మార్కెట్ వద్ద బాంబు పేలుడు: అయిదుగురు మృతి | Five killed in market blast in Afghanistan | Sakshi
Sakshi News home page

మార్కెట్ వద్ద బాంబు పేలుడు: అయిదుగురు మృతి

Jul 24 2014 2:38 PM | Updated on Apr 4 2019 5:24 PM

ఆఫ్ఘానిస్థాన్ టక్కర్ ప్రావెన్స్లోని ఖ్వాజాగఢ్ జిల్లా స్థానిక మార్కెట్ వద్ద మంగళవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది.

కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ టక్కర్ ప్రావెన్స్లోని ఖ్వాజాగఢ్ జిల్లా స్థానిక మార్కెట్ వద్ద మంగళవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో అయిదుగు అక్కడికక్కడే మరణించారు. మరో 21 మంది గాయపడ్డారని ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు తెలిపారు. మార్కెట్లో జనం అత్యంత రద్దీగా ఉన్న సమయంలో ఆ బాంబు పేలుడు సంభవించిందని చెప్పారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ బాంబు పేలుడుకు తామే బాధ్యులమని ఇంతవరకు ఎవరు ప్రకటించ లేదన్నారు. అయితే ఇది తాలిబాన్ తీవ్రవాదుల పనే అని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది మొదటి ఆరునెలలో ఆఫ్ఘానిస్థాన్లో జరిగిన హింస కారణంగా 1560 మంది మృత్యువాత పడగా, 3290 మంది గాయపడ్డారని కాబూల్లోని యూఎన్ మిషన్ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement