదంటే అదనంగా సమకూర్చుకోవాలి. రెండేళ్ల అవసరాలకు సరిపడా ఏర్పాటు చేసుకుంటే మరింత నిశ్చింతగా ఉండొచ్చు. నామినేషన్లు, వీలునామాలో మార్పులు అవసరం అనుకుంటే ఆ మేరకు మార్పులు చేసుకోవాలి. అవసరమైతే ఏడాదిలో ఒక్కసారి అయినా ఆర్థిక నిపుణులను సంప్రదించి సమగ్రమైన సమీక్ష చేయించుకోవాలి. -
జనరిక్.. జాప్యం
ప్రజలకు తక్కువ ధరకు మందులను అందించటం కోసం జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. పెట్టుబడి భారం మాత్రం మండల, పట్టణ సమాఖ్యలపై మోపుతోంది. షాపుల ఏర్పాటులో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సమాఖ్యలు ముందుకు రావటం లేదు. లాభనష్టాలు తామే భరించాల్సి ఉండటంతో వెనకడుగేస్తున్నాయి. మచిలీపట్నం : జిల్లాలో జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా 200 జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించారు. జిల్లాలో 15 జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో ఏడు, మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘాల్లో ఎనిమిది ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మండల కేంద్రాలైన అవనిగడ్డ, కైకలూరు, బంటుమిల్లి, గన్నవరం, పామర్రు, విస్సన్నపేట, మైలవరం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు మెప్మా పీడీ హిమబిందు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.100 ఖరీదు చేసే మందుబిళ్లలు జనరిక్ మెడికల్ షాపుల్లో రూ.30కే అందుబాటులోకి వస్తాయి. రాయల్టీ చెల్లించని మందులను ఈ షాపుల్లో అందుబాటులో ఉంచుతారు. పెట్టుబడి భారం సమాఖ్యలపైనే... ఈ షాపుల ఏర్పాటుకు మండల, పట్టణ సమాఖ్యల ఖాతాలో ఉన్న నగదును పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క షాపు ఏర్పాటుకు ఫర్నిచర్, మందుల కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ షాపుల్లో ఫార్మాసిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను ఏర్పాటుచేసి ఒక్కొక్కరికి నెలకు రూ.7 వేలు వేతనంగా ఇవ్వాలని నిర్ణయించారు. ముందుకు రాని సమాఖ్యలు... మండల, పట్టణ సమాఖ్య ద్వారా రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి షాపు తెరిస్తే సిబ్బంది జీతభత్యాలు, షాపు అద్దె, విద్యుత్ బిల్లులు తదితర అంశాల నేపథ్యంలో లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఆయా సమాఖ్యలే భరించాలనే షరతు విధించారు. దీంతో జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసేందుకు సమాఖ్యలు ముందుకురావటం లేదు. ఒక్క ఉయ్యూరు పురపాలక సంఘంలోనే మందులు, ఫర్నిచర్ కొనుగోలు చేసి జనరిక్ మెడికల్ షాపును తెరిచేందుకు రంగం సిద్ధం చేశారు. మిగిలిన చోట్ల మండల, పట్టణ సమాఖ్యలతో సంప్రదింపులు జరిపే పనిలో అధికారులు ఉన్నారు. డీఆర్డీఏ ద్వారా ఏడు షాపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆరు షాపులను త్వరలో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్డీఏ చెబుతున్నారు. మెప్మా ద్వారా ఎనిమిది షాపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఉయ్యూరులోనే అంతా సిద్ధమైందని, మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ సమాఖ్యల నుంచి దరఖాస్తులు వచ్చాయని మెప్మా పీడీ తెలిపారు. మిగిలిన నాలుగు పురపాలక సంఘాల్లో పట్టణ సమాఖ్యలు, జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు స్వీకరించే పనిలో ఉన్నామని ఆమె చెబుతున్నారు. మండల కేంద్రాలు, పురపాలక సంఘాల్లో జనరిక్ మెడికల్ షాపుల కోసం గది అద్దెకు తీసుకోవాలంటే ప్రస్తుతం కనీసం నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు కొంతమేర అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందుల మధ్య మండల, పట్టణ సమాఖ్యలు ఎంతవరకు ఈ మెడికల్ షాపుల ఏర్పాటుకు ముందుకు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలందరికీ ఉపయోగపడే జనరిక్ మెడికల్ షాపులను ప్రభుత్వపరంగా ఏర్పాటు చేయకుండా ఆ బాధ్యతను మండల, పట్టణ సమాఖ్యలకు అప్పగించటం ద్వారా ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందనే వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇటీవల ఇసుక రేవుల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించి అనంతరం ఈ విధానం బాగోలేదని ప్రభుత్వమే ప్రచారం చేస్తోంది. సమాఖ్యలకు షాపుల నిర్వహణను అప్పగిస్తే ఎంతకాలం పాటు వారు ఈ షాపులను నడుపుతారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.