breaking news
Finance Ministry Arun Jaitley
-
ట్యాక్స్ పేయర్లకు గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం 2018 బడ్జెట్లో గుడ్న్యూస్ చెప్పబోతుంది. పాపులర్ ''సెక్షన్ 80సీ'' స్కీమ్ కింద పెట్టుబడుల పరిమితిని ఏడాదికి రూ.2,00,000లకు పెంచాలని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రూ.2 లక్షల వరకున్న బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులకు పన్ను చెల్లించవసరం లేదు. ఇప్పటి వరకున్న నిబంధన ప్రకారం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద ప్రాఫిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, పిల్లల ట్యూషన్ ఫీజు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, స్పెషిఫిక్ మ్యూచవల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో పెట్టుబడి పెట్టే మొత్తంలో రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. ఒకవేళ ఇది కనుక అమలైతే, ఫైనాన్సియల్ ఇన్స్ట్రుమెంట్లలో ప్రజలు పొదుపు చేయడం పెరుగుతుందని తెలిసింది. ఈ పన్ను మినహాయింపును పెంచిన అనంతరం ఒకవేళ మీ స్థూల వార్షికాదాయం రూ.10 లక్షలుంటే, దానిలో సెక్షన్ 80సీ కింద ఇన్స్ట్రుమెంట్లలో పెట్టే పెట్టుబడులు రూ.2 లక్షలుంటే, కేవలం రూ.8 లక్షలకు మాత్రమే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రూ.1.5 లక్షల పరిమితి 2014-15 నుంచి కొనసాగుతూ వస్తోంది. జైట్లీ తన తొలి బడ్జెట్ 204-15లోనే ఈ పరిమితిని రూ.50వేల నుంచి లక్షన్నరకు పెంచారు. ప్రస్తుతం మరోసారి ఈ పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని అరుణ్ జైట్లీ యోచిస్తున్నారు. ఇటీవల బ్యాంకుల టాప్ ఎగ్జిక్యూటివ్లు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లతో అరుణ్జైట్లీ నిర్వహించిన మీటింగ్లో దీనిపై చర్చించినట్టు తెలిసింది. -
బ్యాడ్బ్యాంక్ ఏర్పాటుపై చర్చిస్తున్నాం
న్యూఢిల్లీ: తాజా ఆర్థిక సర్వే ప్రతిపాదించిన రెండు వినూత్న సూచనలు... ‘సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ)’, ‘బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు’ ఈ రెండింటిపై చర్చిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ తెలిపారు. యూబీఐ అనేది ప్రస్తుతానికి ఆచరణ సాధ్యం కాని విధానమని పేర్కొన్న ఆయన అందుకు రాజకీయ పరిమితులు కారణంగా పేర్కొన్నారు. ఐఐటీ, ఢిల్లీలో టీచర్ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ... ‘‘ఈ ఏడాది ఆర్థిక సర్వే ఇప్పుడున్న మొత్తం సబ్సిడీలకు ప్రత్యామ్నాయంగా సార్వత్రిక కనీస ఆదాయం అందించాలని, ఇది పేదరికంలో ఉన్న వారిని వేగంగా బయటకు తీసుకురాగలదని పేర్కొంది. అలాగే, బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు చేసి బ్యాంకుల ఎన్పీఏలు అన్నింటినీ దానికి బదలాయించాలని, అప్పుడు బ్యాంకులు తమ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టగలవని ఆర్థిక సర్వే సూచించింది. యూబీఐకి నేను పూర్తిగా మద్దతిస్తున్నాను. కానీ, దేశ రాజకీయాల్లో ఉన్న పరిమితులను అర్థం చేసుకున్న తర్వాత నా ఆందోళన వారికి తెలియజేశాను. యూబీఐ ఆలోచనను ముందుకు తీసుకొస్తే అప్పుడు పార్లమెంటులో ప్రతిపక్షాలు సబ్సిడీలను కొనసాగించాలని డిమాండ్ చేస్తాయి. పైగా యూబీఐని కూడా తీసుకురావాలంటాయి. బడ్జెట్ పరంగా అది భరించలేనిది’’ అని జైట్లీ వివరించారు. ఎన్పీఏలపై నేడు కీలక సమావేశం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ)ను వేధిస్తున్న మొండి బకాయిల (ఎన్పీఏల) సమస్యపై ఆయా బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం సమావేశం కానున్నారు. పీఎస్బీల ఎన్పీఏలు రూ.6 లక్షల కోట్లను దాటిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్పీఏల రికవరీని వేగవంతం చేసేందుకు తీసుకున్న చర్యలతోపాటు, బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను ఆయన సమీక్షించనున్నారు. ఎన్పీఏలపై ఈ ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న మొదటి సమీక్షా సమావేశం ఇదే. ఎన్పీఏలపై సత్వర, కఠిన చర్యలకు గాను కేంద్రం ఇటీవలే ఓ ఆర్డినెన్స్ను కూడా తీసుకొచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, ఎంఎస్ఈ రుణాలు, స్టాండప్ ఇండియా, ముద్రా యోజన తదితర ప్రధాన అంశాలు ఈ సమావేశపు అజెండాలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా ఆర్థిక సేవల విస్తృతి, అక్షరాస్యత, సామాజిక సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన ఉన్నట్టు పేర్కొంది. జూలై 1నుంచి జీఎస్టీ అమలు దృష్ట్యా బ్యాంకుల సన్నద్ధత, సైబర్ భద్రత, బ్యాంకు లావాదేవీల డిజిటైజేషన్, గ్రామీణాభివృద్ధి, సాగు, విద్యా రుణాలపైనా చర్చించనున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. హైబ్రిడ్ కార్లపై జీఎస్టీ రేటు మారదు హైబ్రిడ్ కార్లపై నిర్ణయించిన జీఎస్టీ రేటును సమీక్షించే అవకాశం లేదని ఆర్థిక మంత్రి జైట్లీ సంకేతమిచ్చారు. పన్ను అధికారుల అధ్యయన ఫలితాలకు, పరిశ్రమ డిమాండ్లకు మధ్య పొంతన లేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్ హైబ్రిడ్ కార్లపై 28 శాతం జీఎస్టీ, 15 శాతం సెస్ కలిపి మొత్తం 43 శాతంగా ఖరారు చేసింది. ఇంధన సామర్థ్యం గల వాహనాలపై ఈ రేటు చాలా అధికమని, దీన్ని 18 శాతానికి తగ్గించాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ఆదివారం జైట్లీ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ 133 వస్తువులపై రేట్లు తగ్గించాలన్న డిమాండ్లను పరిశీలించింది. చివరికి 66 వస్తువులపై తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ నిర్ణయించిన రేట్లు ప్రస్తుత రేట్ల కంటే తక్కువగానే ఉన్నాయని జైట్లీ పేర్కొన్నారు. ఇవే దాదాపుగా తుది రేట్లని స్పష్టం చేశారు. ఎవరో డిమాండ్ చేస్తే దాన్ని అమలు చేయాలని ఏమీ లేదన్నారు. ఎందుకు పెరిగాయంటే... అంచనాల కంటే తక్కువగానే పుత్తడిపై జీఎస్టీ రేటు ఖరారు కావడంతో టైటాన్ షేర్ 11 శాతం దూసుకుపోయింది. జైడస్ క్యాడిలా తయారు చేస్తోన్న మెసలమైన్ ఔషధానికి అమెరికా ఎఫ్డీఏ ఆమోదం లభించడంతో క్యాడిలా హెల్త్కేర్ 9 శాతం పెరిగింది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఐపీఓకు రానున్నదన్న వార్తలతో రిలయన్స్ క్యాపిటల్ షేర్ 7 శాతం ఎగసింది. ఇటీవల పతనం కారణంగా ఆకర్షణీయంగా ఉన్న ఫార్మా షేర్లలో కొనుగోళ్లతో దివిస్ల్యాబ్, సిప్లా షేర్లు 4–5 శాతం రేంజ్లో పెరిగాయి. ఎందుకు తగ్గాయంటే... రిలయన్స్ కమ్యూనికేషన్స్ క్రెడిట్ రేటింగ్ను బ్రోకరేజ్ సంస్థలు ఫిచ్ రేటింగ్స్, మూడీస్ తగ్గించడంతో గత వారం కూడా ఆర్కామ్ నష్టాలు కొనసాగాయి. అమెరికాతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల్లో నష్టాలు రావచ్చంటూ గెయిల్ రేటింగ్ను మోతిలాల్ ఓస్వాల్ డౌన్గ్రేడ్ చేసిన నేపథ్యంలో గెయిల్ షేర్ 5 శాతం పతనమైంది. ఐటీసీలో ఉన్న తన వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తల కారణంగా ఐటీసీ షేర్ 4 శాతం నష్టపోయింది. -
‘కార్డుల’పై ఆందోళన వద్దు
వినియోగదారులకు నష్టం జరగనీయమన్న కేంద్రం న్యూఢిల్లీ: డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా తస్కరణ వివాద పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. 32.5 లక్షల కార్డుల వివరాలు తస్కరణకు గురైన ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని సదరు బ్యాంకులు, ఆర్బీఐని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఆదేశించారు. వినియోగదారులకు ఎలాంటి నష్టమూ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీఇచ్చారు. కేసును సైబర్ నేరాల్లాగే గుర్తిస్తున్నామని.. ఈ దిశగానే విచారణ ఉంటుందన్నారు. ‘భారతీయ బ్యాంకుల ఐటీ వ్యవస్థ చిత్తశుద్ధి బలమైనది. ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీనికి సంబంధించి కేంద్రం సరైన చర్యలు తీసుకుంటుంది. వినియోగదారులకు నష్టం కలగకుండా చూసుకుంటుంది’ అని ఆర్థిక శాఖ కార్యదర్శి శశికాంత దాస్ వెల్లడించారు. డేటా తస్కరణకు సంబంధించి ప్రాథమిక నివేదిక అందిందని.. పూర్తి నివేదిక రాగానే కార్యాచరణ మొదలవుతుందని ఆయన తెలిపారు. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డేటా మోసం ద్వారా19 బ్యాంకుల్లో 641 మంది వినియోగదారులకు సంబంధించిన దాదాపు రూ. 1.3 కోట్లు చోరీకి గురైంది. 90 ఏటీఎంల ద్వారానే ఈ కార్డులనుంచి డబ్బులు తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. డేటా అతిక్రమణ జరిగిన వాటిలో 26.5 లక్షల కార్డులు ‘వీసా’, ‘మాస్టర్కార్డు’లకు చెందినవి కాగా.. 6 లక్షల కార్డులు ’రూపే’ నుంచి జారీ అయినవి. అయితే తమ కార్డుల భద్రత, నెట్వర్క్ల విషయంలో అలసత్వంగా ఉండే ప్రసక్తే లేదని వీసా, మాస్టర్కార్డు తెలిపాయి. ఏటీఎంల ద్వారా లావాదేవీల భద్రతను పర్యవేక్షిస్తున్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని వెల్లడించాయి.