-
ప్రధానిపై పోటీ.. ఈ ట్రాన్స్జెండర్ గురించి తెలుసా?
లక్నో: ప్రస్తుత లోక్సభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కారణం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఇతర ప్రధాన పార్టీలతో పాటు ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తున్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై అఖిల భారత హిందూ మహాసభ (ABHM) ఉత్తరప్రదేశ్ విభాగం తరఫున మహామండలేశ్వర్ హేమాంగి సఖి మా పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారణాసితో సహా ఉత్తరప్రదేశ్లోని 20 లోక్సభ స్థానాల్లో ఈ హిందూ మితవాద సంస్థ పోటీ చేయనుంది. ఈ ఎన్నికలలో చివరి దశలో జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది. వారణాసి నుంచి కాంగ్రెస్ తమ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చీఫ్ అజయ్ రాయ్ను పోటీకి దింపింది. 2019లో వారణాసిలో ప్రధాని మోదీ 63 శాతం ఓట్లతో విజయం సాధించారు . సమాజ్వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ తర్వాత రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా కూటమిలో భాగంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ గీతా బోధకురాలు హేమాంగి సఖి గుజరాత్లోని బరోడాలో జన్మించారు. ఆమె తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఆమె కుటుంబం ముంబైకి మారింది. సఖి కొంతకాలం కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె పాఠశాల వదిలి వెళ్లిపోయారు. కొన్ని చిత్రాలలో నటించిన ఆమె ప్రముఖ టీవీ షోలలో కూడా కనిపించారు. ముంబైలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇస్కాన్ ఆలయంలో సఖికి శ్రీకృష్ణునిపై భక్తిప్రపత్తులు ప్రారంభమయ్యాయి. చివరికి బృందావనంలో దిగింది. తరువాత, ఆమె హేమాంగి సఖి మాగా మారారు. ఆమె ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్జెండర్ భగవద్గీత బోధకురాలు. తన ఫేస్బుక్ పేజీ ప్రకారం ఆమె ప్రపంచవ్యాప్తంగా అనేక వేదికలలో భగవద్ కథ , రామ కథ, దేవి భగవత్ కథలను బోధించారు. 2019లో పట్టాభిషేకం 2019 ఫిబ్రవరిలో జరిగిన కుంభంలో ఆచార్య మహామండలేశ్వర్గా ఆమె పట్టాభిషేకం జరిగింది. ఆమెను అఖిల భారతీయ సాధు సమాజ్ భగవత్భూషణ్ మహామండలేశ్వర్ బిరుదుతో సత్కరించింది. ఉత్తర గోదావరి ధామ్లోని ఆద్య శంకర్ కైలాష్ పీఠం ఆమెకు ఆచార్య మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది. -
మరుజన్మనిచ్చిన మాతృమూర్తులు...
నిర్మలా సావంత్... ఒక అమ్మ. వందనాపాటిల్ కూడా అమ్మే. ఈ ఇద్దరూ అందరు తల్లుల్లాగానే తమ కూతుళ్లకు జన్మనిచ్చారు. విధి ఈ ఇద్దరు తల్లులకూ ఒకేరకమైన పరీక్ష పెట్టింది. అదీ ఒకే నెలలో... మూడురోజుల తేడాలో. విధి జూన్ ఐదవ తేదీన నిర్మలాసావంత్ కూతుర్ని పొట్టనపెట్టుకుంది. జూన్ ఎనిమిదవ తేదీన వందనాపాటిల్ కూతురి ప్రాణాలనూ తీసుకుంది. కళకళలాడుతూ కళ్ల ముందు తిరిగిన పిల్లలు అచేతనంగా పడి ఉన్న సమయం... ఆ తల్లుల మనసు చేతనమైంది... బంగారం లాంటి బిడ్డ మట్టిపాలు కావడానికి వీల్లేదంటూ... అవయవదానానికి సిద్ధమయ్యారు. నలుగురి ప్రాణాలను కాపాడి, ఒకరికి చూపునిచ్చారీ తల్లులు. ఈ ఇద్దరూ ఉండేది ముంబయిలోనే. కానీ, ఒకరికొకరు పరిచయమే లేదు. అయినా తల్లి మనసు వారిని ఒకచోట చేర్చింది. ముంబై నగరంలోని బాంద్రాలో నివసించే నిర్మలా సావంత్-ప్రభావల్కర్ దంపతులకు ఒక్కగానొక్క కూతురు హేమంగి. ఇంజినీరింగ్ చదివే హేమంగి ఎప్పుడూ చలాకీగా ఉండేది. తల్లితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది. నిర్మల రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించడంతోపాటు సామాజిక సేవ చేస్తుంటారు. 1994-95లో నిర్మల ముంబై మేయర్గా విధులు నిర్వహించారు. అడ్వకేట్ అయిన నిర్మల ప్రస్తుతం ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్’ (ఎన్డిడబ్ల్యూ) సభ్యురాలు. తరచు తల్లికి చేదోడుగా ఉండే హేమంగి... గడచిన జూన్ అయిదవ తేదీన కూడా నిర్మలకు కావల్సిన వివరాలను కంప్యూటర్ నుంచి తీసి ఇచ్చింది. అదే సమయంలో తలనొప్పిగా ఉందంటూ తలపట్టుకుంది. ఇంట్లో అందరూ మామూలు తలనొప్పిగానే భావించారు. కానీ, ఇంతలోనే ‘‘అమ్మా... నొప్పి ఎక్కువవుతోంది. భరించలేకపోతున్నానని’ చాలా వేదనతో చెప్పింది. ప్రమాదాన్ని శంకించిన నిర్మల కూతుర్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధం చేయసాగింది. అంతలోనే ‘నొప్పి భరించలేక పోతున్నా’’నంటూనే వాంతి చేసుకుని ఒక్కసారిగా సోఫాలో వాలిపోయింది హేమంగి. తీవ్ర భయాందోళనలకు గురైన నిర్మల వెంటనే ఇరుగుపొరుగు వారి సహాయంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి హేమంగిని తీసుకవెళ్లింది. డాక్టర్లు ఆమెను ఐసియులోకి చేర్పించి చికిత్స ప్రారంభించారు. నిర్మల మాత్రం వాంతి చేసుకోవడం కారణంగా తన కూతురికి ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండవచ్చని భావించింది. కానీ మెదడులోని నరాలు చిట్లి (బ్రెయిన్ హెమరేజ్) హేమంగి బ్రెయిన్డెడ్ అయిందని తెలిసి నిర్మలకు గుండె ఆగినంత పనైంది. ఎంత ఖర్చు అయినా సరే తన బిడ్డను రక్షించమని డాక్టర్లను వేడుకుంది. కానీ ఫలితం దక్కలేదు. ఆమెని ఓదార్చడానికి... ‘‘ఇతర అవయవాలు బాగున్నాయి. అవయవాలను దానం చేయవచ్చని డాక్టర్లు చెప్పారు. చాలా సేపు ఎటూ తేల్చుకోలేక మధన పడిన తర్వాత నిర్మల తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంతో... లీలావతి ఆసుపత్రిలోని ఓ 38 ఏళ్ల వ్యక్తికి హేమంగి మూత్రపిండాన్ని అమర్చారు. ఠాణే జూపిటర్ ఆసుపత్రిలోని ఓ వ్యక్తికి కాలేయాన్ని అమర్చారు. మరణించినతర్వాత కూడా.... ‘‘దేవుడు ఆమెను త్వరగా తీసుకెళ్లాడు. తను మరణించిన తర్వాత కూడా ఇద్దరికి జీవం పోసింది’’ అంటూ కంటతడిపెట్టారు నిర్మల. మరణం తర్వాత తన అవయవాలు మరొకరికి దానం చేస్తూ అంగీకార పత్రం రాసినట్లు తెలిపారామె. అమూల్యమైన అవయవాలను కాల్చి బూడిదపాలు చేస్తుండడం వల్ల అవి ఎవరికీ అక్కరకు రాకుండా పోతున్నాయి. అందుకే ఈ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు. అయితే కష్టం అనేది వద్దనుకున్నా వచ్చి పడేదే. ఆ కష్టం వచ్చినప్పుడు మనసు దిటవు చేసుకుని అవయవాలను మరొకరికి ఉపయోగపడడానికి ప్రయత్నిస్తే మరెన్నో జీవితాల్లో వసంతం నింపిన వాళ్లవుతారు. అన్నింటినీ మించిన మహోన్నత దానం అవయవదానం. ఇద్దరిలో జీవిస్తోంది! మహారాష్ట్రలోని లక్ష్మణ్ పాటిల్ దంపతులకు కూడా నిర్మలా సావంత్కు ఎదురైన పరిస్థితే వచ్చింది. సాంగ్లీ జిల్లాకి చెందిన లక్ష్మణ్ పాటిల్ ఆయన భార్య వందన బతుకుదెరువుకోసం ముంబైకి నగరానికి సమీపంలోని ఠాణే ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక బాబు. లక్ష్మణ్ గోడౌన్లలో హమాలి (కూలి). వీరి రెండవ కూతురు నిఖిత చదువులో చురుకైనది. స్కాలర్షిప్ కూడా తెచ్చుకుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే గడచిన వేసవి సెలవులకూ స్వగ్రామం వెళ్లారు నిఖిత కుటుంబీకులు. పాఠశాలలు తెరవకముందే మళ్లీ ఠాణేకు రావడానికి సిద్ధంకాసాగారు. ఇంతలో ఓ రోజు... వీరి బంధువుల గూడ్స్ టెంపో ఠాణేకు ఖాళీగా వెళ్తోంది. ఆ టెంపోలో వెళ్తే దారి ఖర్చులు కలిసి వస్తాయనే ఆశ. గడచిన జూన్ 8వ తేదీ రాత్రి 10.30 నిమిషాలకు బయలుదేరారు. తెల్లవారి ఐదున్నర సమయంలో కాలాపూర్ వద్ద... ఒక్కసారిగా భారీ శబ్దం. డ్రైవర్, నిఖిత తీవ్రమైన గాయాలతో రక్తం మడుగులో ఉన్నారు. వందన చేతికి గాయం తీవ్రంగా తగిలింది. మిగతా ఇద్దరు పిల్లలకు, లక్ష్మణ్కు మాత్రం పెద్దగా గాయాలు కాలేదు. సమీపంలో ఉన్న ‘ఎంజిఎం’ఆసుపత్రికి వీరిని తరలించారు. అప్పటి వరకు మాట్లాడుతున్న నిఖిత ఒక్కసారిగా ఉలుకుపలుకు లేకుండా పోయింది. డాక్టర్లు నిఖిత బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. ఇక ఆమె బతకడం కష్టమని డాక్టర్లు స్పష్టం చేయడంతో ఒక్కసారిగా వీరి దుఃఖం రెట్టింపయింది. భోరున విలపించిన పాటిల్ దంపతులు అంతలోనే గుండెనిబ్బరం చేసుకుని నిఖిత మూత్రపిండాలను దానం చేశారు. ఇలా పాటిల్ దంపతులు అంత బాధలోనూ ైధైర్యంగా తీసుకున్న నిర్ణయం రెండు నిండుప్రాణాలను కాపాడింది. దీంతో వీరి కూతురు నిఖిత ఇద్దరికి ప్రాణం పోసినట్టు. నిఖిత మూత్రపిండాలలో ఒకటి ఎంజిఎం ఆసుపత్రిలోని పేషెంట్కు, మరొకటి ముంబై జెస్లోక్ ఆసుపత్రిలోని పేషెంట్కు అమర్చారు. అన్నట్లుగానే పేరు తెచ్చుకుంది! పెద్దచదువులు చదివి ఐపిఎస్ అవుతానని, అందరికీ సహాయం చేసి మంచి పేరు తెచ్చుకుంటాననేది. తానన్నట్లే అవయవాలను దానం చేసి మరణించిన తర్వాత తన పేరును సుస్థిరం చేసుకుంది. - లక్ష్మణ్పాటిల్, నిఖిత తండ్రి హేమంగి బ్రెయిన్ డెడ్ అయిందని తెలిసిన క్షణం నేను సర్వం కోల్పోయానన్న బాధ కలిగింది. ఒక్కగానొక్క కూతురు కళ్ల ముందే ఇలా కావడంతో మనోధైర్యాన్ని కోల్పోయాను. గుండెనిబ్బరం చేసుకుని హేమంగి అవయవాలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అవయవాల మార్పిడి విజయవంతమైందని తెలిసినప్పుడు అంత దుఃఖంలోనూ సంతోషం కలిగింది.వారి రూపంలో నా హేమంగి ఇంకా భూమ్మీదనే ఉంది. - నిర్మలాసావంత్, హేమంగి తల్లి హమాలి పని చేసే మేము బహుశా ఆమెను పెద్దచదువులు ఎంతవరకు చదివించేవాళ్లమో తెలియదు, కాని పదేళ్ల వయసులోనే ఆమె అందరికీ స్ఫూర్తిగా మారింది. - వందనా పాటిల్, నిఖిత తల్లి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్
‘అతడు 70 శాతం ఇండియన్.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్’
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
Advertisement