breaking news
GURVAIGUDEM
-
మద్ది అంజన్న సేవలో బుల్లితెర నటులు
జంగారెడ్డిగూడెం రూరల్: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్లితెర నటులు దర్శించుకున్నారు. శతమానం భవతి సీరియల్, కల్యాణ వైభోగమే తెలుగు ధారావాహికలో నటిస్తున్న శ్రీరామ్, ప్రముఖ నటి మేఘనలు శుక్రవారం దర్శించుకున్నారు. పాపికొండల పరివాహక ప్రాంతంలో జరుగుతున్న కల్యాణ వైభోగమే సీరియల్ చిత్రీకరణకు వచ్చిన వారు అంజన్నను దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామి ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఆశ్వీరచనాలు అందించారు. స్వామిని దర్శించుకున్న ఆర్డీఓ స్వామి వారిని కొత్తగా బాధ్యతలు చేపట్టిన జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె.మోహన్ కుమార్ దర్శించుకున్నారు. ఆర్డీఓకు ఆలయ చైర్మన్ యిందుకూరి రంగరాజు, కార్యనిర్వాహణాధికారి పెన్మెత్స విశ్వనాధరాజులు శేషవస్త్రాన్ని కప్పి సత్కరించారు. స్వామి వారిచిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. నేడు తమలపాకుల పూజ కార్తీకమాసం మూడో శనివారం కావడంతో స్వామికి లక్ష తమలపాకులతో పూజ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. తొలుత స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం అనంతరం తమలపాకుల పూజ చేస్తామని పేర్కొన్నారు. -
పెళ్లి కావాలంటే ఆ గుడిలో మొరపెట్టుకోండి
-
శ్రీవారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల/జంగారెడ్డి గూడెం / జంగారెడ్డిగూడెం రూరల్ : ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం రాత్రి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎ.రామ లింగేశ్వరరావు, రమ్య దంపతులు, వారి కుమార్తె రచన సందర్శించారు. వీరికి దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. న్యాయమూర్తి శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామి వారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆలయ సూపరింటెండెంట్ రమణరాజు ఆయనకు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. ‘మద్ది’లో పూజలు గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి వారినీ రామలింగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మ¯ŒS ఇందుకూరి రంగరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మ¯ŒS జడ్జిని సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఏలూరు ఎక్సైజ్ మేజిసే్ట్రట్ తిరుమలరావు, జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి డి.అజయ్కుమార్ ఆయన వెంట ఉన్నారు. తిరుమల పారిజాతగిరిలో.. : కాగా జంగారెడ్డి గూడెంలోని గోకుల పారి జాతగిరి వేంకటేశ్వరస్వామి వారినీ రామ లింగేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా కార్తీక మాసం సందర్భంగా తొలుత అర్చకులు వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ నుంచి ప్రారంభించి అనేక కార్యక్రమాలు జరిపారు.