breaking news
Gas Ltd.
-
అదానీ టోటల్ గ్యాస్కు ఆడిటర్ రాజీనామా.. కానీ..!
న్యూఢిల్లీ: అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ ఆడిటర్ సేవల నుంచి ‘షా దందారియా’ అనూహ్యంగా తప్పుకుంది. ఇతర బాధ్యతల కారణంగా స్టాట్యుటరీ ఆడిటర్ బాధ్యతలకు షా దందారియా అండ్ కో రాజీనామా సమర్పించినట్టు అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ ఎక్సేంజ్లకు సమాచారం ఇచ్చింది. అదానీ గ్రూపుపై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరి 24న నివేదిక విడుదల చేయగా, అందులో షా దందారియా పేరు కూడా ఉండడం గమనార్హం. అదానీ గ్రూపులో పెద్ద కంపెనీల ఖాతాలను, పెద్దగా అనుభవం లేని ఓ చిన్న ఆడిటింగ్ సంస్థ సేవలు అందించడాన్ని హిండెన్బర్గ్ సంస్థ ప్రశ్నించింది. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తుండడం తెలిసిందే. ఈ తరుణంలో అదానీ గ్రూపు కంపెనీకి ఆడిటర్గా షా దందారియా తప్పుకోవడం యాధృచ్చికం. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న చిన్న చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థయే షా దందారియా. అదానీ ఎంటర్ప్రైజెస్కు సైతం ఈ సంస్థ ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. అయితే, ఒక్క అదానీ టోటల్ గ్యాస్ ఆడిటింగ్ సేవలకే ప్రస్తుతం రాజీనామా సమర్పించింది. ముందుగా ఒప్పుకున్న ఇతర బాధ్యతలు మినహా, తమ రాజీనామాకు మరే ఇతర కారణం లేదని షా దందారియా స్పష్టం చేసింది. -
పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరా విస్తరణ
కుత్భుల్లాపూర్లో ప్రారంభించిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ హైదరాబాద్: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(బీజీఎల్) సంస్థ ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరాను విస్తరించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న కుత్భుల్లాపూర్ సమీపంలోని గోదావరి హోమ్స్కు పైప్లైన్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) సరఫరా చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. ఇప్పటివరకు నల్సార్ వర్సిటీ క్యాంపస్, మేడ్చల్ మండల కేంద్రానికే పీఎన్జీ పరిమితమైంది. లక్ష కుటుంబాలకు 2014 ఏప్రిల్ నాటికి పీఎన్జీ అందించాలని లక్ష్యం నిర్దేశించుకున్న బీజీఎల్ ఇప్పుడు 440 కుటుంబాలకే ఇవ్వగలుగుతోంది. విస్తరణపనులు కేవలం 32కి.మీ. మేరకు సాగాయి.