breaking news
Ayodhya Balak Ram
-
500 ఏళ్ల సంకల్పం నెరవేరింది: ధ్వజారోహణలో ప్రధాని మోదీ
అయోధ్య: అయోధ్య రామాలయంపై కాషాయ వర్ణపు సూర్యవంశీ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్రమోదీ.. రామాలయం నిర్మాణం పూర్తయినట్లు ప్రకటించారు. ధ్వజారోహణం కార్యక్రమంతో 500 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరిందన్నారు. భారతీయులు తమ వారసత్వ సంపదపై గర్వపడాలని, బానిసత్వ మనస్తత్వం నుండి బయటపడాలని అన్నారు. దేశం పురోగతి సాధించాలంటే రాబోయే పదేళ్లలో భారతదేశాన్ని ఈ మనస్తత్వం నుండి విముక్తి చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో గల నూతన రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం ఉదయం 11:55 గంటలకు శుభ అభిజిత్ ముహూర్తం సందర్భంగా ప్రారంభమై, 10 నిమిషాల పాటు సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంయుక్తంగా ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేశారు. #WATCH | Ayodhya Dhwajarohan | Uttar Pradesh CM Yogi Adityanath presents miniature models of the Saffron Flag ceremonially hoisted on the 'shikhar' of Shri Ram Janmbhoomi Mandir and Ram Lalla idol at the temple, to PM Narendra Modi and RSS Sarsanghchalak Mohan Bhagwat. (Video:… pic.twitter.com/dYljcoBpts— ANI (@ANI) November 25, 2025ఈ చారిత్రాత్మక ఘట్టం వేద మంత్రాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య జరిగింది. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. తరువాత ఆయన నగరంలో రోడ్షో నిర్వహిస్తూ, రామమందిరం వైపు తరలి వెళ్లారు. దారిలో ప్రజలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. మార్గంమధ్యలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రిని స్వాగతించారు.ధ్వజారోహణ వేడుకల సందర్భంగా జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘ఈ రోజు అయోధ్యకు ఒక సాంస్కృతిక మేల్కొలుపు. ఒక చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యం. ప్రపంచమంతా శ్రీరాముని భక్తిలో మునిగిపోయింది. శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నందున ప్రతి రామభక్తుడి హృదయం ఆనందంతో నిండిపోయింది’ అని అన్నారు. ఆలయంలో తాను ఎగురవేసిన కాషాయ జెండా సంకల్పానికి ప్రతీక అని, ఇది మనల్ని మేల్కొల్పుతుంది. అంకితభావం వైపు నడిపిస్తుందని అన్నారు. పతాకం అనేది బ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తుంది. ఇక్కడ సత్యం, ధర్మం స్థాపితమయ్యాయి. వీటి విజయాన్ని ఇది సూచిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. నేడు భారతదేశం అంతా రామమయం అయ్యింది. ప్రతి రామ భక్తుడి హృదయంలో అసాధారణ సంతృప్తి నిండింది. అపరిమితమైన కృతజ్ఞత వ్యక్తమవుతోంది. శతాబ్దాల సంకల్పం నేడు నెరవేరిందని ప్రధాని మోదీ అన్నారు. #WATCH | Ayodhya Dhwajarohan | PM Modi says, "... This Dharma Dhwaja is not just a flag. It is the flag of the rejuvenation of Indian civilisation. The Saffron colour, Suryavansh's signia, the 'Om' word, and the Kovidara tree impersonate Ram Rajya's glory. This flag is a… pic.twitter.com/sGgCPEJbLu— ANI (@ANI) November 25, 2025ఒక వ్యక్తి ఉన్నతునిగా.. విలువలు, సంస్కృతి ద్వారా ఎలా రూపుదిద్దుకుంటాడో రాముడు ప్రపంచానికి చూపించిన నగరం అయోధ్య అని ప్రధాని మోదీ అన్నారు. రాముడు అయోధ్య నుండి వనవాసానికి వెళ్ళినప్పుడు, అతను ఒక యువరాజు, కానీ అతను తిరిగి వచ్చినప్పుడు, ధర్మానికి ప్రతిరూపంగా, మర్యాద పురుషోత్తమ రామునిగా తిరిగి వచ్చాడు అని అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ ‘ఈ రోజు అందరి ఆశలు నెరవేరిన దినం. రామజన్మభూమి లక్ష్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి ఆత్మలు ఈ రోజు సంతృప్తి చెందుతాయి’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘ఈ పవిత్ర దినం.. రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలను త్యాగం చేసిన యోధులకు అంకితం అని అన్నారుకాగా రామమందిరంపై 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు గల కాషాయ జెండాను ఒక బటన్ నొక్కడం ద్వారా ప్రధాని మోదీ ఎగురవేశారు. జెండాపై రాముని పరాక్రమాన్ని సూచించే ప్రకాశవంతమైన సూర్యుని చిత్రం, ‘ఓం’, 'శిఖరం మొదలైనవి ఉన్నాయి. #WATCH | Ayodhya Dhwajarohan | Devotees rejoice as the saffron flag rises atop Shri Ram Janmabhoomi Temple Shikhar, constructed in the traditional North Indian Nagara architectural style. The right-angled triangular flag, measuring ten feet in height and twenty feet in length,… pic.twitter.com/585WR9gtAw— ANI (@ANI) November 25, 2025#WATCH | Ayodhya Dhwajarohan | Prime Minister Narendra Modi offers prayers at the Sheshavtar Mandir ahead of the historic flag hoisting at Shri Ram Janmabhoomi Temple(Source: DD) pic.twitter.com/o2hcuBMF7g— ANI (@ANI) November 25, 2025రామ జన్మభూమిలో ధ్వజారోహణకు ముందు ప్రధాని నర్రేంద మోదీ వేద మంత్ర మంత్రోచ్ఛారణల నడుమ బాలక్ రామ్ను దర్శనం చేసుకున్నారు. ఈ సమయంలో ఆయన వెంట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. అలాగే వీరిరువురూ శేషావతార మందిర్లో ప్రార్థనలు చేశారు. మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, మహర్షి వాల్మీకి, దేవి అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరిలను దర్శించారు. सप्तपुरियों में श्रेष्ठ श्री अयोध्या धाम में प्रभु श्री राम जन्मभूमि मंदिर के शिखर पर आज आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के कर-कमलों से भव्य भगवा ध्वज का आरोहण होने जा रहा है।सनातन संस्कृति के पुनर्जागरण का यह दिव्य संदेश पूरे भारतवर्ष में अदम्य आध्यात्मिक आत्मिक… pic.twitter.com/pYVxzOdAug— Yogi Adityanath (@myogiadityanath) November 25, 2025 -
అయోధ్య: ప్రాణప్రతిష్ఠ నుంచి నేటి ధ్వజారోహణ వరకూ..
అయోధ్య: కోట్లాది రామ భక్తుల కల నేటి(మంగళవారం)తో సంపూర్ణమయ్యింది. భారత నాగరికత, ధర్మానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామాలయ నిర్మాణం చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ చారిత్రక ప్రయాణంలోని కీలక ఘట్టాలు, వాటి వివరాలు ఇలా..రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన తేదీ: జనవరి 22, 2024, సోమవారంరామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన ఘట్టం కోసం జనవరి 16, 2024 నుండే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. బాలాజీ తాంబట్ నేతృత్వంలోని వేద పండితులు ఏడు రోజుల పాటు జరిపిన అధివాస క్రతువులు (తీర్థ పూజ, జలయాత్ర, ధాన్యాధివాసం, ఘృతాధివాసం) తర్వాత ప్రధాన ఘట్టం ప్రారంభమైంది.ప్రధాని మోదీ దీక్ష ప్రాణ ప్రతిష్ఠాపనకు ముందు, ప్రధాని మోదీ 11 రోజుల పాటు కఠినమైన అనుష్ఠానం (నియమ నిష్ఠలు, ఉపవాసం) పాటించారు.ముహూర్తం అత్యంత శుభప్రదమైన అభిజిత్ ముహూర్తంలో (మధ్యాహ్నం 12:15 నుండి 12:45 వరకు), ప్రధాని మోదీ కర్తగా గర్భగుడిలో ఐదేళ్ల బాల రాముడి (రామ్లల్లా) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అరుణ్ యోగిరాజ్ చెక్కిన ఈ 51 అంగుళాల శ్యామల వర్ణ విగ్రహంపై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దశావతారాలు కూడా ఉన్నాయి.దేశమంతా పండుగఅయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠాపనను దేశమంతా ఒక పండుగలా జరుపుకుంది. యావత్ ప్రపంచం ఈ ఘట్టాన్ని వీక్షించింది. హిందూ ధర్మంలో కొత్త శకం ప్రారంభమయ్యిందని పండితులు అభివర్ణించారు.రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠాపన (రాజా రాముడి ప్రతిష్ఠ)తేదీ: జూన్ 5, 2025, గురువారంరామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం నాటికి ఆలయ సముదాయంలోని మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయింది. గర్భగుడిలో బాల రాముని దర్శనం తర్వాత, భక్తులకు శ్రీరామ దర్బార్ దర్శనం లభించింది.ప్రతిష్ఠాపన ఈ దర్బార్లో రాముడిని యువరాజు రూపంలో కొలువుదీర్చారు. భార్య సీతా దేవి, తమ్ముడు లక్ష్మణుడు, పరమ భక్తుడు హనుమంతుని విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ఈ సమయానికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన పలు నిర్మాణాలు పూర్తిచేసుకుని భక్తులకు అందుబాటులోకి వచ్చాయి.ధ్వజారోహణం (ధర్మ ధ్వజం ప్రతిష్ఠ)తేదీ: నవంబర్ 25, 2025, మంగళవారంధ్వజారోహణం అనేది ఆలయ నిర్మాణం, ధార్మిక సంస్థాపనలో చివరి, అత్యంత ముఖ్యమైన వేడుక. ఈ రోజున ఆలయ శిఖరంపై ధర్మ ధ్వజాన్ని (కాషాయ జెండాను) ఎగురవేస్తారు. ధ్వజారోహణం అనేది ఆలయ ధార్మిక శక్తిని, ధర్మ సంస్థాపన విజయాన్ని సూచిస్తుంది. ఇది దేవాలయ నిర్మాణం పూర్తయిందని తెలియజేస్తుంది. నేడు జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ , ట్రస్ట్ సభ్యులు తదితరులు హాజరు కానున్నారు.ఇది కూడా చదవండి: నేడు అయోధ్యలో మహా ఘట్టం -
అయోధ్యకు క్యూ కట్టిన భక్తులు.. ఇప్పటి వరకు దర్శనాలు, హుండీ..
అయోధ్య: యూపీలోని అయోధ్య మందిరానికి భక్తులు క్యూ కడుతున్నారు. బాలరాముడిని చూసేందుకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఇక, కేవలం 11 రోజుల్లోనే ఏకంగా 25 లక్షల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో రూ.11 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, అయోధ్యలోని బాలక్ రాముడి దర్శన మార్గంలో నాలుగు హుండీలను ఏర్పాటు చేశారు. ఇక, గత 11 రోజుల్లో 25లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.8 కోట్లు నగదు రూపంలో, రూ.3.5 కోట్లు చెక్కుల రూపంలో వచ్చాయి. ఇందులో ఆన్లైన్ విరాళాలు కూడా ఉన్నాయి. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీల్లోని విరాళాలను లెక్కించింది. ఇక, భక్తులు కానుకలు సమర్పించడం నుంచి వాటిని లెక్కింపు వరకూ అంతా సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలోనే జరుగుతుందని ఆలయ ట్రస్టు ఆఫీస్ ఇన్ఛార్జి ప్రకాశ్ గుప్తా తెలిపారు. VIDEO | Devotees continue to throng Ayodhya's Ram Mandir for 'darshan' of Ram Lalla. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#AyodhyaRamMandir pic.twitter.com/cweNluhV8U — Press Trust of India (@PTI_News) February 2, 2024 ఇదిలా ఉండగా.. భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలరాముడి మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి. #WATCH | Uttar Pradesh: Devotees gather at Rampath for the darshan of Ram Lalla at Shri Ram Janmabhoomi Temple in Ayodhya. pic.twitter.com/tpmVFU2jH0 — ANI (@ANI) February 2, 2024 -
Ayodhya: అయోధ్యకు వెళ్లే బస్సులు రద్దు!
ఢిల్లీ: అయోధ్య బాలక్ రామ్ మందిర్కు ఎగబడుతున్న భక్తులకు, సందర్శకులకు పెద్ద షాకే తగిలింది. అయోధ్య వైపు వెళ్లే బస్సులను రద్దు చేస్తున్నట్లు బుధవారం అక్కడి రవాణా శాఖ ప్రకటించింది. తిరిగి బస్సులు ఎప్పుడు నడుస్తాయనేది ఇప్పట్లో చెప్పలేమని స్పష్టం చేసింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట తర్వాత ‘బాలక్ రామ్’ దర్శనం కోసం భక్తులు ఎగబడి పోతున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య వైపు అడుగులేస్తున్నారు. తొలిరోజే ఏకంగా ఐదు లక్షల మంది దర్శించుకునేందుకు వచ్చినట్లు ఓ అంచనా. అందులో 3 లక్షల మందిదాకా దర్శించుకోగా.. మరో రెండు లక్షల మంది బయట ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ క్రమంలో నిన్న అధికారులకు భక్తుల నియంత్రణ కష్టతరంగా మారింది. ఇదీ చదవండి: బాలక్ రామ్ కోసం.. ఈ నిరీక్షణ చూశారా? దీంతో ఇవాళ కేంద్ర బలగాలను సైతం మోహరించారు. మొత్తం అయోధ్యలో 8 వేలమంది సిబ్బందిని భద్రత కోసమే మోహరించారు. అదే సమయంలో లక్నో, ఇతర ప్రాంతాల నుంచి అయోధ్యకు బస్సుల్లో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో రద్దీని నిలువరించేందుకు బస్సు సర్వీసులన్నింటినీ రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తేనే తిరిగి సర్వీసులు నడుపుతామని ఓ అధికారి మీడియాకు వివరించారు. ఇక.. దైవదర్శనం కోసం తొందరపడొద్దని.. రెండు వారాల తర్వాత రద్దీ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయని భక్తులకు, సందర్శకులకు అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు నిదానంగా రావాలని కోరుతున్నారాయన.


