breaking news
Civil Supplies warehouse
-
బియ్యం లోటు.. చక్కెర మిగులు
- విజిలెన్స్ దాడులతో వెలుగులోకి అక్రమాలు - పౌరసరఫరాల గిడ్డంగిలో అవక తవకలు - అస్తవ్యస్తంగా రికార్డులు మల్యాల : మండల కేంద్రంలోని పౌరసరఫరాల గిడ్డంగిలో బుధవారం నాటి విజిలెన్స్ దాడిలో ఎన్నో అక్రమాలు వెలుగుచూశారుు. రెండు క్వింటాళ్ల బియ్యం లోటు ఉండగా.. రెండు క్వింటాళ్ల చక్కెలు మిగులు ఉంది. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గిడ్డంగి నిర్వహణపై విజిలెన్స్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ డీఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో మల్యాలలోని పౌరసరఫరాల గిడ్డంగిలో బుధవారం మూడు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. సరుకు నిల్వ, సరఫరాలకు సంబంధించిన రికార్డుల్లో తేడా ఉండడంపై ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నుంచే సరుకుల తూకంలో తేడా వస్తుండడంతోనే నిల్వలలో తేడాలున్నాయనగా.. వెంటనే హమాలీలతో బస్తాలను తూకం వేరుుంచగా వ్యత్యాసం తేలకపోవడం గమనార్హం. రికార్డులు అస్తవ్యస్తం రికార్డుల ప్రకారం సరుకు నిల్వలలో తేడాల రావడంపై నిలదీశారు. గోడౌన్ ఇన్చార్జికి బదులు కాంట్రాక్టు క్లర్క్ సమాధానం చెప్పడం గమనార్హం. రికార్డులోని నిల్వకు వాస్తవానికి బియ్యంలో 2 క్వింటాళ్ల వ్యత్యాసం రాగా.. చక్కెర రెండు క్వింటాళ్ల అదనంగా ఉండడంపై ప్రశ్నించారు. గోధుమలు, ఉప్పు నిల్వల్లోనూ తేడాలు వచ్చారుు. సరుకుల నిల్వల్లో వ్యత్యాసంపై జేసీకి నివేదిక అందజేయనున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ బాలస్వామి తెలిపారు. గోడౌన్పై పర్యవేక్షణ కరువు గోడౌన్లోని సరుకుల నిల్వ, సరఫరాపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నారుు. అంతేకాకుండా గోడౌన్కు వచ్చిన సరుకులను నేరుగా రేషన్ దుకాణాలకు తరలిస్తున్నారనే మరో విమర్శ ఉంది. వాహనాల వెంబడి రూట్ ఆఫీసర్స్ వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. ప్రైవేట్ వ్యక్తిదే హవా గిడ్డంగి నిర్వహణ వివరాలు, రికార్డులన్నీ ప్రైవేట్ వ్యక్తి చేతిలోనే ఉండడంపై అనుమానాలకు తావిస్తోంది. డీలర్లు, అధికారులు, సరుకుల నిల్వలకు సంబంధించిన ప్రతి అంశం ప్రైవేట్ ఉద్యోగినే అడగడం ఆనవాయితీగా మారింది. ఇటు అధికారులు, హమాలీలు, అటు డీలర్లు సైతం ఏ విషయమైనా ప్రైవేట్ వ్యక్తితోనే చర్చించడం గమనార్హం. బుధవారం విజిలెన్స్ అధికారుల విచారణలోనూ ప్రైవేట్ వ్యక్తియే అన్ని సమాధానాలు చెప్పడం గమనార్హం. -
శనగల పైసలు ఇంకెప్పుడిస్తరు?
తాండూరు, న్యూస్లైన్: శనగ రైతులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పండించిన పంట అమ్ముకున్నా చేతికి డబ్బులు అందక అవస్థలు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంధువుల ఇంట్లో శుభకార్యాలకు వెళ్లడానికి చేతిలో చిల్లిగవ్వ లేక నానాపాట్లు పడాల్సిన పరిస్థితి నెలకొందని కొందరు రైతులు వాపోతున్నారు. ఇంటి అవసరాలు తీర్చుకోవడంలో ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ఉదాసీన వైఖరితో రైతులకు సకాలంలో డబ్బులు అందని పరిస్థితి. ఈ విషయంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) నిర్లక్ష్య ధోరణి రైతులకు డబ్బుల చెల్లింపులో ఆలస్యానికి కారణమవుతోంది. కందుల కొనుగోలు విషయంలోనూ అధికారులు రైతులకు డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేశారు. అలాగే శనగ రైతులకూ సకాలంలో చెల్లింపులు చేయకపోవడం సంబంధిత అధికారుల తీరు విమర్శలకు దారిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పంట దిగుబడులు విక్రయిస్తే తొందరగా డబ్బులు వస్తాయని నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతున్నట్టు స్పష్టమవుతోంది. వివరాలు.. ఈ ఏడాది మార్చి 3న మార్క్ఫెడ్ డీసీఎంఎస్ ద్వారా రైతుల నుంచి శనగల సేకరణకు పట్టణంలోని పౌర సరఫరాల గోదాం (ఎడ్లబజార్)లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 25 వరకు వివిధ గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు శనగలను సేకరించారు. శనగలు సేకరించిన వారం పది రోజులకే రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. కానీ ఈ విషయంలో మార్క్ఫెడ్ జాప్యం చేయడంతో రైతులకు డబ్బులందక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 121 మంది రైతుల నుంచి క్వింటాలుకు రూ.3,100 చొప్పున రూ.1,20,51,250 విలువ చేసే 3,887.50 క్వింటాళ్ల శనగలను రైతుల నుంచి డీసీఎంఎస్ అధికారులు సేకరించారు. ఇందులో ఇప్పటి వరకు మార్క్ఫెడ్ రూ.54లక్షలు మాత్రమే విడుదల చేసింది. ఈ డబ్బులు 43 మంది రైతులకు చెల్లింపులు చేశారు. ఇంకా వివిధ గ్రామాలకు చెందిన 78మంది రైతులకు రూ.66,51,250 చెల్లించాల్సి ఉంది. డబ్బుల కోసం ఆయా గ్రామాల రైతులు డీసీఎంఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మార్క్ఫెడ్ నుంచి రాగానే చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో వివిధ గ్రామాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి డబ్బులు త్వరగా అందేలా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. రైతుల నుంచి సేకరించిన శనగలను కొనుగోలు కేంద్రం నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)కి తరలిస్తున్నారు. త్వరలోనే చెల్లిస్తాం: షరీఫ్, డీసీఎంఎస్ మేనేజర్ మార్క్ఫెడ్ నుంచి డబ్బులు రావాల్సి ఉంది. డబ్బులు వచ్చిన వెంటనే రైతులకు చెల్లింపులు చేస్తాం. విషయాన్ని మార్క్ఫెడ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఇప్పటికి రూ.54లక్షల వరకు రైతులకు చెల్లించాం. మిగిలిన రైతులకూ త్వరగా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం.