breaking news
devadula water
-
రామప్ప కళ కళ
వెంకటాపురం : మండలంలోని రామప్ప చెరువు దేవాదుల నీటితో çకళకళలాడుతోంది. 36 అడుగుల నీటి సామర్థ్యం గల ఈ చెరువులో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు ఏ మాత్రం రాలేదు. పాకాల, లక్నవరం సరస్సులు నిండినా, రామప్పకు నీరు రాకపోవడంతో ఆయకట్టు రైతులు రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి అజ్మీర చందూలాల్ ద్వారా భారీ నీటి పారుదల శాఖ మాత్యులు హరీశ్రావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి హరీశ్రావు రామప్పలో ఉన్న దేవాదుల ఎయిర్వాల్్వలను ఓపె¯ŒS చేసి సరస్సు నిండేలా చర్యలు తీసుకోవాలని ఐబీ అధికారులను ఆదేశించారు. అదివారం దేవాదుల సిబ్బంది సరస్సులో ఉన్న ఆరు ఎయిర్వాల్్వలను ఒపె¯ŒS చేయగా, ఆ నీరంతా రామప్ప చెరువులోకి వచ్చింది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
దేవాదుల కాలువకు నీటి విడుదల
భీమదేవరపల్లి: దేవాదుల ఉత్తరకాలువకు అధికారులు ఎట్టకేలకు నీటిని విడుదల చేశారు. ఈ నెల 23న‘ పంటలు ఎండాక నీళ్లు ఇస్తారా?’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవాదుల ఉత్తర కాలువ డీఈఈ రాంమూర్తి నీటిని విడుదల చేశారు. 15 రోజుల పాటు నీటిని అందించనున్నట్లు వెల్లడించారు. ఈ నీరు ధర్మసాగర్ మండలంలోని రెండు గ్రామాల్లో గల రెండు వేల ఎకరాలకు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజురాబాద్ మండలాల్లోని 13 గ్రామాల్లోని 15వేల ఎకరాలకు అందనుంది.