ఇంట్లో పేలుడు: 10 మంది సజీవ దహనం


కాబుల్:  ఆప్ఘనిస్తాన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10మంది సజీవ దహనమయ్యారు. హెరాత్ నగరంలో ఈ దుర్ఘటన  చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కాబుల్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో మంటలు వ్యాపించటంతో ఇల్లంతా పూర్తిగా కాలిపోయింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top