- రేవంత్కు తొలుత జైలు.. ఆనక బెయిల్
- బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకెళ్లిన ఏసీబీ
- విజయవాడలో కేసు పెట్టిన మత్తయ్య
- దాని ఆధారంగా తెలంగాణ పోలీసులకు నోటీసులు
- సినిమా కథను తలపించిన ఎమ్మెల్యే సండ్ర ఎపిసోడ్
- విచారణకే హాజరుకాని జిమ్మిబాబు
- కేసు దర్యాప్తులో 42 మందిని సాక్షులుగా విచారించిన ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు ఎరవేసిన ‘ఓటుకు కోట్లు’ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తొలుత టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డితో పాటు బిషప్ సెబాస్టియన్, రుద్రఉదయ్సింహలను అదుపులోకి తీసుకొన్న ఏసీబీ... వారిని విచారించిన అనంతరం అరెస్టు ప్రకటించింది. వీరిని వరుసగా ఏ-1, ఏ-2, ఏ-3 పేర్కొంది. అలాగే కుట్రలో జెరూసలెం మత్తయ్యకు పాత్ర ఉండటంతో అతన్ని ఏ-4గా పేర్కొంది. గతేడాది మే 31న ఏసీబీ కేసు నమోదు చేసింది. తర్వాత ఏ-4 మత్తయ్య విజయవాడకు మకాం మార్చాడు.
తనను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని, బెదిరింపులకు గురిచేస్తోందంటూ విజయవాడ కమిషనరేట్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదైంది. తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు ఏసీబీ తనను అరెస్టు చేయకూడదం టూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాడు. మత్త్త య్య తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు వచ్చి వాదనలు వినిపించారు. ఒకానొక సందర్భంలో ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు.
రేవంత్ విషయంలో సుప్రీంకోర్టుకు...
ఓటుకు కోట్లు కేసులో ఏ-1 నిందితుడు రేవంత్రెడ్డి విషయంలో ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అతనికి బెయిల్ మంజూరు కాకుండా ఉండేందు ఏసీబీ శతవిధాల ప్రయత్నించింది. ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన నెల రోజుల తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. రేవంత్కు మొదట బెయిల్ ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరించింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ చేసిన విజ్ఞప్తి మేరకు... కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అయితే నెల రోజుల తర్వాత రేవంత్రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. అప్పటికే 14రోజుల కస్టడీ ముగియడం, ఆధారాలన్నీ ఏసీబీ సేకరించినందున హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కేవలం కొడంగల్ నియోజవర్గానికి మాత్రమే పరిమితం కావాలని సూచించింది. అంతేకాదు దర్యాప్తు అధికారులు ఎప్పుడు కోరితే అప్పుడు వారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. పాస్పోర్టులనూ స్వాధీనం చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఏపీలో తలదాచుకున్న సండ్ర
కేసు విచారణలో భాగంగా టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అత్యంత కీలకమని భావించిన ఏసీబీ అతనికి నోటీసులు జారీ చేసింది. మొదట సాక్షిగా పేర్కొంటూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. అయితే సండ్ర దాదాపు 15 రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రేవంత్రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తర్వాత సండ్ర బయటకు వచ్చా రు. తనకు ఆరోగ్యం బాగోలేక రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు పేర్కొన్నారు. ఏసీబీ విచారణకు పిలిస్తే వస్తానంటూ ఆయనే లేఖలు రాశారు. ఆ లేఖలో తన సెల్ నంబర్ ఇచ్చి.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానంటూ ప్రకటించారు. దీంతో ఏసీబీ మరోసారి సండ్రకు నోటీసులు జారీ చేస్తూ.. సీఆర్పీసీ 41(ఏ) కింద నింది తుల జాబితాలో చేర్చింది. ఏసీబీ నోటీసుల నేపథ్యంలో సండ్ర విచారణకు హాజరు కాగా రెండు రోజుల అనంతరం అరెస్టు ప్రకటించింది. అతను కూడా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు.
లోకేశ్ కారు డ్రైవర్కు నోటీసులు..
దర్యాప్తులో భాగంగా ఏసీబీ దాదాపు 42 మందిని విచారించింది. వీరిలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన వేం నరేందర్రెడ్డితో పాటు అతని కుమారుడుని కూడా ఏసీబీ విచారించింది. వీరితో పాటు టీడీపీ కార్యాలయంలో పనిచేసే వారితో పాటు రేవంత్ డ్రైవర్, గన్మెన్స్ ఇలా ముఖ్యమైన వారందినీ విచారించింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అనుచరులను కూడా ఏసీబీ మూడు రోజుల పాటు విచారించింది. లోకేశ్ కారు డ్రైవర్ కొండల్రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. అయితే అతను మాత్రం విచారణకు హాజరు కాలేదు. అలాగే తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిమ్మిబాబుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జిమ్మిబాబు కొంత కాలం పశ్చిమగోదావరిలోని ఒక టీడీపీ నేత నివాసంలో ఆశ్రయం పొందినట్లు ఏసీబీ గుర్తించింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అతన్ని ఇప్పటి దాకా విచారించలేదు.
ఓటుకు కోట్లు కేసులో అనేక ట్విస్టులు
Published Tue, Aug 30 2016 1:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
Mitchell Starc And Alyssa Healy: భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
Advertisement