-
బంగారం కన్నా బాండ్లు బెటర్
ఉమెన్ ఫైనాన్స్ / గోల్డ్ బాండ్స్ బంగారం డిమాండును తగ్గించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం వారు గోల్డ్ బాండ్ స్కీమును ప్రారంభించారు. ఈ గోల్డ్ బాండ్స్ని ఆర్.బి.ఐ. (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) జారీ చేస్తుంది. వీటిని డీమ్యాట్ పద్ధతిలో, పేపర్ రూపేణ కూడా జారీ చేస్తారు. వీటిని నిర్ణీత బ్యాంకు శాఖలు, పోస్ట్ ఆఫీసు బ్రాంచీల ద్వారా నిర్వహిస్తారు. గోల్డ్ బాండ్లు కొనాలని ఆసక్తి ఉన్నవారు వాటిపై కనీస అవగాహన కలిగి ఉండాలి. * గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు కనీసం 2 గ్రాములు మొదలుకొని 500 గ్రాముల వరకు ఒక ఆర్థిక సంవత్సరానికి కొనుకోలు చేయవచ్చు. * ఈ బాండ్లను జారీ చేసేటప్పుడు గ్రాము విలువ ఎంత? అప్లికేషన్ గడువు తేదీలు ఏమిటి? అన్నది ఆర్.బి.ఐ. నిర్ణయిస్తుంది. * కాల పరిమితి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల తర్వాత గ్రాము విలువ ఎంతైతే ఉంటుందో అంత మొత్తాన్ని ఖాతాదారునికి అందజేస్తారు. బాండ్లు కొన్న తర్వాత కూడా ఐదవ సంవత్సరం నుండీ డబ్బు అవసరం అయితే ఆ సమయానికి ఉన్న గ్రాము ధర ఆధారంగా సొమ్మును పొందవచ్చు. * పెట్టుబడిదారులకు 2.75 శాతం (సంవత్సరానికి) చొప్పున వడ్డీ అందజేస్తారు. ఈ వడ్డీని ఆరు నెలలకు ఒకసారి ఖాతాదారుని ఖాతాకు జమ చేస్తారు. * ఈ గోల్డ్ బాండ్స్ మీద వచ్చే కాపిటల్ గైన్కు పన్ను మినహాయింపు ఉంటుంది. * గోల్డ్ బాండ్ రేటును ఇండియా బులియన్ అండ్ జెవెల్స్ అసోసియేషన్ (ఐ.బి.జె.ఎ) వారు అంతకు క్రితం వారంలోని 999 ప్యూరిటీ బంగారం క్లోజింగ్ రేటు సింపుల్ యావరేజీ ఆధారంగా నిర్ణయించిన ధరను బట్టి నిర్ణయిస్తారు. * ఈ గోల్డ్ బాండ్స్ స్టాక్ ఎక్సేంజీలలో లిస్ట్ అయి, ట్రేడ్అవుతూ ఉంటాయి కనుక ఒకవేళ ఐదేళ్లకు ముందే సొమ్మును వెనక్కి తీసుకోవాలంటే వాటిని అమ్మవచ్చు. * ఈ గోల్డ్ బాండ్స్ను లోన్ తీసుకోవడానికి కోల్లేటరల్గా కూడా వాడుకోవచ్చు. పెట్టుబడి కోసమే బంగారం కొనేవారికి ఈ గోల్డ్ బాండ్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బంగారానికి బదులు ఈ గోల్డ్ బాండ్స్ కొనడం వల్ల ఎలాంటి దొంగల భయం, ప్యూరిటీ భయం ఉండదు. అంతేకాకుండా బంగారం బదులు బాండ్స్ కొనడం వల్ల బంగారం డిమాండు తగ్గి, తద్వారా బంగారం దిగుమతులు తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా మన దేశ ఉన్నతికి కూడా సహాయపడగలుగుతారు. - రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
పసిడి బాండ్లు @ 246 కోట్లు!
బాండ్లు ఓకే... డిపాజిట్లే నిరుత్సాహం * తాజా పసిడి పథకాలపై ప్రభుత్వం అభిప్రాయం * డిపాజిట్ల మెరుగుకు మరిన్ని చొరవలు న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన పసిడి పథకాల విషయంలో... బాండ్లకు మంచి స్పందన లభించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డిపాజిట్ల పథకం నిరుత్సాహకరంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. నవంబర్ 5 నుంచి 20 వతేదీ మధ్య తొలి దశ గోల్డ్ బాండ్ స్కీమ్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే... గోల్డ్ బాండ్ల కోసం రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 63,000 దరఖాస్తులు అందాయి. విలువ రూపంలో రూ. 246 కోట్లు. ఇది చక్కటి స్పందన అని ఆర్థిక శాఖ తెలిపింది. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా దాదాపు 917 కేజీల పరిమాణంగల బంగారం బాండ్లకు డిమాండ్ వచ్చినట్లు పేర్కొంది. గోల్డ్ డిపాజిట్ స్కీమ్ విషయానికి వస్తే... స్పందన నామమాత్రంగా ఉంది. ఈ స్కీమ్ కింద ఆదాయపు పన్ను, కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి. స్పందన మరింత పెరగడానికి ఏడు కీలక నిర్ణయాలను కూడా ప్రభుత్వం తీసుకుంది. సేకరణ, స్వచ్ఛత పరిశీలన కేంద్రాలతో సంబంధం లేకుండా... బ్యాంకులకు ఆమోదయోగ్యమైన రిఫైనర్కు బంగారాన్ని ప్రత్యక్షంగా ఇచ్చి, ప్యూరిటీ సర్టిఫికేట్ పొందవచ్చన్న నిర్ణయం ఇందులో ప్రధానమైనది. అవిభాజ్య కుటుంబాలు, సంస్థల విషయంలో బల్క్ డిపాజిట్లకు ఈ చొరవ దోహదపడుతుందన్నది ప్రభుత్వ భావన. ముద్రణ, సోషల్ మీడియా, రేడియో, టెలివిజన్ విభాగాల ద్వారా ప్రజల్లో డిపాజిట్ పథకం పట్ల మరింత విస్తృత కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. రిఫైనరీల లెసైన్సింగ్ అంశాలను మరింత సరళతరంగా, పటిష్టంగా మలచాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గోల్డ్ రిఫైనరీల లెసైన్సుల సంఖ్య దాదాపు 20కి చేరే అవకాశం ఉంది. పథకానికి సంబంధించి పసిడి సేకరణ, స్వచ్ఛత పరిశీలన సెంటర్ల నిర్వహణకు లెసైన్సులు ఉన్న 13,000 మంది ఆభరణాల వర్తకుల నుంచి దరఖాస్తులను బీఐఎస్ ఆహ్వానించింది. ఈ ఏడాది చివరికల్లా వీరిలో 55 మందిని రిజిస్టర్ చేసుకునే వీలుంది. బీఐఎస్, ప్యూరిటీ సెంటర్లు అన్నీ అనుసంధానించడం ద్వారా డిపాజిట్ల స్కీమ్కు మరింత ప్రోత్సాహానికి కృషి. * ప్రస్తుతం స్కీమ్ కింద 33 సీపీటీసీలు, అయిదు గోల్డ్ రిఫైనరీలు నోటిఫై అయ్యాయి. * టెస్టింగ్, రవాణా, రిఫైనింగ్, సీపీటీసీ, రిఫైనరీల్లో నిల్వ సేవల విషయంలో అయ్యే వ్యయాలకు సంబంధించి బ్యాంకులకు చెల్లించే ఫీజులను తిరిగి చెల్లించేయడం జరుగుతుంది. * దేశంలో దాదాపు రూ.52 లక్షల కోట్ల విలువైన 20,000 టన్నుల పసిడి బీరువాలకు పరిమితమవుతోందన్న అంచనాలు ఉంటే... గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా నవంబర్ 18 నాటికి కేవలం 400 గ్రాముల పసిడి డిపాజిట్ అయిన సంగతి తెలిసిందే. * సంబంధిత వర్గాల అభిప్రాయాలకు అనుగుణంగా ఈ స్కీమ్లను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.489 కోట్లు అవుట్... ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే గోల్డ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల నుంచి నిధుల వరద కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య దాదాపు రూ.489 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి వెళ్లినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇలా వెళ్లిన మొత్తం రూ.1,016 కోట్లు కావడం గమనార్హం. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా ఈటీఎఫ్ల నుంచి రూ. 2,293 కోట్లు, రూ.1,475 కోట్లు మళ్లాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలలతో పోల్చితే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నెలల్లో ఈటీఎఫ్ల నుంచి మళ్లిన మొత్తాలు తక్కువగా ఉండడానికి... ఈక్విటీ మార్కెట్ల బలహీనత కూడా కొంత కారణమని సంబంధిత వర్గాలు అంచనావేస్తున్నాయి. కాగా మార్చి నాటికి ఈటీఎఫ్ నిర్వహణ విలువ రూ.6,655 కోట్లు కాగా, ఈ పరిమాణం ఆగస్టు నాటికి రూ.6,226 కోట్లకు తగ్గింది. 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచీ మార్కెట్లో పలు మ్యూచువల్ ఫండ్ గోల్డ్ స్కీమ్లు ఉన్నాయి. 14 గోల్డ్ ఆధారిత స్కీమ్లు ప్రస్తుతం ఉన్నాయి.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- ‘సాక్షి’కి టీ 20 వరల్డ్కప్ ట్రోఫీ
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement