'కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కుదరదు'
విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కుదరదని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పువల్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ సాధ్యం కాదని భావిస్తున్నామని అన్నారు. 26 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని కోరుతున్న నేపథ్యంలో ఉద్యోగుల జీతాల పెంపును పరిశీలిస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.