రేషన్ బియ్యం అమ్మినా, కొన్నా చర్యలే..
కలెక్టరేట్, న్యూస్లైన్: రేషన్ బియ్యం అమ్మినా, కొన్నా తగు చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్లాల్ హెచ్చరించారు. నల్లగొం డ కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవా రం సంబంధిత అధికారులు, మిల్లర్లు, ట్రేడర్లు, చౌకధరల దుకాణ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జేసీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బి య్యం పక్కదారి పట్టించే ఎలాంటి వారినైనా ఉపేక్షించకుండా రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ కార్డుదారులు బి య్యం చౌకధర దుకాణాల నుంచి పొంది మ ద్య దళారులకు, మధ్య దళారులు మిల్లర్లకు విక్రయిస్తున్నారని వివరించారు. తిరిగి మిల్లర్లు లెవీ పెడుతూ రీసైక్లింగ్కు పాల్పడుతున్నారన్నారు.
ప్రభుత్వం కిలో రూ 24 చెల్లించి కొనుగో లు చేసి రూ 23 సబ్సిడీ ఇచ్చి కేవలం రూపాయికే కిలో బియ్యం పేదల సంక్షేమానికి అందజేస్తోం దన్నారు. మధ్య దళారుల చర్యల వల్ల బియ్యం పక్కదారి పట్టి కిలో బియ్యంతో రూ 23 సబ్సిడీ దుర్వినియోగమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లు పక్కదారి పట్టించినా, కార్డుదారుడు బయట విక్రయించినా చర్యలు తప్పవన్నారు. మిల్లర్లు, ట్రేడర్లు సబ్సిడీ బియ్యం కొనుగోలు చేసి రీసైక్లింగ్కు పాల్పడితే ఉపేక్షించబోమని, ఆహార భధ్రత కోసం, పేదల సంక్షేమానికి ప్రవేశపెట్టిన రూపాయి కిలో బియ్యం పథ కం దుర్వినియోగం చేసిన వారిపై 6(ఎ) కేసుల తోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు, విజిలెన్స్ అధికారులను జేసీ ఆదేశిం చారు. పౌర సరఫరాల నిఘా విభాగం బృందాలుగా ఏర్పడి నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.
నిత్యావసర సరుకుల చట్టం సెక్షన్ -7 ప్రకారం అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కేసులు నమోదు చేయాల ని కోరారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలని, తగు ఆధారాలు చూపించని వారి పై కేసులు నమోదు చేయాలని జేసీ సూచిం చారు. వాహనాల పర్మిట్లు కూడా పరిశీలించాల ని అధికారులకు సూచించారు. సమావేశంలో ఏఎస్పీ రమా రాజేశ్వరి, డీఎస్ఓ నాగేశ్వరరా వు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, విజిలెన్స్ డీఎస్పీ దా మోదర్, ఇన్స్పెక్టర్ మోహన్రావు పాల్గొన్నారు.
అవగాహనతోనే కల్తీని నిరోధించొచ్చు
నల్లగొండ రూరల్ : ప్రజల్లో అవగాహన ఉంటనే నిత్యావసరాల కల్తీని నిరోధించవచ్చునని జేసీ హరిజవహర్లాల్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నల్లగొండలోని డైట్లో మంగళవారం నిర్వహించిన వినియోగదారుల అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కొనే ప్రతి వస్తువుపైనా అవగాహన ఉంటనే నాణ్యత, తూకం సరిగా ఉందోలేదోనని ప్రశ్నించగలుగుతామన్నారు. తూకంలో మోసాలను అధికారులు అరికడుతారులే అని, నాణ్యతను వారే చూసుకుంటారని భావించి వదిలేస్తే ప్రతి ఒక్క వినియోగదారుడు నిత్యం మోసపోతూనే ఉం టాడని తెలిపారు.వ్యాపారులు నిజాయితీగా సంపాదించుకోవాలని, నమ్మకం ఉంటనే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని గ్రహించాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అనంతరం బహుమతులు అందజేశారు. సమావేశంలో డీఎస్ఓ నాగేశ్వర్రావు, ఆర్డీఓ జహీర్, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, శేషం, డిప్యూటీ తహసీల్దార్లు అంబటి అంజనేయులు, కె.ఆంజనేయులు, ఆర్ఐ జావేద్ ఉన్నారు.