-
సెర్ప్ సీఈవోగా ఇంతియాజ్ బదిలీ
సాక్షి, విజయవాడ: సెర్ప్ సీఈవోగా ఇంతియాజ్ బదిలీ అయ్యారు. మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా గంథం చంద్రుడు, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా రాజబాబు, శ్రీకాకుళం జేసీగా సుమిత్ కుమార్, పశ్చిమగోదావరి జేసీగా అంబేద్కర్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
ప్రైవేట్ ఆసుపత్రులు: రెండోసారి తప్పు చేస్తే క్రిమిన్ కేసులు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో టాస్క్ఫోర్స్ విస్తృత తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 35 ఆస్పత్రులకు రూ.2.86 కోట్ల జరిమానా విధించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 55 ఆస్పత్రులకు రూ.3.61 కోట్ల జరిమానా విధించారు. రెండోసారి కూడా తప్పు చేస్తే క్రిమిన్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. ఏ ఆసుపత్రిలోనైనా 50 శాతం బెడ్లు ప్రభుత్వం నిర్ధేశించిన కేటగిరీలో భర్తీ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ కోసం 104 కాల్ సెంటర్కు ఫోన్ చేసి సమాచారాన్ని అందివ్వాలన్నారు. నోడల్ అధికారులు, ఆసుపత్రి పర్యవేక్షుకులదే పూర్తి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. చదవండి: జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! -
కృష్ణా జిల్లాలో మూడు చైల్డ్కేర్ సెంటర్ల ఏర్పాటు
సాక్షి, కృష్ణా : కరోనాతో ఆస్పత్రిపాలైన కుటుంబాల్లోని చిన్నపిల్లల రక్షణ కోసం చైల్డ్కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఇంతియాజ్.. కృష్ణా జిల్లాలో మూడు చైల్డ్కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పిల్లలను తరలించేందుకు మూడు వాహనాలు సిద్ధం చేశామని, కరోనాతో ఆస్పత్రిపాలైన కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉంటే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 1098, 181 టోల్ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు కోలుకునే వరకు పిల్లలను సంరక్షిస్తామని అన్నారు. -
5 నుంచి ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ ఇంతియాజ్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఇంటర్మీడియెట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మే 2021 నిర్వహణపై కలెక్టర్ అధ్యక్షతన కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించి జిల్లాలో మొత్తం 142 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో విజయవాడ నగర పరిధిలో 77 కేంద్రాలను ఏర్పాటు చేయగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 65 సెంటర్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 1,12,154 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయనున్నారని, వారిలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 54,171 మందికాగా రెండవ సంవత్సరం పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 57,983 మంది ఉన్నారని కలెక్టరు అన్నారు. పరీక్షలు పకడ్బందీ నిర్వహణకు, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకు న్నామని, దీనిలో భాగంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 104 సెక్షన్ అమల్లో ఉంటుందని, 4 ఫయింగ్ స్క్వాడ్లను నియమించామని, 8 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, కోవిడ్ మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద కోవిడ్ ప్రొటోకాల్ ఆఫీసర్ను నియమించామని, ఐసోలేషన్ గదిని కూడా ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. పరీక్షా కేంద్రాలను కలుపుతూ ఆర్టీసీ బస్సులను నడిపేందుకు రూట్ వివరాలను ఆర్టీసీ అధికారులకు అందించామని, పరీక్షలు జరిగే తేదీల్లో ఉదయం 6.30 గంటల నుంచి విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కలెక్టరు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, విజయవాడ నగరపాలక సంస్థ అడిషినల్ కమిషనరు మోహనరావు, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్స్ కమిటీ కన్వీనర్ ఆర్ఐఓ పి.రవికుమార్, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్లు కె.యోహాన్, షేక్ అహ్మద్, బి.వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ షెడ్యూల్ మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను మంగళవారం ప్రకటించారు. వర్సిటీ వైస్ చాన్సలర్ కేబీ చంద్రశేఖర్ ఆమోదంతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ డి.రామశేఖరరెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫీజు, పరీక్షల టైంటేబుల్ను వర్సిటీ వెబ్సైట్ నందు పొందుపరిచామన్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించే అవకాశం కల్పించామన్నారు. తొలిసారిగా ఏపీసీఎఫ్ఎస్ఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్ష ఫీజు, ఫలితాల ప్రక్రియ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. చదవండి: కోవిన్ పోర్టల్: టీకా వేయించుకునేందుకు ఏం చేయాలి? -
డిసెంబర్ 31 నాటికి ఇన్పుట్ సబ్సిడీ..
సాక్షి, కృష్ణా జిల్లా: నివార్ తుపాన్ కారణంగా భారీగా పంటనష్టం సంభవించిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2.41 లక్షల హెక్టార్లలో 16.12లక్షల టన్నుల వరి పండుతుందని ఆశించామని తెలిపారు. నాగాయలంక, మండవల్లి మండలాల్లో వరి పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. 1.08 వేల హెక్టార్లలో పంట నష్టానికి ఎన్యూమరేషన్ మొదలుపెట్టాం. క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా ఇస్తామని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ డిసెంబర్ 31 నాటికి రైతుల బ్యాంకు ఖాతాలకు పంపుతామన్నారు. రంగు మారిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. (చదవండి: విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు) పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లిందని, వ్యవసాయాధికారులకు ఎన్యూమరేషన్ ప్రధాన బాధ్యతగా చేయాలని ఆదేశించామని తెలిపారు. మంత్రులు, స్పెషల్ ఛీప్ సెక్రెటరీలు టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారని తెలిపారు. డయల్ యువర్ జేసీ రేపు(శుక్రవారం) నిర్వహిస్తామని తెలిపారు. కౌలు రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 1800425440 కంట్రోల్ రూమ్ నంబరు రైతుల కోసం ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను బట్టి, 50 రోజుల క్యాంపైన్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు కలిసి ఈ క్యాంపైన్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. 8.4 లక్షల కోవిడ్ టెస్టులు జిల్లాలో జరిగాయని కలెక్టర్ వెల్లడించారు. (చదవండి: మంత్రి పేర్నిపై దాడి.. టీడీపీ కుట్రే?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement