
మెట్రో స్టేషన్లో ఉరేసుకున్న మహిళ!
మెట్రో స్టేషన్లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది
ఇంకా మృతురాలి వివరాలు తెలియరాలేదని, సూసైడ్ లేఖ లాంటివి కూడా ఘటనాస్థలంలో దొకరలేదని పోలీసులు తెలిపారు. ఫ్లాట్ఫామ్ మీద ఉన్న సీసీటీవీ కెమెరాలలోని దృశ్యాలను సేకరించిన పోలీసులు.. ఈ దృశ్యాల ఆధారంగా ఆ మహిళ స్టోర్రూమ్లోకి ఎలా వెళ్లింది? అనేది తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మామూలుగా నిర్మానుష్యంగా ఉండే స్టోర్రూమ్ (గోదాం గది)లోకి ఆమె వెళ్లి.. బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని, ఆమె ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.