breaking news
chalo velagapudi
-
'సీఎంల్లో ఉత్తమ అవకాశవాది చంద్రబాబే'
విజయవాడ: దేశ ముఖ్యమంత్రుల్లో ఉత్తమ అవకాశవాది అవార్డుకు ఏపీ సీఎం చంద్రబాబే అర్హుడని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆయన బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ధ్వజమెత్తారు. 'చలో వెలగపూడి-ప్రశ్నిద్దాం రండి' పేరుతో గురువారం ప్రజాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని రఘువీరా కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు సర్కస్ కంపెనీని తలపిస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సీఎం చంద్రబాబులు రోజుకోమాట, పూటకో ఉత్తర్వులిస్తున్నారన్నారు. మోదీ పిచ్చి తుగ్లక్ పాలనలో చంద్రబాబు ప్రధాన భాగస్వామి అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సర్కస్ కంపెనీ పెట్టుకుంటే మంచిదని సూచించారు. నోట్ల రద్దుపై బాబు యూ టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. హోదా విషయంలో కూడా బాబు ఇదే తీరును ప్రదర్శించారన్నారు. మంగళవారం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో ఎవరూ తన మాట వినడంలేదని బాబు చెప్పినట్లు వార్తలు వచ్చాయన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ విధంగా చెబితే రాష్ట్రంలో పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. బాబు రెండున్నర ఏళ్ల పాలనలో పూర్తిగా అవినీతిమైందన్నారు. చంద్రబాబు, లోకేశ్ల అవినీతి పాలన వల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బాబు మాట వినడం లేదన్నారు. -
ఈ నెల 23న ఛలో వెలగపూడి
-
శేఖర్రెడ్డి.. చంద్రబాబు బినామి: ఏపీసీసీ చీఫ్ రఘువీరా
విజయవాడ: అక్రమ ఆస్తుల వ్యవహారంలో పట్టుబడిన టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి... ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు బినామీ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చెన్నైలో చంద్రబాబుకు చాలా మంది ఆప్తులు ఉన్నప్పటికీ వారిని కాదని బినామీ కాబట్టే శేఖర్ రెడ్డికి టీటీడీ పదవి ఇచ్చారని అన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల కష్టాలకు నిరసనగా ‘ప్రశ్నిద్దాం రండి’ పేరుతో తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 23న చలో వెలగపూడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు రఘువీరారెడ్డి తెలిపారు. తాత్కాలిక సచివాలయానికి సమీపంలో ఈ నిరసన కార్యక్రమం ఉంటుందని, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సామాన్యుల ఇళ్లలో డబ్బులు లేక పెళ్లిళ్లు వాయిదా పడుతుంటే, మరోపక్క బీజేపీ నాయకుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల కోసం ప్రజలు రోడ్లపై నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు. పాత పెద్ద నోట్ల రద్దు తన వలనే అని చెప్పుకుంటున్న చంద్రబాబు 2 వేల రూపాయల నోట్లు రద్దు చేయాలని ఎందుకు కేంద్రానికి లేఖ రాయలేదని రఘువీరారెడ్డి ప్రశ్నించారు.