breaking news
brundavanam
-
అందుకు శ్రీకృష్ణ భగవానుడే తొలి మధ్యవర్తి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 150 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన పురాతన బాంకే బిహారీ ఆలయానికి సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం-ఆలయ ట్రస్టుల మధ్య నెలకొన్న వివాదాన్ని ఉన్నత స్థాయి కమిటి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బృందావన్లో ఉన్న బాంకే బిహారీ కృష్ణ దేవాలయం అంశానికి సంబంధించి ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రధానంగా రూ. 500 కోట్లను ఆలయ నిధులతో దేవాలయ అభివృద్ధి పనులను చేపట్టడానికి యూపీ ప్రభుత్వం సిద్ధం కాగా, ఆలయ ట్రస్టు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఇది సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఆలయ నిధులను అభివృద్ధికి వాడటానికి మే 15వ తేదీన సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వగా, తాజా తీర్పులో ఆ వివాదాన్ని ఓ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా సెటిల్ చేసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో గత తీర్పును ఉపసంహరించుకోవాలని ధర్మాసనం మౌఖికంగా ప్రతిపాదించింది ప్రస్తుత ధర్మాసనం.తొలి మధ్యవర్తి శ్రీకృష్ణ భగవానుడే..బాంకే బిహారీ ఆలయం-యూపీ ప్రభుత్వం వివాదంపై జస్టిస్ సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది. ‘ బృందావన్లోని బాంకే బిహారీ టెంపుల్కు తొలి మధ్యవర్తి శ్రీకృష్ణ భగవానుడే. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోండి. సమస్య పరిష్కారం కోసం ఓ కమిటీని ప్రతిపాదిస్తున్నాం. ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలయ ట్రస్టు బోర్డుకు మధ్యవర్తిత్వం వహిస్తుంది. గత సుప్రీంకోర్టు తీర్పులో కొంత భాగాన్ని నిలుపుదల చేద్దాం. హైకోర్టు మాజీ న్యాయమూర్తి లేక సీనియర్ రిటైర్డ్ జిల్లా జడ్జి ఇరు పక్షాలకు ధర్మకర్తగా ఉంటారు’ అని స్పష్టం చేసింది. ఇదీ ఆలయ చరిత్ర..1862లో నిర్మించబడిన ఈ ఆలయం రాజస్తానీ శైలిలో నిర్మించబడిందిఉత్తరప్రదేశ్లోని బాంకే బిహారీ ఆలయం బృందావన్లో ఉన్న శ్రీకృష్ణ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలాలలో ఒకటి.ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం.ఇక్కడ శ్రీ బాంకే బిహారీగా పూజించబడే కృష్ణుడు, బాలరూపంలో దర్శనమిస్తాడు.ప్రత్యేకత: ఈ ఆలయంలో గంటలు మోగించరు, హారతులు ఇవ్వరుఇది భక్తి శ్రద్ధలకు అడ్డురాకుండా ఉండేందుకు అనాదిగా వస్తున్న ఆచారం.ఏడాదిలో ఒక్కసారి మాత్రమే, అక్షయ తృతీయ రోజున మాత్రమే భక్తులు దేవుని పాదాలను దర్శించగలుగుతారు.వివాదం ఇలా.. ఆలయ అభివృద్ధికి సంబంధించి యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం ఆలయ ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత మే నెలలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ.. రూ. 500 కోట్లను కారిడార్ ప్రాజెక్ట్ కింద ఆలయ అభివృద్ధి కోసం వాడుకోవచ్చని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వంతో బాంకే బిహారీ టెంపుల్ ట్రస్టు మధ్య వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి కారణం రూ. 500 కోట్ల కారిడార్ ప్రాజెక్ట్. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ ప్రణాళికను తీసుకురాగా, ఆలయ ట్రస్ట్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. గత తీర్పును మౌఖికంగా నిలుపుదల చేస్తూ దీనిపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీన్ని హైకోర్టు లేదా, జిల్లా కోర్టు మాజీ జడ్జిల ద్వారా ఓ కమిటీ ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వంతో వివాదాన్ని పరిష్కరించడమే సరైన మార్గంగా పేర్కొంది. ఆలయ వారసత్వం దెబ్బతింటుందనే..యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆలయ అభివృద్ధి-నిధులు ఆర్డినెన్స్పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఒకవైపు ఆలయ ట్రస్ట్ అభ్యంతరంతో పాటు స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో మరమ్మత్తులు చేపడితే ఆలయ వారసత్వం, వాస్తవికత దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తమైంది. ఇది సున్నితమైన అంశం కావడంతో పాటు ఆధ్యాత్మిక వైభవం, సంప్రదాయాల సమతుల్యతలపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. -
బృందావనం!
– నేత్రపర్వంగా రాధాష్టమి వేడుకలు – వైభవంగా ప్రత్యేక పూజలు తిరుపతి కల్చరల్ : ఇస్కాన్ మందిరంలో శుక్రవారం రాధాష్టమి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. కృష్ణాష్టమి తర్వాత 15వ రోజు రాధాదేవి ఆవిర్భావ దినోత్సవం (రాధాష్టమి) నిర్వహించడం ఆనవాయితీ. ఏడాదిలో రెండు సార్లు రాధాదేవి అమ్మవారి దివ్య పాద దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీ రాధాష్టమి నాడు, కార్తీక మాసంలో వచ్చే గోపాష్టమి నాడు భక్తులు రాధాదేవి దివ్యపాద దర్శనం చేసుకొని తరిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం కమల మందిరంలో రాధాకృష్ణులకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాభిషేకం చేపట్టారు. బృందావనాన్ని తలపించేలా రాధాకృష్ణులతో పాటు గోపికలను వివిధ పుష్పాలు, ఫలాలతో సర్వాంగ సుందరంగా కొలువుదీర్చారు. శ్రీరాధా దేవిని ప్రత్యేకంగా ఫల, పుష్పాలు, పట్టుపితాంబర వస్త్రధారణలతో సుందరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వందలాది మంది భక్తులు రాధాదేవి దివ్యపాద దర్శనం చేసుకొని భక్తిపారవశంతో పులకించారు. హరినామ సంకీర్తనలు, భజనలు మార్మోగాయి. ఇస్కాన్ అధ్యక్షుడు రేవతీ రమణదాస్ శ్రీరాధాష్టమి విశిష్టతను తెలియజేశారు. భక్తులకు ఇస్కాన్ నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు. -
మా ఇల్లే బృందావనం
యాదగిరిగుట్ట: ఇంటి ఆవరణలోని మొక్కలకు రెక్కలు విచ్చుకున్న పూలను చూస్తే మనసుకు ఎక్కడ లేని హాయి కలుగుతుంది. పెరట్లో తులసీ మొక్క ఆ పక్కనే ఓ సన్నజాజీ తీగె మేడపైన గులాబీలు మనసుకు గిలిగింతలు పెడతాయి. ఎంత మానసిక ఒత్తిడి ఉన్నా ఈ మొక్కలను చూడగానే ఏదో తెలియని హాయి. ఇలాంటి ఇళ్లు నిజంగా బృందావనాలే.. ప్రస్తుతం కాంక్రీటు ప్రపంచంతో మొక్కలు కరువవుతున్నాయి. ఇళ్ల ముందు ప్లాస్టిక్ అలంకరణ వస్తువులే రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలో యాదగిరిగుట్ట పట్టణంలోని పలువురు మహిళలు తమ ఇâ¶ ్లలో పూలు, పండ్లు, కూరగాయలు తదితర మొక్కలను పెట్టి పోషిస్తూ.. పచ్చదనాన్ని కాపాడుతున్నారు. గార్డెనింగ్తో ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తున్నారు. సొంతంగా పండించిన పండ్లు, కూరగాయలు తింటూ ఆరోగ్యం పెంచుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. మా ఇళ్లే స్వర్గసీమ – బి.మౌనిక, యాదగిరిగుట్ట, గృహిణి చిన్నతనం నుంచి మొక్కలు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంటిలో సైకస్, పెంటకాస్, అలవేరాతో పాటు రంగురంగుల గులాబీ మొక్కలు పెంచుతున్నాను. మా ఇంట్లో ఐదు రకాల మందార మొక్కలు ఉన్నాయి. నూతన రకాల మొక్కలను సైతం కొనుగోలు చేసి పెంచుతున్నాను. గార్డెనింగ్తో వ్యాయామం అవుతుంది. కొత్తరకం మొక్కలన్నీ మా ఇంట్లో.. గొట్టిపర్తి మా«ధురి, బీసీ కాలనీ గత 20ఏళ్ల నుంచి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుతున్నా. బయటకు వెళ్లినప్పుడు కొత్త రకం మొక్క కనిపిస్తే కొని ఇంటి ఆవరణలో నాటుతా. రంగురంగుల పూలమొక్కలు మదికి ఆనందం కలిగిస్తాయి. వేసవిలోనూ మా ఇంటి ముంగిలి పచ్చగా ఉంటుంది. ఇప్పటి వరకు మా ఇంట్లో రూ.లక్ష ఖర్చు పెట్టి మొక్కలను కొనుగోలు చేశాను. మా బంధువులకు సైతం ఇంట్లో రంగురంగుల మొక్కల గురించి చెబుతుంటాను. ఇంట్లో కూరగాయలు.. పూల మొక్కలే..– హరిప్రియ, గృహిణి, యాదగిరిపల్లి మాకున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఆకుకూరలు, కూరగాయాలు, పూల మొక్కలను నాటుకున్నాం. తెల్ల గన్నెర, మందార, గులాబీ పూలతో మా ఇంటికి ఎంతో అందం వచ్చింది. తోటకూర, పాలకూర, కొత్తిమీరతో పాటు బీరకాయలు, సోరకాయల పాదు మొక్కలను నాటాను. ప్రతి రోజు వాటికి కావలిసిన నీటిని పోసి సంరక్షిస్తున్నాం. ఇంటో పండిన కూరగాయల రుచే వేరు.