ఎయిర్‌ఏషియా ఇండియా టేకాఫ్‌కు లైన్‌క్లియర్ | air asia india line clear to take off | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఏషియా ఇండియా టేకాఫ్‌కు లైన్‌క్లియర్

Sep 27 2013 2:35 AM | Updated on Sep 1 2017 11:04 PM

దేశీయంగా విమానయాన సర్వీసులు ప్రారంభించేందుకు కీలకమైన ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ)’ లభించినట్లు ఎయిర్‌ఏషియా ఇండియా తెలిపింది.

 న్యూఢిల్లీ: దేశీయంగా విమానయాన సర్వీసులు ప్రారంభించేందుకు కీలకమైన ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ)’ లభించినట్లు ఎయిర్‌ఏషియా ఇండియా తెలిపింది. పౌర విమానయాన శాఖ దీన్ని గత వారమే ఇచ్చిందని, ప్రస్తుతం లాంఛనంగా ఇది వెల్లడిస్తున్నామని కంపెనీ మాతృ సంస్థ ఎయిర్‌ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్.. సోషల్ నెట్‌వర్కింగ్ సైటు ట్విటర్‌లో పేర్కొన్నారు.  ఎన్‌వోసీ చేతికి రావడంతో, సర్వీసులు వేగవంతంగా ప్రారంభించే దిశగా.. షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ (ఫ్లయింగ్ పర్మిట్) పొందేందుకు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఎయిర్‌ఏషియా ఇండియా సీఈవో మిట్టు చాండిల్య పేర్కొన్నారు. భారత్‌లో విమానయానాన్ని మరింత అందుబాటు స్థాయిలోకి తెచ్చి, ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చగలమన్నారు. మలేషియన్ సంస్థ ఎయిర్‌ఏషియా, టాటా గ్రూప్, టెలిస్ట్రా కలిసి ఎయిర్‌ఏషియా ఇండియాను ఏర్పాటు చేశాయి. ముందుగా చెన్నై, బెంగళూరు, తిరుచిరాపల్లి, కొచ్చి, కోల్‌కతా వంటి నగరాలకు ఎయిర్‌ఏషియా ఇం డియా సర్వీసులు ప్రారంభించాలని భావిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement