-
అంతర పంట.. లాభాల బాట
పెరవలి: కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఆ అభ్యుదయ రైతుకు అక్షరాలా సరి పోతుంది. పట్టుదల, కృషి, నమ్మకం ఉం టే పుడమితల్లి ఆదుకుంటుందని నమ్మి లాభాలను ఆర్జిస్తున్నారు పెరవలి మండ లం ముక్కామలకు చెందిన కౌలు రైతు మాకే వీరబాబు. నాలుగెకరాల కొబ్బరి తోటలో పసుపు సాగు చేపట్టి లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగులో మెళకువలు ఆయన మాటల్లోనే.. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మూడేళ్ల క్రితం నాలుగు ఎకరాల కొబ్బరి తోటను ఏడాదికి రూ.30 వేలు చొప్పున కౌలుకు తీసుకుని పసుపు సాగు చేపట్టాను. దిగుబడి ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మార్కెట్టులో గిట్టుబాటు ధర లభించక రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. దీంతో పసుపు సాగుకు ముందు ఆకుకూరలను పండించాను. సీజన్ రాగానే పసుపు సాగు చేశాను. ఆకుకూరల ఆదాయం పెట్టుబడికి సరిపోయింది. పుట్టు పసుపు రూ.3 వేలు పసుపు ఊరటానికి ముందు చేలో మూడుసార్లు దుక్కులు దున్నాను. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 10 టన్నులు వేసి, నీరు పెట్టి విత్తనం నాటాం. అధికారులు సూచనలతో ఎరువులు వినియోగించాం. గతేడాది ఎకరానికి 50 పుట్టుల (పుట్టు అనగా 236 కిలోలు) పసుపు ఊరింది. పచ్చిపసుపు పుట్టు రూ.3 వేలు చొప్పున అమ్మాను. నష్టాలను పూడ్చుకోగలిగాను. ప్రస్తుతం పసుపు సాగు చేపట్టాం. కొబ్బరితోటల్లో అనువైన విత్తనం గోదావరి జిల్లాల్లో కస్తూరి రకం పసుపు సాగు చేస్తారు. నేను దుగ్గిరాల పసుపు వే శాను. ఈ పసుపు దిగుబడితో పాటు మార్కెట్టులో మంచి ధర లభిస్తుంది. గతేడాది పుట్టు విత్తనం పసుపు రూ.5 వేలకు కొనుగోలు చేశాను. కొబ్బరితోటల్లో దుగ్గిరాల పసుపు సాగుకు అనుకూలం. ఈ పంటకు నీడ అవసరం. ప్రస్తుతం 4 ఎకరాల్లో పసుపు సాగుకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. వాతారవణం అనుకూలిస్తే ఈ ఏడాది లాభాలు వస్తాయి. ఖర్చుతక్కువ లాభం ఎక్కువ కొబ్బరి తోటలో పసుపు సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో బోదెలు తవ్వాలి. చచ్చు ఎక్కేయాలి. ఎరువులు ఎక్కువగా వినియోగించాలి. కొబ్బరి తోటలో పసుపుకి బోదెలు, చచ్చు ఎక్కేయటం వంటి పనులుండవు. దీంతో ఎకరానికి రూ.15 వేలు వరకు ఖర్చు ఆదా అవుతుంది. ఎరువుల ఖర్చుకూడా తగ్గుతుంది. చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. ఈ తోటల్లో వేసే పసుపుకి రసాయనిక ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులను ఎక్కువ వినియోగిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. -
అంతర పంట.. లాభాల బాట
పెరవలి: కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఆ అభ్యుదయ రైతుకు అక్షరాలా సరి పోతుంది. పట్టుదల, కృషి, నమ్మకం ఉం టే పుడమితల్లి ఆదుకుంటుందని నమ్మి లాభాలను ఆర్జిస్తున్నారు పెరవలి మండ లం ముక్కామలకు చెందిన కౌలు రైతు మాకే వీరబాబు. నాలుగెకరాల కొబ్బరి తోటలో పసుపు సాగు చేపట్టి లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగులో మెళకువలు ఆయన మాటల్లోనే.. పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మూడేళ్ల క్రితం నాలుగు ఎకరాల కొబ్బరి తోటను ఏడాదికి రూ.30 వేలు చొప్పున కౌలుకు తీసుకుని పసుపు సాగు చేపట్టాను. దిగుబడి ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మార్కెట్టులో గిట్టుబాటు ధర లభించక రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. దీంతో పసుపు సాగుకు ముందు ఆకుకూరలను పండించాను. సీజన్ రాగానే పసుపు సాగు చేశాను. ఆకుకూరల ఆదాయం పెట్టుబడికి సరిపోయింది. పుట్టు పసుపు రూ.3 వేలు పసుపు ఊరటానికి ముందు చేలో మూడుసార్లు దుక్కులు దున్నాను. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 10 టన్నులు వేసి, నీరు పెట్టి విత్తనం నాటాం. అధికారులు సూచనలతో ఎరువులు వినియోగించాం. గతేడాది ఎకరానికి 50 పుట్టుల (పుట్టు అనగా 236 కిలోలు) పసుపు ఊరింది. పచ్చిపసుపు పుట్టు రూ.3 వేలు చొప్పున అమ్మాను. నష్టాలను పూడ్చుకోగలిగాను. ప్రస్తుతం పసుపు సాగు చేపట్టాం. కొబ్బరితోటల్లో అనువైన విత్తనం గోదావరి జిల్లాల్లో కస్తూరి రకం పసుపు సాగు చేస్తారు. నేను దుగ్గిరాల పసుపు వే శాను. ఈ పసుపు దిగుబడితో పాటు మార్కెట్టులో మంచి ధర లభిస్తుంది. గతేడాది పుట్టు విత్తనం పసుపు రూ.5 వేలకు కొనుగోలు చేశాను. కొబ్బరితోటల్లో దుగ్గిరాల పసుపు సాగుకు అనుకూలం. ఈ పంటకు నీడ అవసరం. ప్రస్తుతం 4 ఎకరాల్లో పసుపు సాగుకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. వాతారవణం అనుకూలిస్తే ఈ ఏడాది లాభాలు వస్తాయి. ఖర్చుతక్కువ లాభం ఎక్కువ కొబ్బరి తోటలో పసుపు సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో బోదెలు తవ్వాలి. చచ్చు ఎక్కేయాలి. ఎరువులు ఎక్కువగా వినియోగించాలి. కొబ్బరి తోటలో పసుపుకి బోదెలు, చచ్చు ఎక్కేయటం వంటి పనులుండవు. దీంతో ఎకరానికి రూ.15 వేలు వరకు ఖర్చు ఆదా అవుతుంది. ఎరువుల ఖర్చుకూడా తగ్గుతుంది. చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. ఈ తోటల్లో వేసే పసుపుకి రసాయనిక ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులను ఎక్కువ వినియోగిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement