breaking news
BC welfare union
-
బీజేపీ భూస్థాపితం కాకతప్పదు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ గాంధీనగర్ : రాజ్యసభలో ప్రత్యేకహోదా బిల్లును అడ్డుకున్న బీజేపీని భూస్థాపితం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటమహేష్ పిలుపునిచ్చారు. లెనిన్సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా బిల్లును అడ్డుకున్న బీజేపీ భరతం పట్టాలన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్తో చేతులు కలిపిన బీజేపీ ప్రత్యేక హోదాకోసం పెట్టిన ప్రైవేటు బిల్లుకు ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రైవేటు బిల్లును ఓటింగ్కు రాకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతివ్వని పార్టీలు రానున్న ఎన్నికల్లో మట్టికరచిపోతాయన్నారు. ప్రైవేటు బిల్లు విషయంలో రాజకీయ పార్టీలు అనుసరించిన తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు రగులుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు కామరాజు హరీష్, గ్రంథి మహేష్, బత్తుల వెంకటేష్, అప్పలరెడ్డి, గిరీష్, రజాక్, చందు, నూకరాజు, చిన్నా పాల్గొన్నారు. 23విఐసి162– దిష్టిబొమ్మ దహనం చేసు్తన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులు -
'విద్యార్థుల జీవితంతో ప్రభుత్వం చెలగాటం'
కొత్తకోట (మహబూబ్నగర్ జిల్లా) : విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీసీ సంక్షేమ సంఘం ఆరోపించింది. విద్యార్ధుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కొత్తకోటలో బీసీ సంక్షేమ సంఘం గురువారం కొత్తకోట చౌరస్తాలో దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తాలుకా ప్రధాన కార్యదర్శి జి. యుగంధర్ యాదవ్ మాట్లాడుతూ.. గత ఏడాది ఫీజుల బకాయిలు రూ. 850 కోట్లను ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. ఇంటర్మీడియట్ కోర్సు ఫీజులు రూ. 1800 నుంచి రూ. 8 వేలకు పెంచాలన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులు ప్రభత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు.