breaking news
budget 2017-18
-
ఇంటిపై రుణాలుంటే...పన్ను భారం పెరుగుతుంది!
ఈ సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో... ఇంటి ఆదాయంలో ఏర్పడ్డ నష్టానికి సర్దుబాటు విషయంలో ఆంక్షలు విధించారు. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఇంటి మీద నష్టాన్ని పూర్తిగా సర్దుబాటు చేయరు. రూ.2,00,000 దాటినా సరే... రూ.2,00,000 వరకే సర్దుబాటు చేసి మిగిలిన మొత్తాన్ని తర్వాతి సంవత్సరానికి బదిలీ చేస్తారు. ఇలా చేయడం వలన 2017–18 పన్ను భారం పెరుగుతుంది. అదెలాగో ఒక ఉదాహరణ రూపంలో చూద్దాం.. 31.3.2018కి సంబంధించిన వివరాలు జీతం మీద ఆదాయం రూ.10,00,000 ఇంటి మీద అప్పు రూ.50,00,000. ఈ అప్పు మీద 10 శాతం రూ.5,00,000. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం మీ ఆదాయం, పన్ను భారం జీతం రూ.10,00,000 సర్దుబాటు/నష్టం రూ.5,00,000 నికర ఆదాయం రూ.5,00,000 పన్ను భారం రూ.20,000 కొత్త ప్రతిపాదనల ప్రకారం వడ్డీ సర్దుబాటుని కేవలం రూ.2,00,000లకే పరిమితం చేస్తారు. దీనివల్ల పన్ను భారం పెరుగుతుంది. జీతం రూ.10,00,000 ఇంటి మీద నష్టం రూ.5,00,000 కానీ పరిమితి వలన రూ.2,00,000 నికర ఆదాయం రూ.8,00,000 పన్ను భారం రూ.80,000 కొత్త ప్రతిపాదనల వల్ల పన్ను భారం పెరిగింది. సర్దుబాటు కాని నష్టం తర్వాత సంవత్సరానికి బదిలీ చేస్తారు. దీన్నే క్యారీ–ఫార్వర్డ్ అంటారు. ఈ ఉదాహరణలో రూ.3,00,000 వచ్చే ఆర్థిక సంవత్సరానికి సర్దుబాటు చేస్తారు. ఆ సర్దుబాటు కూడా కేవలం ఇంటి మీద ఆదాయం ఉంటేనే సర్దుబాటు చేస్తారు. లేదంటే బదిలీ చేస్తారు. ఇలా 8 సంవత్సరాల వరకు వెళతారు. ఇలాంటప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ వారికి అసలు ఏ మాత్రం సర్దుబాటు కాదు. అద్దెకిచ్చిన వారికి సర్దుబాటు కావచ్చు. ఇంటి మీద నష్టాన్ని, సర్దుబాటును వాయిదా వేయడం వలన అసెసీకి నష్టం. రెండు లక్షల వడ్డీ లోపు వారికి ఎటువంటి నష్టం లేదు. కానీ పెద్ద పెద్ద రుణాలు తీసుకొని ఇల్లు కొనడం వలన ఇన్కమ్ ట్యాక్స్ ప్రయోజనాలు తగ్గిపోయాయి. పన్ను భారానికి విద్యా సుంకం కలపాలి. -
సరికొత్తగా రాష్ట్ర బడ్జెట్!
ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులకు స్వస్తి సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్ను సరికొత్తగా రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను వేర్వేరుగా చూపించే పాత బడ్జెట్ సంప్రదాయానికి స్వస్తి పలికింది. ఆనవాయితీకి భిన్నంగా 2017–18 బడ్జెట్ తయారీకి కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులను వేర్వేరుగా ప్రతిపాదించాల్సిన అవసరం లేదని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులన్నీ ఒకేచోట ప్రతిపాదించాలని సూచించింది. రెండు వారాల్లో అన్ని శాఖలు తమ ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది. ఈసారి అన్ని శాఖలు తమ పరిధిలో జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, వడ్డీలు, బకాయిలను వేరుగా పంపించాలని సూచించింది. ప్రతిపాదనలను పక్కాగా రూపొందించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాలు సమీక్షించుకుని అంచనాలు పొందుపరచాలని పేర్కొంది. 2017–18లో వచ్చే రాబడులతో పాటు అవసరమయ్యే ఖర్చుల అంచనాలన్నీ నిర్దిష్టంగా పొందుపరిచాలని సూచించింది.