-
తెలంగాణలో కోవిడ్ మృతులెందరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. మంగళవారం (18న) రాత్రి వరకు కరోనా వైరస్ సోకి చనిపోయినవారు 4,062 మంది మాత్రమే. కానీ సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12 వేల మందికి పైగా కరోనా బాధిత కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించింది. ఇంకా పెద్దసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పొంతనలేని లెక్కలు చర్చనీయాంశమయ్యాయి కేంద్ర సాయం కోసం..: కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించా లని గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాటిని జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీల ద్వారా పరిశీలించి అర్హమైన దరఖాస్తులను ఎంపికచేసి, పరిహారమిస్తున్నారు. పరిహారం కోసం ఇప్పటివరకు 28,969 దరఖాస్తులు రాగా.. అందులో 15,270 ఆమోదం పొందాయని, 12,148 మం దికి పరిహారం అందించామని ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్లలో వెల్లడిస్తున్న కరోనా మృతుల లెక్కల కంటే.. దరఖాస్తుల సంఖ్య ఏడెనిమిది రెట్లు ఎక్కువున్నాయి. కరోనా మృతుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించిన క్రమంలోనే ఎక్కువ దరఖాస్తుల ను ఆమోదిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
విమానం రద్దు.. ఎయిర్లైన్స్కు జరిమానా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడం, మానసిక వేదనకు, ఇబ్బందులకు గురి చేయటం వంటి కారణాలతో... ఎమిరేట్స్ విమానాయాన సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల వివాదాల పరిష్కారాల ఫోరం రూ.2 లక్షల జరిమానా విధించింది. రద్దు చేసిన విమాన టికెట్ చార్జీలు, వడ్డీతో సహా తిరిగి కస్టమర్కు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన వినయ్ కుమార్ సిన్హా (57), కృష్ణ సిన్హా (55) దంపతులు టికెట్లు బుక్ చేసి... 2017 జులై 12న డెట్రాయిట్లోని బంధు వులను కలిసేందుకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. బోస్టన్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లినా... బోస్టన్ నుంచి డెట్రాయిట్కు వెళ్లాల్సిన విమానం ఆకస్మికంగా రద్దయింది. నిర్ధారిత సమయంలో డెట్రాయిట్కు చేరుకోవటంలో విఫలమైనందుకు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేసినందుకు వీరిద్దరూ కన్జ్యూమర్ ఫోరాన్ని ఆశ్రయించారు. దీంతో తాజా తీర్పు వెలువడింది. -
లెక్చరర్ పోస్టుల భర్తీ కష్టమే!
⇒ కాంట్రాక్టు వ్యవహారం తేలే వరకూ అంతే ⇒ పదుల సంఖ్యలోనే ⇒ డెరైక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ⇒ రేషనలైజేషన్ తరువాతే ⇒ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారం తేలేవరకు లెక్చరర్ పోస్టులు, హేతుబద్ధీకరణ పూర్తయ్యే వరకు ఉపాధ్యాయపోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావడం కష్టమే. వచ్చేనెల నుంచి నోటిఫికేషన్లు జారీచేసి, భర్తీ చేయాలనుకుంటున్న పోస్టుల్లో జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్), పాలిటెక్నిక్ లెక్చరర్, విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశం లేదు. గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల విద్యాలయాల పరిధిలోని పాఠశాలల్లో మాత్రం దాదాపు 2 వేల వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. హేతుబద్ధీకరణతో లంకె విద్యాశాఖ పరిధిలో 17 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గతంలోనే విదాశాఖ లెక్కలు వేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేరు.. విద్యార్థులు ఉన్నచోట టీచర్లు లేరు. ఈ నేపథ్యంలో టీచర్ల హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది. అది పూర్తయితేనే ఇంకా ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు అవసరం.. ఎన్నింటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలన్న స్పష్టత రానుంది. అప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ కష్టమేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాళీలేవీ..? జూనియర్ కాలేజీల్లో 3,755 జేఎల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3,164 పోస్టుల్లో కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తుండగా, 591 ఖాళీలు ఉన్నాయి. 200 మంది పార్టటైం లెక్చరర్లు పనిచేస్తున్నారు. దీంతో 391 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నట్లు లెక్క. నిబంధనల ప్రకారం మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులను పదోన్నతులపైనే భర్తీ చేయాలి. అంటే మొత్తం ఖాళీల్లో 10 శాతం పోస్టులైన 375 ఖాళీలను డెరైక్టు రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి వీల్లేదు. మరోవైపు పోస్టులే మంజూరుకాని కాలేజీల్లో 748 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అంటే ఇందులో మిగిలేవి పెద్దగా ఉండవు. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలే జీల్లో.. డిగ్రీ కాలేజీల్లో 450 వరకు డీఎల్ పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 900 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తున్నారు. అందులో సగం మంది పోస్టులు మంజూరై ఖాళీగా ఉన్న వాటిల్లో పనిచేస్తుండగా మరో సగం మంది పోస్టులు మంజూరు కాని కాలేజీల్లో పనిచేస్తున్నారు. ఇక పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీలు 350 పోస్టులు ఉంటే కాం ట్రాక్టు లెక్చరర్లు 450 మంది ఉన్నారు. అంటే కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో డీఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం అసాధ్యమన్న వాదన నెలకొంది. -
'కరువు రెతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం'
అనంతపురం: కరువు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఒక్క అనంతపురం జిల్లాకే రూ.1400 కోట్లు కావాలని కలెక్టర్ కోరితే.. రాష్ట్రవ్యాప్తంగా రూ.1500 కోట్లు చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివేధిక ఇవ్వడం దుర్మార్గమన్నారు. అనంత కరువు సహాయచర్యలకు వెంటనే రూ. 2 వేలకోట్లు విడుదల చేయాలని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. -
ఎన్నాళ్లకిస్తారో పరిహారం!
పరిగి, న్యూస్లైన్ : కూరగాయలు సాగుచేసే రైతులను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం మాటలు వట్టివేనని తేలుతోంది. ఒక్కసారి పంట నష్టపోయిన రైతులు.. మళ్లీ సాగుకు సమాయత్తమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టపోతున్న కూరగాయల రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నష్టం వివరాలను రాసుకుని వెళ్తున్నారే తప్ప.. పైసా పరిహారం చెల్లించడం లేదు. వరితోపాటు ఇతర పంటల కు ఆరు నెలలు అటూఇటుగా పరిహారం అందజేస్తున్న అధికారులు కూరగాయల రైతుల విషయం లో వివక్ష చూపుతున్నారు. 2009లో పంటలు నష్టపోయిన రైతుల వివరాలను పంపామని, పరిహారం విడుదలైందని అధికారులు చెబుతున్నా అది ఇంతవరకు రైతులకు చేరలేదు. గత నాలుగేళ్లుగా అకాల వర్షాలు, వడగళ్ల కారణంగా కూరగాయలు, పండ్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2010, 2011, 2012,13 సంవత్సరాల్లోనూ జిల్లాలో రైతులు భారీగా నష్టపోయారు. వీరంతా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. గత వేసవి సీజన్లో కురిసిన వడగళ్ల వానకు జిల్లాలో మూడు వేల పైచిలుకు ఎకరాల్లో కూరగాయల పంటలు నష్టపోయినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కానీ పరిహారం ఊసు మాత్రం ఇంతవరకు లేదు. ఇదేనా ప్రోత్సాహం.. జిల్లాను కూరగాయల జోన్గా మారుస్తామని, కూరగాయల సాగును ప్రోత్సహిస్తామని, నిల్వ కోసం శీతల గిడ్డంగులు నిర్మిస్తామని, మార్కెట్ సౌకర్యం కూడా కల్పిస్తామని అధికారులు నాలుగైదు ఏళ్లగా ఊదరగొడుతున్నారు. కానీ చేసింది మాత్రం ఏమీ లేదు. పరిహారం అందిస్తేచాలని, సౌకర్యాలు తర్వాత అని రైతులు అంటున్నారు. 2009లో నాలుగు వేల ఎకరాల్లో పంటలు నష్టపోగా వాటికి సంబంధించి జిల్లాకు రూ.నాలుగు కోట్ల పరిహారం మంజూరైనట్టు అధికారులు చెబుతున్నారని, అది ఇంతవరకు తమ ఖాతాల్లో పడలేదని రైతులు చెబుతున్నారు. 2010, 2011 సంవత్సరాల్లో మూడు వేల ఎకరాల చొప్పున, 2012,13లలో అదే స్థాయిలో రైతులు నష్టపోయారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పండ్ల తోటల నష్టం.. నివేదికలే లేవు జిల్లాలో పండ్ల తోటల నష్టం వివరాలను సేకరించడంలో అధికారులు విఫలమయ్యారు. తెగుళ్లు సోకి నష్టం వాటిల్లితే దానికి పరిహారం ఇవ్వడం వీలుకాదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 వేలకుపైగా ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తుండగా అందులో ఆరు వేల పైచిలుకు ఎకరాలు పరిగి నియోజకవర్గంలోనే ఉన్నాయి. రెండేళ్లుగా పండ్ల తోటలకు తెగుళ్లు సోకి సుమారు నాలుగు వేల ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయని, జిల్లా వ్యాప్తంగా రైతు లు కోట్లాది రూపాయలు నష్టపోయారని తెలుస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
నాకు ఓటు వేస్తే మోదీకి వేసినట్టే..
జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు
దేశంలోనే అత్యధిక మెజారిటీ..
● హైలైట్స్..
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
చింతపండు బస్తాల మధ్య గంజాయి రవాణా..
చికిత్స పొందుతున్న సీపీఎం నాయకుడు మృతి
బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రమాదంలో రాజ్యాంగం
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement