మరో రూ. 200 కోట్లు చెల్లించండి.. | Subrata Roy to deposit another Rs 200 cr to remain on parole | Sakshi
Sakshi News home page

మరో రూ. 200 కోట్లు చెల్లించండి..

Oct 21 2016 5:11 PM | Updated on Sep 4 2017 5:54 PM

మరో రూ. 200  కోట్లు చెల్లించండి..

మరో రూ. 200 కోట్లు చెల్లించండి..

సహారా సంస్థల చీఫ్‌ సుబ్రతారాయ్‌ కి సుప్రీంకోర్టు మరోసారి ఊరటను కల్పించింది. సహారా అధిపతి పెరోల్‌ ను నవంబరు 28వ తేదీవరకు పొడిగించింది.

న్యూఢిల్లీ: సహారా సంస్థల చీఫ్‌ సుబ్రతారాయ్‌ కి సుప్రీంకోర్టు మరోసారి ఊరటను కల్పించింది.  సహారా అధిపతి పెరోల్‌  ను నవంబరు 28వ తేదీవరకు పొడిగించింది.  సహారా గ్రూప్‌ సెబీకి ఈ నెలాఖరుకు రూ.200కోట్లు డిపాజిట్‌ చేయడానికి అంగీకరించడంతో కోర్టు ఈ ఆయనకు  వెసులుబాటును  కల్పించింది.  నవంబరు 28 లోపు  200 కోట్ల  రూపాయలను చెల్లించాలని  చీఫ్ జస్టిస్ టీ.ఎస్ థాకూర్, జస్టిస్ అనిల్  దావే,  ఏకే సిక్రీ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
 
ఈ కేసు విచారణ సందర్భంగా   సెప్టెంబర్28 నాటి కోర్టు ఆదేశాల ప్కారం  సహారా  న్యాయవాదిబశుక్రవారం రూ.215కోట్లు డిపాజిట్‌ చేశారు.  మరో రూ.200కోట్లను ఈ నెలాఖరుకు డిపాజిట్‌ చేయనున్నట్టు కోర్టుకు స్పష్టం చేసింది. అలాగే గతంలో సుప్రీం ఆదేశాలకు మేరకు  సెబీకి రూ.12వేల కోట్లు ఏ విధంగా చెల్లిస్తారనే అంశంపై సుబ్రతారాయ్‌ న్యాయవాది కోర్టుకు రోడ్‌ మ్యాప్‌ అందజేశారు.  డిసెంబరు 2018 నాటికి సహారా పూర్తి చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

కాగా సెబీలో అవకతవకల కేసులో సుబ్రతారాయ్‌ రెండేళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ ఏడాది  మే నెలలో తల్లి మరణించడంతో పెరోల్‌పై బయటకు వచ్చారు. సెబీకి రూ.500కోట్లు చెల్లించే ఒప్పందంతో కోర్టు గతంలో పెరోల్‌ పొడిగించిన న్యాయస్థానం  షరతులతో పెరోల్‌ పొడిగిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement