ప్రవాస భారతీయ దివస్ కు యూపీ సీఎం డుమ్మా | UP CM skips Pravasi Bhartiya Divas in Gujarat | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయ దివస్ కు యూపీ సీఎం డుమ్మా

Jan 9 2015 8:07 PM | Updated on Sep 2 2017 7:27 PM

ప్రవాస భారతీయ దివస్ కు యూపీ సీఎం డుమ్మా

ప్రవాస భారతీయ దివస్ కు యూపీ సీఎం డుమ్మా

గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరుకాలేకపోయారు.

లక్నో: గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్ కు  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరుకాలేకపోయారు. విమాన ప్రయాణానికి ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారడంతో వేడుకలకు అఖిలేష్ రాలేకపోయారు.

కాగా, గుజరాత్ లో పెట్టిన అఖిలేష్ యాదవ్ పోస్టర్లు, హోర్డింగ్ లను తొలగించడంతో తమ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాజ్ వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకుంటారని, కానీ ఆయన మద్దతుదారులు.. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ముఖ్యమంత్రి పోస్టర్లు పీకేశారని ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement