breaking news
high denomination
-
బాబోయ్ బ్యాంకు
సత్తువ లేకపోయినా ఓపిక తెచ్చుకుని మరీ వృద్ధులు, వితంతువులు, దివ్యాం గులు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఉదయం నుంచీ క్యూలో నిలబడక తప్పడం లేదు. చేతికందేది స్వల్ప మొత్తమే అయినా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఉదయం నుంచే నిరీక్షిస్తున్నా.. డబ్బు చేతికి అందుతుందో లేదోననే ఆందోళన. ఖాతాల్లో సొమ్ములున్నా.. అవసరానికి సరిపడేంత తీసుకునే అవకాశం లేదు. అందరిలోనూ అస హనం పెరిగిపోతోంది. బ్యాంక్ ఉద్యోగులకు బీపీ వస్తోంది. నిస్సహాయ స్థితిలో తమను తామే తిట్టుకుంటూ నోట్ల కోసం పాట్లు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దుతో కష్టాల కుంపట్లో పడి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. రోజంతా క్యూలో నిలబడినా.. సొమ్ము చేతికందుతుందో లేదోననే ఆందోళన అందరిలోనూ కనబడుతోంది. ఒకటో తారీఖున బ్యాంక్ ఖాతాల్లో జమ అయిన జీతాలు తీసుకునేందుకు ఉద్యోగులు.. కేవలం పింఛను డబ్బులపైనే ఆధారపడి జీవించే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఏటీఎంలు, బ్యాంకుల పనితీరును ‘సాక్షి’ బృందం పరిశీలించింది. ఎన్ని బ్యాంకులున్నా.. ఏం లాభం జిల్లాలో వివిధ బ్యాంకులకు సంబంధించి 585 శాఖలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 594 ఏటీఎంలు ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో 368 ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. వీటిలో కేవలం 62 ఏటీఎంలలో రూ.100 నోట్లు పెట్టారు. మిగిలిన ఏటీఎంలలో రూ.2 వేల నోట్లను మాత్రమే అందుబాటులో ఉంచారు. ఈ ఏటీఎంలు కూడా గంట, గంటన్నర మాత్రమే పనిచేశాయి. దీంతో పింఛనుదారులు బ్యాంకుల్లోనే సొమ్ము తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు, చేనేత, కల్లుగీత విభాగాల్లో 3.38 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. వీరందరికీ రూ.37 కోట్లు చెల్లించాల్సి ఉంది. గడచిన రెండు రోజుల్లో కేవలం రూ.7 కోట్లు మాత్రమే బ్యాంకులు చెల్లించాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా 34వేల మంది ఉద్యోగులుండగా, 6,800 మంది మాత్రమే బ్యాంకుల నుంచి కొంతమొత్తంలో జీతం సొమ్మును తీసుకోగలిగారు. ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. రద్దీ ఉన్న సమయాల్లో సైతం వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో వారి ఇబ్బం దులు అన్నీఇన్నీ కావు. మొదటి రోజున పింఛను సొమ్ము ఖాతాలో పడకపోవడంతో రెండో రోజైనా వస్తుందనుకున్న వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నిరాశ తప్పలేదు. చాలాచోట్ల వారి ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఒకపక్క బ్యాంకులో నగదు నిల్వలు సరిపడా లేక, మరోవైపు ఖాతాదారుల నుంచి వస్తున్న వత్తిళ్లతో బ్యాంకు సిబ్బంది కూడా నలిగిపోతున్నారు. ప్రతి బ్యాంకుకు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు మాత్రమే నగదు వస్తుండటంతో ఎక్కువ మందికి చెల్లించలేకపోతున్నారు. ఖాతాదారులు వాదనకు దిగుతుండటంతో తమపై కోపం తెచ్చుకుంటే ఉపయోగం లేదని, ప్రభుత్వంపై చూపండంటూ బ్యాంక్ ఉద్యోగులు అంటున్నారు. కొవ్వూరు మండలం ధర్మవరం అంధ్రాబ్యాంక్లో పింఛను సొమ్ముతీసుకోవడానికి వచ్చిన కార్సిక సూర్యకుమారి అనే వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. బుట్టాయగూడెం మండలం అచ్చియ్యపాలెంకు చెందిన కాకర్లముడి రాములమ్మ (68) అనే వృద్ధురాలు బ్యాంకు వద్ద క్యూలో నిలబడినా సొమ్ము అందలేదు. ఇంటికి వెళ్లిన అనంతరం వంట చేసుకుంటూ గురువారం రాత్రి మృతి చెందింది. తన కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదని డబ్బులు ఇప్పించాలని కామవరపుకోటకు చెందిన ఆకుల చంద్రకళ అనే మహిళ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్కు విన్నవించుకుంది. బ్యాంకులో డబ్బు లేదని, ఎవరైనా జమ చేస్తే ఇస్తానని మేనేజర్ సమాధానం ఇచ్చారు. ఎనీ టైం మూత ఏటీఎంలు ఎనీటైమ్ మూత అన్న చందంగా తయారయ్యాయి. భీమవరంలో దాదాపుగా ఏ ఏటీఎంలోనూ నగదు లేదు. చింతలపూడి నియోజకవర్గంలో 35 ఏటీఎంలు ఉండగా ఆరు మాత్రమే పనిచేశాయి. నిడదవోలులో 20 ఏటీఎంలు 11 గంటలకే మూతపడ్డాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడులో 59 ఏటీఎంలకు గాను 6 మాత్రమే పనిచేశాయి. ఉండి మండలంలో ఒక్క ఏటీఎం కూడా పనిచేయలేదు. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలతోపాటు పట్టణ పరిధిలో మొత్తం 50 ఏటీఎంలు ఉండగా ఆరు మాత్రమే పనిచేశాయి. నరసాపురంలో 14 ఏటీఎంలు ఉండగా ఒక్కటి కూడా పనిచేయలేదు. ఎస్బీఐ మెయి¯ŒS బ్రాంచ్ వద్ద ఏటీఎం మాత్రం ఉదయం 2 గంటలపాటు పనిచేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆంధ్రాబ్యాంక్, ఎస్బీఐ ఏటీఎంలు పనిచేశాయి. ఆచంట నియోజకవర్గంలో 22 ఏటీఎంలు ఉండగా 13 మూతపడ్డాయి. కొవ్వూరులో ఉన్న 5 ఏటీఎంలు మధాహ్నానికే మూతపడ్డాయి. -
ఖాతాలపై కన్ను
బతుకులు బజారున పడిన భావన.. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆవేదన. ‘నోటు’కాడ కూడు నేల పాలైన ఆందోళన. ఇదీ జిల్లాలోని సామాన్యులు, చిరు వ్యాపారుల పరిస్థితి. నల్లధనం పోగేసిన కుబేరులపై యుద్ధం చేయాలంటే.. సామాన్యుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేయాలా? అనే ప్రశ్న సామాన్యులను వేధిస్తోంది. ఒకచోట గంటల తరబడి బ్యాంకుల్లో చిల్లర కోసం పడిగాపులు పడుతున్న జనం.. మరోచోట వ్యాపారాలు లేక ఆవేదన చెందుతున్న వ్యాపార గణం.. గ్రామగ్రామాన ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దుతో నల్లధనాన్ని మార్చుకునేందుకు కొందరు కుబేరులు నిరుపేదలకు సంబంధించిన జన్ధ¯ŒS యోజన ఖాతాల్లో పెద్దఎత్తున సొమ్మును డిపాజిట్ చేసిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జ¯ŒSధ¯ŒS ఖాతాల్లో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే సదరు ఖాతాలను స్తంభింప చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. పెద్ద మొత్తాలని డిపాజిట్ చేసిన జ¯ŒSధ¯ŒS ఖాతాలు జిల్లాలోనూ ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్తంభింపచేసే ప్రక్రియ మొదలుపెట్టారు. జీలుగుమిల్లి మండలంలో రూ.3 లక్షల సొమ్ము జమ అయిన ఖాతాలను బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు. అయితే, పూర్తి వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయా ఖాతాల వివరాలను ఐకేపీ అధికారులకు అందచేస్తామని చెబుతున్నారు. ఈ విషయం తెలిసి ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అవే కష్టాలు మరోవైపు పెద్దనోట్లు రద్దుచేసి 15 రోజులు దాటినా నగదు కోసం ప్రజలు పడుతున్న కష్టాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఏటీఎంలు పనిచేయకపోవడం, పనిచేసే ఏటీఎంలలో డబ్బులు అయిపోవడంతో జనం బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. బ్యాంకుల్లో చిల్లర లేదంటూ రూ.2 వేల నోట్లు ఇస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు రూ.500 నోట్లు వచ్చినా.. బ్యాంకులకు చేరుకోలేదు. మరోవైపు నగదు ఇవ్వడం లేదని తాళ్లపూడి ఆంధ్రాబ్యాంక్ వద్ద ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంక్ తెరిచిన అరగంట లోపే నగదు అయిపోయిందని చెప్పడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల్లో పాత నోట్లు మార్చుకోవడానికి గురువారం అర్ధరాత్రితో గడువు ముగియ డంతో ఆందోళన ఎక్కువైంది. గడువు పెంచాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం చొరవతో స్వైపింగ్ మెషిన్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. భక్తలనూ తాకిన పెద్దనోట్ల సెగ పెద్ద నోట్ల సెగ భక్తులనూ తాకింది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఇరుముడులకు అవసరమయ్యే పూజా సామగ్రి కొనుగోలుకు చిల్లర నోట్ల సమస్యగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం సగానికిపైగా పడిపోయిందని పూజా సామగ్రి వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత నోట్ల రద్దుతో జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 25 శాతం తగ్గింది. ఇళ్ల స్థలాల క్రయ విక్రయాలు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి డిసెబర్ 31 తరువాత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిజిస్ట్రేష¯ŒS వ్యవహారంలో పాత నోట్లు తీసుకునే వెసులుబాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లేదని ఆ శాఖ డీఐజీ లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ఇదిలావుంటే.. నగదు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల ఎదుట ధర్నాలు జరిగాయి. కొత్తనోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేవరకూ చట్ట, న్యాయబద్ధమైన లావాదేవీలకు పెద్దనోట్లను అనుమతించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేశారు. -
ఖమ్మం రైతు మార్కెట్లో నోట్ల రద్దు ఎఫెక్ట్