Chikkadapally police station
-
ఇంట్లో తమ్ముడి దొంగతనం.. అన్న పెళ్లితో బయటపడింది
సాక్షి,హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. తన సొంత కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారని కట్టుకథ అల్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 12 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు భాస్కర్ ప్రమోద్ ముల (32 ఏళ్లు) బీటెక్ పూర్తి చేశాడు. చిక్కడపల్లిలో నివసిస్తున్నాడు. అయితే, భాస్కర్ ప్రమోద్ 2014లో బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కానీ మధ్యలోనే చదువులు మానేసి తిరిగి వచ్చాడు. బెంగళూరులో ఉన్న సమయంలో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ద్వారా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి 2024 నుండి తన నానమ్మ, కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ. 4,60,000 నగదు పొందాడు.ఇటీవల నిందితుడి అన్నయ్య పెళ్లి ఖాయం కావడంతో, కుటుంబ సభ్యులు నానమ్మ బంగారాన్ని పెళ్లి కోసం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో భయాందోళనకు గురైన భాస్కర్, తన దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఒక పథకం వేశాడు.ఈ ఫిబ్రవరి 9న తన పెంట్ హౌస్లో దొంగతనం జరిగినట్లుగా సీన్ క్రియేట్ చేసి, గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఎత్తుకెళ్లారని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. భాస్కర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూ చేపట్టారు.ఈ దర్యాప్తులో ఫిర్యాదుదారుడే అసలు నిందితుడని తేల్చారు. విచారణలో నిందితుడు కొన్ని వెండి వస్తువులను మూసీ నాలాలో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తులో రెండు బంగారు ఉంగరాలు (సుమారు 3 తులాలు), ఒక వెండి ప్లేటు, రెండు వెండి గిన్నెలు, అలాగే హెచ్డీఎఫ్సీ,ఎస్బీఐ ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టిన 80 గ్రాముల బంగారం మార్టిగేజ్ స్లిప్పులు ఉన్నాయి. మొత్తం విలువ సుమారు రూ. 12 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన సొంత కుటుంబాన్ని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన నిందితుడు చివరికి తనే ఇరుక్కున్నాడు. నేరం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, నిజం బయటపడకుండా దాచడం అసాధ్యం అనేది ఈ కేసు నిరూపించింది. ఈ కేసును ఛేదించడంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ ఐపీఎస్ రక్షితా కృష్ణమూర్తి , అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య మార్గదర్శకత్వంలో చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ ఎం. మల్లేశం, ఎస్ఐ మొహమ్మద్ కరీమ్ క్రైమ్ స్టాఫ్ చాకచక్యంగా వ్యవహరించారు. -
చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడిపల్లి పోలీస్స్టేషన్కు అల్లు అర్జున్ (Allu Arjun) వెళ్లారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు (Nampally Court) ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, పలు షరతులు బన్నీకి న్యాయస్థానం విధించింది. అందులో భాగంగానే నేడు ఆయన పోలీస్స్టేషన్కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే నాంపల్లి కోర్టులో పూచీకత్తు పత్రాలను అల్లు అర్జున్ వ్యక్తిగతంగా వెళ్లి సమర్పించిన విషయం తెలిసిందే.అల్లు అర్జున్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలో రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల (Chikkadpally Police Station) ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని బన్నీకి కోర్టు షరతు విధించింది. ఈమేరకే ఆయన అక్కడికి వెళ్లి సంతకం చేశారు. -
సంధ్య థియేటర్ ఘటన.. మరో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
సంధ్యా థియేటర్ ఘటన కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థను కూడా చేర్చారు. ఈ కేసులో ఏ18గా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పేరును పోలీసులు ప్రస్తావించారు. ఆ రోజు ఏం జరిగిందంటే..ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్కు రాగా.. పెద్దఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. -
అల్లు అర్జున్ని పోలీసులు అడిగే ప్రశ్నలివే!
సంధ్య థియేటర్ దగ్గర మహిళ మృతి చెందిన కేసులో ఇదివరకే హీరో అల్లు అర్జున్ని (Allu Arjun) అరెస్ట్ చేయగా.. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ని న్యాయస్థానం మంజూరు చేసింది. అయితే విచారణ కోసం మరోసారి రావాలని చెప్పి చిక్కడపల్లి పోలీసులు బన్నీకి నోటీసులు జారీ చేశారు. దీంతో బన్నీ ఇప్పుడు తన లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. ఇందులో భాగంగా పోలీసులు అడిగే ప్రశ్నలు ఇవేనని తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రశ్నలేంటంటే?(ఇదీ చదవండి: సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్)అల్లు అర్జున్ని పోలీసులు అడగబోయే ప్రశ్నలుబెనిఫిట్ షోకు.. మూవీ టీమ్ రావొద్దని పోలీసులు, యాజమాన్యానికి చెప్పిందా లేదా?పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీమ్ థియేటర్కి రావొద్దనే విషయం మీకు తెలియదా?పోలీసుల అనుమతి లేకుండా మీరు సంధ్య థియేటర్కి ఎందుకొచ్చారు?గతంలో సినిమా చూసేందుకు ఎన్నిసార్లు సంధ్య థియేటర్కి వచ్చారు?మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు?సినిమాకు ఫ్యామిలీతో పాటు భద్రతగా ఎంతమంది వచ్చారు? వివరాలేంటి?మీరు థియేటర్ కి రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. దీనికి మీ సమాధానం?చేతులు ఊపుతూ ర్యాలీగా థియేటర్లోకి ఎందుకు ప్రవేశించారు.తొక్కిసలాట జరిగినా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు?పోలీసులు మీకు చెప్పినా సంధ్య థియేటర్ నుంచి రావడానికి ఎందుకు నిరాకరించారు?పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం?రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా? ఎలాంటి భరోసా ఇచ్చారు?(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?) -
ముగిసిన అల్లు అర్జున్ విచారణ
చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. అయితే పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు బన్నీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం బన్నీ తన కారులోనే ఇంటికి వెళ్లారు. ఆయన వెంట తండ్రి అల్లు అర్జున్ కూడా ఉన్నారు. కాగా, సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో ఇదివరకే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకొచ్చిన బన్నీ.. మరోసారి విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తన లాయర్లతో భేటీ అయిన అల్లు అర్జున్.. వాళ్లతో కలిసి ఈ రోజు (డిసెంబర్ 24) ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్కు రానున్నాడు.విచారణలో భాగంగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి జరిగిన విషయాల గురించి పోలీసులు మాట్లాడుతారు. అలానే అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని తెలుస్తోంది. ఇది విచారణ కాబట్టి మధ్యాహ్నానికి తిరిగి బన్నీ ఇంటికి వెళ్లిపోతాడు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)అసలేం జరిగింది?'పుష్ప 2' (Pushpa 2) మూవీ బెన్ఫిట్ షో చూసేందుకు అల్లు అర్జున్.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కి (Sandhya Theatre) వెళ్లాడు. కానీ అక్కడ అభిమానుల మధ్య తోపులాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండగా, ఆస్పత్రిలో చేర్చారు. రేవతి భర్త ఫిర్యాదుతో తొలుత థియేటర్ ఓనర్, మేనేజర్, సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఒకటి రెండు రోజుల తర్వాత అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఆ రాత్రికే బెయిల్ వచ్చింది. నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరైంది. కానీ బన్నీని జైలు నుంచి ఉదయం రిలీజ్ చేశారు.జైలు నుంచి విడుదలై ఇంటికెళ్లిన తర్వాత సినీ ప్రముఖులు చాలామంది అల్లు అర్జున్ని పరామర్శించారు. తాజాగా ఆ విషయంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిప్పులు చెరిగారు. ఆస్పత్రిలో ఉన్న పిల్లాడిని ఒక్కరు కూడా పరామర్శించలేదని, బన్నీని మాత్రం కలిశారని అన్నారు. తప్పంతా బన్నీదే అన్నట్లు రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీంతో అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్.. తానేం తప్పు చేయలేదని, ప్రమాదం వల్ల మహిళా చనిపోయిందని అన్నాడు. ఇప్పుడు పోలీసులు.. మరోసారి బన్నీని విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?) -
పనిచేసే ఇంటికే కన్నం; 26లక్షలు చోరీ
చిక్కడపల్లి (హైదరాబాద్సిటీ) : ఇంట్లో పని చేసే ఓ మహిళ ఇంటికి కన్నెం వేసిన సంఘటన చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితురాలును అరెస్టు చేసి ఆమె నుంచి 26 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ఎన్ రాజు, డిఐ పి. బల్వంతయ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. దోమలగూడ డివిజన్ గగన్మహల్లో నివసించే రిటైర్డ్ వృద్ధ దంపతులు శారదాదేవి, రాజు ఇంట్లో దోమలగూడలోని నర్సింగ్ హోం వద్ద నివసించే మమత (19) గత మూడు నెలలుగా నమ్మకంగా పని చేస్తుంది. ఇంట్లోని బీరువాలో గల 25.78 లక్షలు విలువ చేసే నగలు, 22 వేల నగదు అపహరణకు గురైనట్లు గ్రహించి ఈ నెల 2వ తేదీన చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 27వ తేదీన పని మానేసిన పని మనిషి మమతపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మమతను పోలీసులు ఆరా తీయగా యజమానులు పక్కరూంకు వెళ్లినప్పుడు బీరువాలోని సొత్తు దొంగిలించినట్లు ఒప్పుకుంది. మమతను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.


