breaking news
indian tablet
-
ట్యాబ్స్ మార్కెట్ ఢమాల్ 2016లో 18 శాతం క్షీణత
న్యూఢిల్లీ: దేశీ ట్యాబ్లెట్ పీసీ మార్కెట్లో గతేడాది 18 శాతం క్షీణత నమోదయ్యింది. వీటి విక్రయాలు కేవలం 35 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. వార్షిక ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వీటి విక్రయాలు 16 శాతం తగ్గుదలతో 8.1 లక్షల యూనిట్లకు పడ్డాయి. ఈ విషయాలను ప్రముఖ రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ తన నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం.. డేటావిండ్ 34 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో శాంసంగ్ (18 శాతం), పాంటెల్ (12 శాతం), మైక్రోమ్యాక్స్ (10 శాతం) ఉన్నాయి. గతేడాది 2జీ ట్యాబ్స్ విక్రయాలు 92 శాతంమేర, 3జీ ట్యాబ్స్ అమ్మకాలు 71 శాతంమేర క్షీణించాయి. 4జీ ట్యాబ్స్ విక్రయాలు మాత్రం 6 శాతం పెరిగాయి. ఇక 2017లో ఐరిష్, బయోమెట్రిక్ ట్యాబ్స్కు మంచి ఆదరణ లభించనుంది. ప్రస్తుతం ట్యాబ్స్ మార్కెట్ స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తోందని, భవిష్యత్లో ఈ విభాగంలోని కంపెనీల సంఖ్య కేవలం 6–7కి పరిమితం కావొచ్చని సీఎంఆర్ అంచనా వేసింది. -
ట్యాబ్లెట్ పీసీ మార్కెట్@ 200 కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: భారత ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ ఈ ఏడాది 200 కోట్ల డాలర్లకు చేరుతుందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ టెక్సై రీసెర్చ్ తెలిపింది. విద్యా, వాణిజ్య రంగాల్లో ట్యాబ్లెట్ల ప్రాధాన్యత పెరుగుతుండడమే దీనికి కారణమంటున్న ఈ నివేదిక వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు..., వివిధ రంగాల్లో ట్యాబ్లెట్ పీసీల వినియోగం విరివిగా పెరుగుతోంది. విద్యా, ప్రైవేట్, వాణిజ్య రంగాల్లో ట్యాబ్లెట్ల వినియోగానికే ప్రాధాన్యత అధికం అవుతోంది. స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ యూజర్లు నుంచి కూడా భవిష్యత్తులో ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్ పెరగనున్నది. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్లో అందివస్తున్న టెక్నాలజీ అవకాశాలు, జోరుగా విస్తరిస్తున్న సర్వీస్ రంగాల కారణంగా వేగవంతమైన, సులభమైన నెట్వర్కింగ్ సౌకర్యాలు అవసరమవుతున్నాయి. ఫలితంగా తక్కువ బరువున్న ట్యాబ్లెట్ వంటి కంప్యూటింగ్ పరికరాలకు డిమాండ్ పెరుగుతోంది. 2011-12లో 3.6 లక్షలుగా ఉన్న ట్యాబ్లెట్ల అమ్మకాలు 2012-13లో 427 శాతం వృద్ధితో 19 లక్షలకు చేరాయని మెయిట్ సంస్థ వెల్లడించింది. ఇక ఈ ఏడాది రెండో క్వార్టర్లో ట్యాబ్లెట్ అమ్మకాలు 107 శాతం వృద్ధితో 11 లక్షల 50 వేలకు చేరాయని సైబర్మీడియా రీసెర్చ్(సీఎంఆర్) తెలి పింది. గత ఏడాది 26.6 లక్షలుగా ఉన్న ట్యాబ్లెట్ పీసీల విక్రయాలు ఈ ఏడాది 60 లక్షలకు చేరతాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది.