
సన్ ఫార్మాలో ర్యాన్బాక్సీ విలీనం పూర్తి
ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాలో ర్యాన్బాక్సీ విలీనం పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన అనుమతులన్నీ రావడంతో
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాలో ర్యాన్బాక్సీ విలీనం పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన అనుమతులన్నీ రావడంతో విలీన ప్రక్రియ పూర్తయినట్లేనని సన్ ఫార్మా ఇండస్ట్రీస్ పేర్కొంది. ఆయా హైకోర్టుల నుంచి వచ్చిన అనుమతులను సంబంధిత రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు సమర్పించినట్లు వివరించింది. 2014 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లవుతుందని కంపెనీ తెలిపింది. గతేడాది ఏప్రిల్లో ర్యాన్బాక్సీని 4 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేస్తున్నట్లు సన్ ఫార్మా ప్రకటించిన సంగతి తెలిసిందే.