Child hospital
-
నా చెప్పులెక్కడ..?
జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాతా శిశు ఆస్పత్రి నిర్వహణ విమర్శల పాలవుతోంది. చిన్నారుల తారుమారు, బెడ్స్ కేటాయించకుండా రోగులను నేలపై పడుకో బెట్టడం, ఓ రోగిని ఆస్పత్రి నుంచి బయటకు పంపడం, ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేటుకు తరలించడం లాంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాతా శిశు ఆస్పత్రి సిబ్బంది.. రోగులను తరలించే స్ట్రెచర్పై చెప్పులు తరలిస్తూ మరో వివాదంలో చిక్కుకున్నారు. జగిత్యాల మాతాశిశు ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు చెప్పులు విప్పేందుకు సరైన షూ ర్యాక్స్, సెల్ఫులు, సరైన స్థలం కేటాయించలేదు. దీంతో రోగులు, వారి సహాయకులు, బంధువులు తమకు తోచిన చోట పాదరక్షలు విడిచి లోనికి వెళ్తున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది వారి చెప్పులను స్ట్రెచర్పై తరలించి ఆస్పత్రి ఆవరణలో కుప్పలుగా పోస్తున్నారు. రోగులను పరామర్శించి వచ్చేసరికి చెప్పులు కనబడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో పోసిన చెప్పులను కుక్కలు కొరికేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కాగా, రోగులను తరలించేందుకు వినియోగించే స్ట్రెచర్ను చెప్పులు తరలించేందుకు వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నేరం ఎవరిది?
విజయనగరం ఫోర్ట్: స్థానిక రైల్వేస్టేషన్కు ఎదురుగా ఉన్న మురు గు కాలువలో శుక్రవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఓ మగశిశువు ఏడుపు వినిపిం చడంతో అటుగా టీ తాగడానికి వెళ్లిన రైల్వే కలాసీ రెడ్డి సత్యనారాయణ చూసి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని శిశువును చికిత్స నిమిత్తం ఘోషాఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. ఘోషాఆస్పత్రి వైద్యులు శిశువుకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన బాలల సంరక్షణ ప్రతినిధులు శిశువు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చైల్డ్లైన్, శిశుగృహ, బాలల సంరక్షణ విభాగం, బాలల సంక్షేమ కమిటీ ప్రతినిధులు ఆస్పత్రికి చేరుకుని శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆస్పత్రి వద్దే ఉండి శిశువు వైద్యానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కన్న మమకారంతో ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ ఏతల్లికన్నబిడ్డో, ఎంత కష్టం వచ్చిందో అని ఆస్పత్రి సిబ్బంది అనుకుంటున్న సమయంలో ఓమహిళ వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది తనబిడ్డేనని, బిడ్డను ఇచ్చేయాలని కోరింది. తనది విజయనగరంలోని బొగ్గులదిబ్బ ప్రాంతమని, పేరు యడ్ల అచ్చియ్యమ్మ అని చెప్పింది. గురువారం రాత్రి ఇంటి వద్దే ప్రసవించానని తెలిపింది. తనకు ఇదివరలో ఒక పాప ఉందని, భర్తకు పిల్లలు ఇష్టం లేకపోవడంతో శిశువును మురుగు కాలువ వద్ద పడేశానని చెప్పిందని శిశు గృహ మేనేజర్ చలం తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ తరువాత శిశువు అప్పగింత శిశువు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత పూర్తిస్థాయిలో విచారించి ఆమె బిడ్డ అని నిర్ధారణ అయితే శిశువును అప్పగిస్తామని బా లల సంక్షేమ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు.