breaking news
delivering
-
తాతలు ఉత్తరాలు బట్వాడా చేసేవారని..
బహ్రాయిచ్ : ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి అత్యంత విచిత్రమైన రీతిలో పొట్టపోసుకుంటున్నాడు. జిల్లాకు చెందిన సురేష్ కుమార్ గత 40 ఏళ్లుగా పోస్ట్మ్యాన్ రూపంలో ఇంటింటికీ తిరుగుతున్నాడు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ, తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ వింత పంథాను ఎంచుకున్నాడు. తన తాత, ముత్తాతల కాలం నుంచి తమ కుటుంబంలోని వారు ఉత్తరాలు బట్వాడా చేసేవారని సురేష్ కుమార్ మీడియాకు తెలిపారు. పూర్వంరోజుల్లో అతని పూర్వీకులు బ్రిటీష్ వారికి ఉత్తరాలు అందజేసేవారట. ఇప్పుడు సురేష్ పోస్ట్మ్యాన్ గెటప్తో అందరినీ పలుకరిస్తున్నాడు. దీనికి ప్రతిఫలంగా వారు ఏది ఇచ్చినా తీసుకుంటూ, దానితో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.సురేశ్ ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పోస్ట్మ్యాన్ వేషధారణతో తిరుగుతుంటాడు. ఇంటింటికీ వెళ్లి మీ పేరు మీద ఉత్తరం వచ్చిందని వారికి చెబుతుంటాడు. వారు తొలుత అతనిని పోస్ట్మ్యాన్గా భావిస్తారు. తరువాత విషయం తెలుసుకుని, ఆనందంగా తమకు తోచినంత సురేష్కు ముట్టజెపుతుంటారు.స్థానికులు అతనిని పోస్ట్మ్యాన్ అని పిలుస్తుంటారు. సురేష్ కుమార్ పోస్ట్మ్యాన్ యూనిఫాం ధరించి, తలపై టోపీ పెట్టుకుంటాడు. అలాగే కళ్లద్దాలు కూడా పెట్టుకుంటాడు. చేతిలో వైర్లెస్ వాకీ-టాకీ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలుగొందిన ఈ వృత్తిని అనుకరిస్తూ సురేష్ కుమార్ పొట్టపోసుకోవడం విశేషమే మరి.ఇది కూడా చదవండి: ఆ పేరుతో సర్టిఫికెట్ మార్చి ఇస్తాం -
మీ లంచ్ను రోబోలు తెచ్చేస్తాయి!
టెక్నాలజీ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి అవసరానికి కూడా టెక్నాలజీ వచ్చేసింది. ఆన్ లైన్లో ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి చిన్నదానికి కూడా ఇబ్బంది లేకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక రోబోలతో సరికొత్త ప్రపంచం ఆవిష్కారం కాబోతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సినిమాలో చూపించినట్లుగా.. మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి రోబో అన్ని పనులు చేయగలుగుతుంది. మాట్లాడుతుంది. పనిచేస్తుంది. డ్యాన్స్ కూడా చేస్తుంది. కోపం వస్తే కొట్టేస్తుంది. మనం ఏం చెబితే అదే చేస్తుంది. ప్రస్తుతం మనుషులు చేస్తున్న, చేయలేని దాదాపు అన్ని పనులనూ రోబోలు చేస్తున్నాయి. సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించే వరకు.. ఇలా అన్ని రంగాల్లోనూ మర మనుషులు సేవలు అందిస్తున్నాయి. తాజాగా ఫుడ్ డెలివరీ రంగంలోకి రోబోలు వచ్చేశాయి. ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫేమస్ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. వెంటనే ఓ రోబో ఆ రెస్టారెంట్కు వెళ్లింది. అక్కడున్న ఓ వెయిటర్.. సదరు వ్యక్తి ఆర్డర్ చేసిన పుడ్ను ఆ రోబోలో సర్దాడు. అంతే ఆ రోబో రోడెక్కింది. నెమ్మదిగా బయలుదేరి ఆ వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వెంటనే మీ ఫుడ్ మీ ఇంటి ముందుకు వచ్చింది అంటూ ఓ మెసేజ్ వచ్చింది. తలుపు తీసి చూస్తే ఓ బుల్లి రోబో ఇంటి ముందు వేయిట్ చేస్తోంది. స్మార్ట్ఫోన్లో ఓ బటన్ నొక్కగానే రోబో తన మూతను అన్లాక్ చేసింది. వెంటనే ఆవ్యక్తి ఫుడ్ తీసుకున్నాడు. రోబో థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. ఇదంత వినడానికి ఆశ్చర్యంగా, ఏదో సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది కదా..! కానీ ఇది నిజం. తమ విద్యార్థులకు పుడ్ డెలివరీ చేయడం కోసం బుల్లి రోబోలను ఉపయోగిస్తుంది అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం. విద్యార్థులకు ఫుడ్ సరఫరా చేయడం కోసం స్టార్షిప్ టెక్నాలజీస్ సంస్థ నుంచి 30 రోబోలను కొనుగోలు చేసింది. సమయం ఆదా.. రోబోలతో పుడ్ డెలివరీ చేయడం ద్వారా విద్యార్థులకు విలువైన సమయం ఆదా అవుతుందని యూనివర్సీటీ యాజమాన్యం చెబుతోంది. భోజనం కోసం లైన్లో నిలబడటానికి ఇష్టపడని విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ రోబోలను తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ఆదా అయిన సమయాన్ని ఇతర అంశాలపై పెట్టి వారు అనుకునేది సాధించగలరనే ఆశాభావంతో రోబోలను ప్రవేశపెట్టామని యూనివర్సీటీ యాజమాన్యం పేర్కొంది. ఎలా పనిచేస్తాయి స్టార్షిప్ యాప్ ద్వారా కావాల్సిన రెస్టారెంట్లో ఫుడ్ను ఆర్డర్ చేయాలి. డబ్బులు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి. తర్వాత స్టార్షిప్ టెక్నాలజీస్ నుంచి ఆరుచక్రాల ఓ రోబో ఆ రెస్టారెంట్కు వెళ్తుంది. అక్కడ ఉన్న వెయిటర్.. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ను రోబోలో సర్దుతారు. వెంటనే ఆ రోబో రోడెక్కి మన దగ్గరకు వస్తుంది. మన ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు. బుల్లి రోబో మనవద్దకు రాగానే స్మార్ట్ఫోన్ ద్వారా ఓపెన్ బటన్ నొక్కాలి. వేంటనే రోబో మూత తెరచుకుంటుంది. పుడ్ను తీసుకోగానే అన్లాక్ అవుతుంది. అనంతరం రోబో అక్కడి నుంచి వెనుదిరుగుతుంది. బర్గర్, కాఫీ.. ఏదైనా.. స్టార్షిప్ సంస్థ వారి యాప్ ద్వారా బర్గర్, కాఫీ, టీ ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకే సమయంలో మూడు రకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆరు కాళ్లు ఉండే ఈ రోబోలు ఆ వస్తువులు ఎక్కడ డెలివరీ ఇవ్వాలో వారి ఇంటి ముందుకు వెళ్లి ఇచ్చేలా వీటిని రూపొందించారు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఈ రోబోలు మెట్లు ఎక్కగలవు, ఎత్తైన ప్రదేశాల నుంచి వెళ్లగలవు. రోడ్డుపై వాహనాలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలవు. ప్రతి రోబోలో తొమ్మిది కెమెరాలు అమర్చారు. 100 యూనివర్సీటీలు లక్ష్యం స్టార్షిఫ్ రోబోలు ఇప్పటి వరకు నాలుగు యూనివర్సీటీలలో ఉపయోగిస్తున్నారు. మొదటగా జార్జ్ మాసన్ యూనివర్సీటీలో, తర్వాత నార్తర్న్ అరిజోనా, పర్డ్యూ, విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయాల్లో వినియోగించారు. రానున్న రెండేళ్లల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100 యూనివర్సీటీలకు తమ రోబోలను అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్టార్షిప్ టెక్నాలజీస్ సంస్థ పేర్కొంది. కొద్ది రోజుల్లో ఈ బుల్లి రోబోలను అన్ని నగరాల్లోనూ చూడగలుగుతామేమో! -
నా తండ్రే పెద్ద విమర్శకుడు..!
ముంబైః బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలపై విమర్శకుల గురించి అడిగిన ప్రశ్నకు భిన్నంగా స్పందించాడు. ప్రేక్షలకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందిస్తున్న సూపర్ స్టార్.. తాజా సినిమా సుల్తాన్ కూడ సునామీ సృష్టిస్తున్న తరుణంలో తన తండ్రే తనకు పెద్ద విమర్శకుడని చెప్పుకొచ్చారు. మీ దృష్టిలో ఎవరు మంచి విమర్శకులు అని అడిగిన ప్రశ్నకు సల్మాన్ కొత్తగా స్పందించారు. ప్రతి సినిమా విషయంలోనూ తనకు తన తండ్రే పెద్ద విమర్శకుడని తెలిపాడు. ముందుగా ఆయన స్పందనే నాకు ముఖ్యమని, ప్రతి సినిమా చూసి వచ్చిన తర్వాత మా త్రండ్రి సలీం ఖాన్... తన అభిప్రాయాన్ని ఎంతో సున్నితంగా చెప్తుంటారని తెలిపాడు. ఆయనకు నచ్చితే ఆ సినిమా విషయం ఇక మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చని చెప్తుంటారని, నచ్చకపోయినప్పుడు కూడా ఆ విషయం మర్చపోయి మరో సినిమాకు ఇంకొంచెం ఎక్కువ కష్టపడమని సూచిస్తుంటారని సల్మాన్ వివరించాడు. అయితే మీకోసం ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాస్తుంటారా అన్న ప్రశ్నకు మాత్రం... ఆయన ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాయకపోయినా, అద్భుతమైన వ్యాసాలు రాస్తుంటారని, ప్రస్తుతం ట్వీట్లు కూడా చేస్తున్నారని అన్నాడు. నేను ఎన్నో ఏళ్ళుగా సినిమాలపై అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నానని, ఒక చిత్రంలో చేసినట్లు మరోదాంట్లో చేయనని, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగనివ్వనని ఈ సందర్భంలో తెలిపాడు.