బ్రిటన్ రాణి ఎలిజబెత్ జీతం పెరిగింది. ఒకవైపు బ్రెగ్జిట్ ప్రభావంతో ఆర్థికవ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నా, రాణీగారి జీతానికి మాత్రం ఎక్కడా ఢోకా లేదు. ఆమె జీతం నెలకు దాదాపు రూ. 2 కోట్లు పెరిగినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్లోనే అత్యంత ధనవంతులైన రియల్ ఎస్టేట్ ఓనర్లు క్రౌన్ ఎస్టేట్ ఆదాయంలో శాతానికి అనుగుణంగా రాణీగారి జీతాన్ని నిర్ణయిస్తారట. గడిచిన సంవత్సరంలో క్రౌన్ ఎస్టేట్ దాదాపు 2,711 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు అందించింది. రాయల్ ఎస్టేట్ చెల్లించిన మిగులు మొత్తంలో 15శాతాన్ని రాణీగారికి చెల్లిస్తారు. ముగ్గురు రాయల్ ట్రస్టీలు, ప్రధానమంత్రి, ఖజానా ఛాన్స్లర్ మాత్రమే రాణీగారి జీతాన్ని మార్చగలరు.
2017-18 సంవత్సరానికి రాణీగారి సంపాదన ఎంత ఉంటుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పడం కష్టమని బకింగ్హామ్ ప్యాలెస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2015-16 సంవత్సరంలో 5.35 కోట్ల డాలర్ల సంపాదన రాగా, అందులో దాదాపు 2 కోట్ల డాలర్లను బకింగ్హామ్ ప్యాలెస్, విండ్సర్ కేజిల్, ఇతర రాజభవనాల నిర్వహణకే ఖర్చుపెట్టారట. రాణీగారు, ఆమె కుటుంబ సభ్యుల ప్రయాణాలకు దాదాపు 54 లక్షల డాలర్లు ఖర్చయింది.
రాణీగారి జీతం పెంపు ఎంతో తెలుసా?
Published Wed, Jun 29 2016 9:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement