-
10 నెలల్లో 185 మంది శిశువులు గర్భంలోనే కన్నుమూత.. ఆ రెండు ఆస్పత్రుల్లోనే!
ఆడ పిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందన్న రోజుల నుంచి ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసిన రోజులకు మానవ సమాజం దిగజారింది. మానవ శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి ఇందుకేనా.. అన్నట్టు తలదించుకునేలా చోటు చేసుకుంటున్న సంఘటనలు నివ్వెరపరుస్తున్నాయి. మరోవైపు వివాహేతర సంబంధాల నేపథ్యంలో గర్భంలోనే ఆడ.. మగ అనే తేడా లేకుండా జరుగుతున్న శిశు హత్యలు గుండెలను పిండేస్తున్నాయి. కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇదేనా మన విజ్ఞానాభివృద్ధి అనేలా ప్రశ్నిస్తున్నాయి. సాక్షి, విజయనగరం ఫోర్ట్: వైద్య రంగం అభివృద్ధి చెందక ముందు పుట్టే బిడ్డ ఆడ.. మగ అని మాత్రమే చూసేవారు. ఒక్కో మహిళ పది మంది పిల్లలకు జన్మనిచ్చేది. ఏ బిడ్డయినా సమానంగానే పెంచేవారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇలా సంతోషాలు వెల్లివిరిసేవి. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పుట్టే బిడ్డ ఆడ.. మగ అనేది అమ్మ గర్భంలోనే స్కానింగ్ చేసి గుర్తిస్తున్నారు. అంగ వైకల్యాలను సైతం గర్భంలోనే పసిగట్టేస్తున్నారు. ఇంకేముంది ఆడ బిడ్డయితే గర్భంలోనే చిదిమేస్తున్న సంఘటనలు వైద్య రంగాన్ని సవాల్ చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు కూడా ఇటువంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి. వివాహేతర సంబంధాల విషయంలో అది ఆడ.. మగ.. అని చూడకుండా భ్రూణహత్యలకు దిగజారుతున్నారు. వైద్య రంగ విప్లవం మానవ అభివృద్ధికి దోహదపడేలా తప్ప ఇలా తల్లి గర్భంలోనే భ్రూణ హత్యలకు దారితీయడం దారుణం. నింగిలో సగం.. నేలపై సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో నేడు రాణిస్తున్నారు. అవకాశాలు దక్కితే తమ సత్తా చూపుతున్నారు. అయినా ఆడ పిల్లల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడ పిల్లను ఎంతగా చదివించినా... వారు ఎంతగా రాణించినా పెళ్లి సమయంలో వరకట్న దురాచారం ఇంకా పీడిస్తూనే ఉంది. దీని ఫలితం ఆడ పిల్లలను వద్దనుకునే వారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఆడ పిల్లలను కోరుకునే వారు ఉన్నారు. చదవండి: చిన్న వయసులోనే గుండెపోటు ముప్పు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు పది నెలల్లోనే... 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి నెల వరకు 185 మంది గర్భంలోనే చనిపోయారు. వీరిలో 12 వారాల్లోపు చనిపోయిన వారు 135 మంది కాగా, 12 నుంచి 20 వారాల్లోపు చనిపోయిన వారు 50 మంది ఉన్నారు. ఈ మరణాల్లో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని కొందరు తల్లిదండ్రులు అబార్షన్లు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కానింగ్ సెంటర్లపై కొరవడిన పర్యవేక్షణ స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కొరవడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం భ్రూణ హత్యల నివారణకు ప్రత్యేక చట్టం తెచ్చి అమలు చేస్తున్నా... కొందరు నిర్వాహకులు అమ్యామ్యాలకు అలవాటుపడి లింగ నిర్ధారణ వెల్లడిస్తున్నారనే విమర్శలున్నాయి. కొన్నేళ్లుగా స్కానింగ్ కేంద్రాలపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఈ ఆరోపణలకు ఊతమిస్తుంది. ఆ రెండు ఆస్పత్రుల్లోనే... జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి అబార్షన్లు చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ విషయం సంబంధిత ఆస్పత్రులపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని తెలిసింది. ఇదే సమయంలో అబార్షన్ కోసం తీసుకువచ్చే ఆర్ఎంపీ, ఆశ వర్కర్లకు ఆయా ఆస్పత్రులు భారీగా ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: Health Tips: బరువు తగ్గాలని బ్రేక్ఫాస్ట్ మానేస్తే.. కష్టమే! తగ్గుతున్న ఆడ పిల్లల సంఖ్య జిల్లాలో ఆడ పిల్లల సంఖ్య నెలనెలా తగ్గిపోతుంది. వెయ్యి మంది బాలురుకు 940 మంది బాలికలే ఉన్నారు. 2021 డిసెంబరులో వెయ్యి మంది బాలురుకు 942 మంది బాలికలు ఉన్నారు. 2022 జనవరి నెల వచ్చేసరికి ఆ సంఖ్య 940కి తగ్గింది. స్కానింగ్ చేయాల్సిన పరిస్థితులు ► జన్యు సంబంధమైన జీవ కణాల్లో కలిగే అసాధ«రణ మార్పు గుర్తించినప్పుడు ► ఎర్ర రక్తకణాల్లో అసాధారణ స్థితి ఉన్నప్పుడు. ► లింగ సంబంధిత వ్యాధులు గుర్తించినప్పుడు. ► స్కానింగ్కు చట్టం ఆమోదించే పరిస్థితులు. ► గర్భదారణ జన్యు సంబంధమైన పిండానికి వ్యాధులు కనుగొనేందుకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తారు. ► గర్భిణికి రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావం, పిండ నష్టం జరిగినప్పుడు. ► గర్భిణులు హానికారక మందులు, అణుధార్మిక శక్తి, రసాయనాల బారిన పడినప్పుడు, దాని ప్రభావం కలిగినప్పుడు స్కానింగ్ చేయవచ్చు. సమాచారమిస్తే చర్యలు జిల్లాలో ఏ స్కానింగ్ సెంటర్లోనైనా లింగ నిర్ధారణ చేస్తున్నట్టు సమాచారం ఇస్తే తనిఖీలు చేసి తీవ్రమైన చర్యలు చేపడతాం. అటువంటి స్కానింగ్ సెంటర్ను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు పెడతాం. లింగ నిర్ధారణ వెల్లడి చట్టరీత్యా నేరమనే విషయమై అవగాహన కల్పిస్తున్నాం. అదే సమయంలో వివాహం కాకుండా గర్భం దాలుస్తున్న వారు అబార్షన్లు చేయించుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. – డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఎంహెచ్ఓ -
కడుపులోనే కత్తెర
సాక్షి, నెల్లూరు: జిల్లాలో లింగ నిర్ధారణ, భ్రూణహత్యలు రహస్యంగా జరిగిపోతున్నాయి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా.. అమాయకత్వం, పేదరికం, అవగాహన లోపంతో కడుపులో పడింది ఆడపిల్ల అని గుర్తించి గ్రామీణులు అబార్షన్లు చేయించుకుంటున్నారు. అన్నీ తెలిసిన కొందరు వైద్యులే ధనార్జనే ధ్యేయంగా అబార్షన్లు చేస్తుండటంతో ఆడ పిల్లలు బాహ్యప్రపంచం చూడకుండానే పిండంగానే కాలగర్భంలో కలిసిపోతున్నారు. కాదు చంపేస్తున్నారు. ఈ భ్రూణ హత్యలకు ఆరోగ్యశాఖ సిబ్బందే పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆడ, మగ అని అడగటం, చెప్పడం చట్ట రీత్యా నేరం. ఇలాంటి ప్రభుత్వ నినాదాలన్నీ ఆస్పత్రుల గోడలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా జిల్లాలో బాలికల నిష్పత్తి రోజు రోజుకు తగ్గిపోతుంది. జిల్లాలో బాలికలు 939 మందే.. జిల్లాలో బాలికల శాతం నానాటికి దిగజారిపోతోంది. 2001లో వెయ్యి మంది పురుషులకు 984 మంది స్త్రీలు ఉండగా వీరిలో 0–6 ఏళ్ల లోపు ప్రతి వెయ్యి మంది బాలురకు 954 మంది బాలికలు ఉన్నారు. 2011 నాటికి 939కు చేరుకుంది. 2017 0–6 ఏళ్లలోపు వారిలో ప్రతి వెయ్యి మంది బాలురుకు 945 మంది బాలికలు ఉన్నారు. గతేడాది లెక్కల పక్రారం ప్రతి 1000 మంది బాలురుకు 928 మందే బాలికలు ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ప్రతి వెయ్యి మంది బాలురుకు 953 మందికి పైగా బాలికలు ఉండాలని వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇష్టారాజ్యంగా స్కానింగ్ కేంద్రాలు.. జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతి పొందిన 209 స్కానింగ్ కేంద్రాలు ఉండగా మరి కొన్ని కేంద్రాలు అనుమతి లేకుండానే పని చేస్తున్నాయి. వీటిపై నిఘా పెట్టాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టిన పరిస్థితి లేదు. గతంలో పని చేసిన డీఎంహెచ్ఓలు కొన్ని స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నామమాత్రపు చర్యలకే పరిమితమయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ చేస్తున్నారు. దీంతో ఆడ శిశువు అని తెలియగానే వెంటనే అబార్షన్ చేయడం పరిపాటి అయింది. జిల్లాలో నెలకు 60కుపైగా అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు, నాయుడుపేట, కావలి, గూడూరు, నెల్లూరు నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకున్న సొంత స్కానింగ్ కేంద్రాల్లో ఈ తరహా పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. మరి కొన్ని ఆస్పత్రుల్లో పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలను నిషేధించినా కొన్ని చోట్ల వాటిని వినియోగిస్తున్నట్లు సమాచారం. పేదరిక భయం, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కాసులకు కక్కుర్తి పడి కొందరు డాక్టర్లు యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అని తేలితే కడుపులోనే కరిగిస్తున్నారు. లేదంటే యథేచ్ఛగా ఆస్పత్రుల్లోనే అబార్షన్లు చేస్తున్నారు. దీని వల్ల జిల్లాలో బాలిక నిష్పత్తి తగ్గిపోతుంది. లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాల్సిన వైద్యారోగ్యశాఖాధికారులు మాముళ్ల మత్తులో మునిగి తేలుతున్నట్లు విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశించినప్పుడో, మీడియాలో వార్తలు వచ్చినప్పుడో తప్ప వారు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు మేల్కోకపోతే భవిష్యత్లో అనంత నష్టం తప్పదంటున్నారు పలువురు వైద్య నిపుణులు. లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ చేసినట్లు రుజువైతే వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఘటనులు జరిగితే రూ.10 వేలు జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తాం. లింగ నిర్ధారణకు వ్యతిరేకంగా ఉన్న పీసీ, పీఎన్డీటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చట్టం అమలవుతోందో లేదో తెలుసుకునేందుకు త్వరలోనే ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. – జయశ్రీ, వైద్యశాఖమదర్ అండ్ చైల్డ్ డైరెక్టర్ -
గర్భంలోనే కత్తులు పెట్టుకొని పుట్టాలేమో?
ఒంగోలు టౌన్: ఆడపిల్ల బతకాలంటే తల్లి గర్భంలోనే కత్తులు పెట్టుకొని పుట్టాలి అన్నట్లుగా సమాజంలో ప్రస్తుత పరిస్థితులు ఉంటున్నాయని పలువురు కవులు వాపోయారు. ప్రజానాట్యమండలి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక ఎల్బీజీ భవన్లో ‘నన్ను బతకనివ్వరా’ అంటూ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కవితా గోష్ఠిని నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న దురాగతాలను కవులు, కవయిత్రులు తమ కవితల ద్వారా చదివి వినిపించారు. ప్రజానాట్యమండలి జిల్లా గౌరవాధ్యక్షుడు బీ దశర««ధ్ అధ్యక్షతన జరిగిన కవితా గోష్ఠిలో ప్రముఖ మహిళా కవి సింహాద్రి జ్యోతిర్మయి, నన్నపనేని రవి, కే లక్ష్మి, ఉన్నం జ్యోవాసు, ఎం. వెంకటఅప్పారావు, మూర్తి, ఎన్. రాధికారత్న, చింతపల్లి ఉదయజానకిలక్ష్మి, పాలూరి ప్రసాద్, కుర్రా ప్రసాద్, చాపల భాస్కర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి గదవల్ల బాలకృష్ణ, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర నాయకుడు ఉబ్బా కోటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్, నగర కార్యదర్శి కే చిన్నపరెడ్డి, డీవైఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడపిల్లని తెలిస్తే చిదిమేస్తున్నారు
చిత్తూరు అర్బన్: పుట్టబోయేది ఆడబిడ్డ అని తేలితే కడుపులోనే కడతేరుస్తున్నారు. ప్రాణం పోయాల్సిన వైద్యులే కాసుల కక్కుర్తితో ఈ దుష్టసంస్కృతికి తెరలేపారు. తాజాగా చిత్తూరు నగరంలోని ఓ ఆస్పత్రిలో జరుగుతున్న భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షల గుట్టురట్టయ్యింది. అధికారులు గురువారం ఆ ఆస్పత్రిపై దాడి చేసి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ స్వర్ణ విజయగౌరి మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలో ఉన్న నాయుడు బిల్డింగ్స్లోని శివప్రకాశ్ నర్సింగ్ హోమ్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంలో పాటు భ్రూణ హత్యలు జరుగుతున్నాయంటూ కేంద్ర నిఘా వ్యవస్థకు ఫిర్యాదులు వెళ్లాయి. తమిళనాడు నుంచి గర్భిణులను తీసుకొచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని.. కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తేలితే ఇంజెక్షన్లు, మందుల ద్వారా కడుపులోనే చిదిమేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జాతీయ లింగ నిర్ధారణ నిరోధక, పర్యవేక్షణ బృందం చిత్తూరుకు చేరుకుంది. నగరంలోని హైరోడ్డులో ఉన్న మహిళా మధ్యవర్తి వద్దకు ఓ గర్భిణిని తీసుకెళ్లారు. కడుపులో ఉన్నది ఏ మగబిడ్డో, ఆడబిడ్డో తెలుసుకోవాలనుకుంటున్నామని ఆమెకు చెప్పారు. అయితే ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందని చెప్పగా.. ఆ మొత్తాన్ని ఆమెకు అందజేశారు. దీంతో ఆమె సూచనల మేరకు గర్భిణిని ఆటోలో ఎక్కించుకుని శివప్రకాశ్ నర్సింగ్ హోం గైనకాలజిస్టు డాక్టర్ శోభ వద్దకు తీసుకెళ్లారు. రూ.4 వేలు వైద్యురాలికి అందజేసి.. వెయ్యి రూపాయలను మధ్యవర్తి తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్య కెమెరాల్లో చిత్రీకరించినట్లు డీఎంహెచ్వో తెలిపారు. ఇంతలో కేంద్ర బృంద సభ్యులు స్థానిక పోలీసుల్ని తీసుకుని ఒక్కసారిగా ఆస్పత్రిపై దాడులు చేసి.. అబార్షన్లు చేయడానికి ఉపయోగించే మాత్రలు, స్కానింగ్ యంత్రాలను, పెద్ద మొత్తంలో పలు రకాల మందుల్ని సీజ్ చేసినట్లు ఆమె వెల్లడించారు. అత్యధికులు తమిళ వాసులే.. నర్సింగ్ హోంకు తీసుకువస్తున్న వారిలో తమిళనాడు వాసులే అధికంగా ఉన్నారని డీఎంహెచ్వో చెప్పారు. శివప్రకాశ్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులతో పాటు వైద్యురాలిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉందన్నారు. కాగా, నగరంలోని సుందరయ్య వీధిలో ఉన్న నవీన్ స్కానింగ్ సెంటర్పై కూడా అధికారులు దాడులు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసిన అధికారులు.. అక్కడ పనిచేస్తున్న చిత్తూరు ప్రభుత్వాస్పత్రి మహిళా డాక్టర్పై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన పలు ప్రైవేట్ నర్సింగ్ హోం నిర్వాహకులు.. ఆస్పత్రులు మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
ఆ బాధ్యత అత్తలదే!
ఝుంఝున్: లింగవివక్ష లేకుండా అందరూ సమానమనే భావనను సమాజం అలవర్చుకోవాలని ప్రధాని∙మోదీ పేర్కొన్నారు. బాలికల భ్రూణహత్యలు మనం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇంట్లో ఆడపిల్లలను సంరక్షించే బాధ్యతను ఆ బాలిక తల్లి, అత్తగారే తీసుకోవాలని సూచించారు. మహిళాదినోత్సవం సందర్భంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (ఎన్ఎన్ఎమ్)ను రాజస్తాన్లోని ఝుంఝున్లో మోదీ ప్రారంభించారు. ‘సమాజంలో ప్రతిఒక్కరూ సమానమే. బాలురతో సమానంగా బాలికలు నాణ్యమైన విద్యను అందుకోవాలి. బాలిక ఎప్పటికీ భారం కారాదు. ఆమె మన కుటుంబానికి గర్వకారణం. చుట్టుపక్కల చూడండి. మన కూతుళ్లు దేశప్రతిష్టను ఎలా పెంచుతున్నారో గమనించండి. కుమారులతో సమానంగా కూతుళ్లను పెంచండి’ అని అన్నారు. నవభారత నిర్మాణం కోసం మహిళల జీవితాల్లో సానుకూలమైన మార్పుతీసుకురావటం, మహిళాశక్తిని సరైన పద్ధతిలో వినియోగించుకోవటం చాలా అవసరమన్నారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని 161 జిల్లాలనుంచి దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. మనం 21వ శతాబ్దంలో ఉన్నామా? ‘తరగతి గదుల నుంచి క్రీడాప్రాంగణాల వరకు ప్రతిచోటా వారు రాణిస్తున్నారు. అందుకే నేడు బాలికలకు సమానత కల్పించే వాతావరణాన్ని సృష్టిస్తామని మనం ప్రతిజ్ఞ చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ లింగ వివక్ష చూపకూడదు. దేశంలో బాలికల భ్రూణహత్యలు జరుగుతుండటం మనం సిగ్గుపడాల్సిన, ఆందోళన చెందాల్సిన విషయం. ఈ దారుణమైన అలవాటును సమాజం నుంచి రూపుమాపేందుకు మనందరం చిత్తశుద్ధితో పనిచేయాలి. మనమింకా 18వ శతాబ్దపు ఆలోచనలతోనే ఉన్నాం. అలాంటప్పుడు 21 శతాబ్దపు పౌరులమని చెప్పుకునే హక్కు మనకెక్కడిది’ అని మోదీ పేర్కొన్నారు. బాలికలను పురిట్లోనే చంపేయటం ద్వారా ఈ తరం ఇబ్బందులు పడుతోందని.. భవిష్యత్ తరాలకోసం పెను ప్రమాదాన్ని స్వాగతిస్తున్నట్లేనన్నారు. ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్తోనే ఈ సమస్యకు పరిష్కారం దొరకదని.. బాలికలకు సరైన విద్యనందించటం, విస్తృత ప్రచారం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావటం అత్యంత అవసరమన్నారు. తక్కువకాలంలో ఈ దిశగా భారీ మార్పును సాధించలేమని ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభిస్తే సమాజంనుంచి ఈ చెడు సంప్రదాయం తొలగిపోయేందుకు ఐదారు తరాలు పడుతుందన్నారు. పౌష్టికాహార ఆవశ్యకతను, మిషన్ ఇంద్రధనుష్ (జాతీయ వ్యాధినిరోధక కార్యక్రమం) ద్వారా చిన్నారులు, మహిళల్లో వస్తున్న సానుకూల మార్పునూ మోదీ వివరిం చారు. అంతకుముందు, కలెక్టర్లతో సంభాషించిన మోదీ.. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఏపీ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్గఢ్, సిక్కిం, గుజరాత్, హరియాణా, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు. కున్వర్బాయిని గుర్తుచేసుకున్న మోదీ కొందరు మహిళలు మార్గదర్శకమైన కార్యక్రమాల ద్వారా దేశ చరిత్రలో తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారని మోదీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్కు స్ఫూర్తిగా నిలిచిన దివంగత కున్వర్బాయిను గుర్తుచేసుకున్నారు. షి ఇన్స్పైర్ మి హ్యాష్ట్యాగ్తో గురువారం ప్రధాని పలు ట్వీట్లు చేశారు. ‘ఈ ఏడాది ఆరంభంలో కన్నుమూసిన ఛత్తీస్గఢ్కు చెందిన 106 ఏళ్ల కున్వర్బాయి జీవితం స్ఫూర్తిదాయకం. ఆమెకున్న మేకలు అమ్మి తన ఇంట్లో రెండు మరుగుదొడ్లు నిర్మించారు. స్వచ్ఛభారత్లో ఆమె భాగస్వామ్యం మరువలేనిది. ఆమెనుంచి ఆశీర్వాదం తీసుకున్న రోజును ఎన్నటికీ మరవబోను’ అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement